గోదావరి నదిపై హేవ్ లాక్ వంతెన 120 ఏళ్లు పూర్తి చేసుకుంది. ఆంధ్రప్రదేశ్లోని కొవ్వూరు, రాజమహేంద్రవరాన్ని కలుపుతూ గోదావరిపై నిర్మించిన ఈ వంతెనకు 1897 నవంబరు 11న శంకుస్థాపన చేశారు. 54 స్తంభాలతో 9 వేల 96 అడుగుల పొడవైన వంతెనను.. అప్పటి మద్రాస్ గవర్నర్ హేవ్ లాక్ ప్రారంభించారు.
కొందరు విద్యావంతులు, మేధావులు ఈ వంతెనను పర్యటకంగా అభివృద్ది చేయాలని కోరటంతో ఇది పర్యాటక శాఖ అధీనంలోకి వెళ్లింది. వంతెనను పర్యాటకంగా అభివృద్ధి పరచడానికి అధికారులు ప్రణాళికలు సిద్ధం చేస్తున్నారు.
ఇదీ చదవండి: పరిమితి సమయాల్లోనే హైదరాబాద్ మెట్రో సేవలు