ETV Bharat / city

వివాహిత బలవన్మరణం... ఆ డైరీనే కీలకం!

మహబూబాబాద్​లోని సుందరయ్యనగర్​ కాలనీలో ఓ వివాహిత ఆత్మహత్యకు పాల్పడింది. భార్యభర్తల మధ్య వివాదాలే కారణంగా పోలీసులు భావిస్తున్నారు. మృతురాలి డైరీ ఆధారంగా ఆమె భర్తను అదుపులోకి తీసుకున్నారు. మృతురాలు రాధ ఖమ్మం జిల్లా రఘునాథపల్లి వాసి.

author img

By

Published : Dec 26, 2019, 10:03 PM IST

women suicide
మనస్తాపంతో వివాహిత ఆత్మహత్య.. డైరీనే కీలకం

మహబూబాబాద్​ పట్టణంలోని సుందరయ్యనగర్​ కాలనీలో విషాదం చోటుచేసుకొంది. ఖమ్మం జిల్లా రఘునాథపల్లికి చెందిన వివాహిత రాధ ఆత్మహత్య చేసుకొంది. భార్యభర్తల మధ్య గొడవలే బలవన్మరణానికి కారణమని పోలీసులు భావిస్తున్నారు. మృతురాలి డైరీ ఆధారంగా ఆమె భర్త ఉదయ్​ను అదుపులోకి తీసుకున్నారు. ఉదయ్​ మహబూబాబాద్​ ఆర్టీవో కార్యాలయంలో తాత్కాలిక ప్రాతిపదికన పనిచేస్తున్నట్లు పోలీసులు తెలిపారు.

'నువ్వు ఇలానే ప్రవర్తిస్తే నా శవమే ఉంటుంది. నీ ప్రవర్తన మార్చుకొని మంచిగా చూసుకుంటావో లేక నా శవన్ని చూస్తావో' అంటూ రాసి ఉన్న డైరీని పోలీసులు స్వాధీనం చేసుకున్నారు.

బయ్యారం గ్రామానికి చెందిన ఉదయ్​, ఖమ్మం జిల్లా రఘునాథపల్లికి చెందిన రాధలు ఏడు సంవత్సరాల క్రితం ప్రేమించి పెళ్లి చేసుకున్నారు. రెండేళ్లుగా మహబూబాబాద్​లోని సుందరయ్యనగర్​లో నివాసం ఉంటున్నారు. వీరికి ఒక కుమారుడు ఉన్నాడు. పెళ్లై ఏడు సంవత్సరాలు గడిచినా తల్లిదండ్రులు కనీసం చూడడానికైనా రాలేదని, కిస్మస్​ రోజైనా అమ్మానాన్నల దగ్గరకు వెళ్లాలని నిర్లయించుకుంది రాధ. వీలుపడకపోవడం వల్ల మనస్తాపానికి గురైనట్లు సమాచారం. కొన్నిరోజులుగా భార్యభర్తల మధ్య చిన్నచిన్న గొడవలు జరుగుతున్నట్లు మృతురాలు తన డైరీలో రాసి పెట్టుకుంది.

మనస్తాపంతో వివాహిత ఆత్మహత్య.. డైరీనే కీలకం

ఇవీచూడండి: 'మహిళల భద్రతపై రెండు వారాల్లోగా నివేదిక సమర్పించాలి'

మహబూబాబాద్​ పట్టణంలోని సుందరయ్యనగర్​ కాలనీలో విషాదం చోటుచేసుకొంది. ఖమ్మం జిల్లా రఘునాథపల్లికి చెందిన వివాహిత రాధ ఆత్మహత్య చేసుకొంది. భార్యభర్తల మధ్య గొడవలే బలవన్మరణానికి కారణమని పోలీసులు భావిస్తున్నారు. మృతురాలి డైరీ ఆధారంగా ఆమె భర్త ఉదయ్​ను అదుపులోకి తీసుకున్నారు. ఉదయ్​ మహబూబాబాద్​ ఆర్టీవో కార్యాలయంలో తాత్కాలిక ప్రాతిపదికన పనిచేస్తున్నట్లు పోలీసులు తెలిపారు.

'నువ్వు ఇలానే ప్రవర్తిస్తే నా శవమే ఉంటుంది. నీ ప్రవర్తన మార్చుకొని మంచిగా చూసుకుంటావో లేక నా శవన్ని చూస్తావో' అంటూ రాసి ఉన్న డైరీని పోలీసులు స్వాధీనం చేసుకున్నారు.

బయ్యారం గ్రామానికి చెందిన ఉదయ్​, ఖమ్మం జిల్లా రఘునాథపల్లికి చెందిన రాధలు ఏడు సంవత్సరాల క్రితం ప్రేమించి పెళ్లి చేసుకున్నారు. రెండేళ్లుగా మహబూబాబాద్​లోని సుందరయ్యనగర్​లో నివాసం ఉంటున్నారు. వీరికి ఒక కుమారుడు ఉన్నాడు. పెళ్లై ఏడు సంవత్సరాలు గడిచినా తల్లిదండ్రులు కనీసం చూడడానికైనా రాలేదని, కిస్మస్​ రోజైనా అమ్మానాన్నల దగ్గరకు వెళ్లాలని నిర్లయించుకుంది రాధ. వీలుపడకపోవడం వల్ల మనస్తాపానికి గురైనట్లు సమాచారం. కొన్నిరోజులుగా భార్యభర్తల మధ్య చిన్నచిన్న గొడవలు జరుగుతున్నట్లు మృతురాలు తన డైరీలో రాసి పెట్టుకుంది.

మనస్తాపంతో వివాహిత ఆత్మహత్య.. డైరీనే కీలకం

ఇవీచూడండి: 'మహిళల భద్రతపై రెండు వారాల్లోగా నివేదిక సమర్పించాలి'

sample description
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.