Ind vs Pak Champions Trophy 2025 : ఐసీసీ నిర్వహించే ఏ టోర్నమెంట్లో అయినా భారత్- పాకిస్థాన్ మ్యాచ్కు ఉండే హైప్ వేరు. ఈ హై వోల్టేజ్ మ్యాచ్ కోసం ఈ రెండు జట్ల అభిమానులే కాదు, వరల్డ్వైడ్గా క్రికెట్ ఫ్యాన్స్ ఎదురుచూస్తుంటారు. ఈ క్రమంలో తాజాగా దాయాది దేశాలు మరో సమరానికి సిద్ధమయ్యాయి. ప్రస్తుతం జరుగుతున్న ఛాంపియన్స్ ట్రోఫీలో ఆదివారం భారత్- పాక్ అమీతుమీ తేల్చుకోనున్నాయి. 2017 ఫైనల్ ఓటమికి ప్రతీకారం తీర్చుకోవాలన్న కసితో భారత్ బరిలోకి దిగనుంది.
జోష్లో టీమ్ఇండియా
ఈ టోర్నీలో తొలి మ్యాచ్లో బంగ్లాపై నెగ్గిన టీమ్ఇండియా అదే ఊపులో పాక్తో సమరానికి రెడీ అవుతోంది. కెప్టెన్ రోహిత్ శర్మ టచ్లోకి రాగా, గిల్ ఫుల్ ఫామ్లో ఉన్నాడు. పాకిస్థాన్పై మంచి ట్రాక్ రికార్డ్ ఉన్న విరాట్ ఈసారి కూడా చెలరేగితే భారీ స్కోర్ ఖాయం. ఇక బౌలింగ్ దళం మరోసారి రాణిస్తే టీమ్ఇండియాకు తిరుగు ఉండదు.
ఓడితే అంతే
అటు పాకిస్థాన్ పరిస్థితి భిన్నంగా ఉంది. మనం విజయంతో టోర్నీని ప్రారంభించగా, పాక్కు తొలి మ్యాచ్లో ఓటమి ఎదురైంది. ఈ బాధలో ఉండగానే స్టార్ బ్యాటర్ ఫకర్ జమాన్ దూరమయ్యాడు. ఈ పరిస్థితుల్లో బలమైన భారత్ను ఢీ కొట్టేందుకు రెడీ అవుతోంది. అయితే ఈ మ్యాచ్లో పాక్ ఓడితే వాళ్ల పని అంతే. టోర్నీ నుంచి ఇంటిముఖం పట్టాల్సిందే.
భారత్- పాక్ రికార్డులు
వాళ్లదే పైచేయి : ఛాంపియన్స్ ట్రోఫీలో భారత్- పాకిస్థాన్ ఇప్పటివరకూ ఐదుసార్లు తలపడ్డాయి. ఇందులో మూడు సార్లు పాకిస్థాన్ నెగ్గగా, రెండింట్లో భారత్ విజయం సాధించింది.
పాక్దే తొలి విజయం : 2004 ఛాంపియన్స్ ట్రోఫీలో తొలిసారి భారత్- పాక్ తలపడ్డాయి. సెప్టెంబర్ 19న ఎడ్జ్బాస్టన్ వేదికగా ఈ మ్యాచ్ జరిగింది. టాస్ ఓడి బ్యాటింగ్కు దిగిన టీమ్ఇండియా 200 పరుగులు చేయగా, పాకిస్థాన్ మూడు వికెట్ల తేడాతో విజయం సాధించింది. ఇక రెండోసారి 2009లో సెంచూరియన్ వేదికగా తలపడ్డాయి. పాక్ 303 పరుగుల లక్ష్యాన్ని నిర్దేశించగా, ఛేదనలో భారత్ 44.5 ఓవర్లలో 248 పరుగులకే కుప్పకూలింది. దీంతో భారత్పై రెండోసారి విజయాన్ని నమోదు చేసింది.
భారత్ తొలి విజయం : 2013లో లీగ్ స్టేజ్ చివర్లో జూన్ 15న రెండు జట్లు తలపడ్డాయి. వాతావరణం ఆటంకం కలిగించడం వల్ల మ్యాచ్ 40 ఓవర్లకు కుదించారు. ఇందులో పాక్ను భారత్ 165 పరుగులకు కట్టడి చేసింది. ఆ తర్వాత మళ్లీ వర్షం రావడం వల్ల టీమ్ఇండియా లక్ష్యాన్ని 22 ఓవర్లకు 102 పరుగులకు కుదించారు. 19.2 ఓవర్లలోనే లక్ష్యాన్ని ఛేదించి పాక్పై తొలి విజయాన్ని భారత్ నమోదు చేసింది.
రెండో విజయం : 2017 ఛాంపియన్స్ ట్రోఫీ గ్రూప్ స్టేజ్లో పాకిస్థాన్పై ఘన విజయాన్ని భారత్ నమోదు చేసింది. జూన్ 4న ఎడ్జ్బాస్టన్ వేదికగా ఈ మ్యాచ్ జరిగింది. వర్షం కారణంగా మ్యాచ్ను 48 ఓవర్లకు కుదించగా భారత్ మూడు వికెట్ల నష్టానికి 319 పరుగులు చేసింది. ఛేదనలో పాక్ 33.4 ఓవర్లలో 164 పరుగులే చేసింది.
భారీ ఎదురు దెబ్బ : 2017లో భారత్- పాక్ జట్లే ఫైనల్ చేరాయి. జూన్ 18న ఓవల్ వేదికగా మ్యాచ్ జరగింది. టీమ్ఇండియా ముందు పాక్ 339 పరుగుల భారీ లక్ష్యాన్ని ఉంచింది. ఛేదనలో భారత్ ఘోరంగా విఫలమై 158 పరుగులకే ఆలౌటైంది. దీంతో తొలిసారి పాకిస్థాన్ ఛాంపియన్స్ ట్రోఫీని ముద్దాడింది.
ప్రతీకారం తీర్చుకోవాల్సిందే : 2017 ఫైనల్లో ఘోర ఓటమికి రివేంజ్ తీర్చుకొనే ఛాన్స్ వచ్చింది. ఈసారి పాక్ను ఓడించి సెమీస్ రేస్ నుంచి తప్పించాలని భారత్ అభిమానులు కోరుకుంటున్నారు.
The #GreatestRivalry with a revenge plot? It's a box-office hit! 🔥
— Star Sports (@StarSportsIndia) February 22, 2025
Watch the LIVE screening of 🇮🇳 🆚 🇵🇰 at your nearest @PicturesPVR cinema! 🍿📽#ChampionsTrophyOnJioStar 👉 #INDvPAK | SUN, 23rd FEB, 1:30 PM on Star Sports 1, Star Sports 1 Hindi, Star Sports 2 & Sports 18-1!… pic.twitter.com/cz5dSgg0ZM
'దూకుడు బాగానే ఉంది- కానీ ఆ తేడా తెలుసుకోవాలి బ్రో'- రోహిత్ బ్యాటింగ్ స్టైల్పై చర్చ