Gold Rate Today February 21th 2025 : దేశంలో బంగారం, వెండి ధరలు తగ్గాయి. గురువారం 10 గ్రాముల బంగారం ధర రూ.89,225 ఉండగా, శుక్రవారం నాటికి రూ.545 తగ్గి రూ.88,680కు చేరుకుంది. గురువారం కిలో వెండి ధర రూ.99,860 ఉండగా, శుక్రవారం నాటికి రూ.244 తగ్గి రూ.99,616గా చేరుకుంది.
- Gold Price In Hyderabad February 21th 2025 : హైదరాబాద్లో పది గ్రాముల బంగారం ధర రూ.88,680గా ఉంది. కిలో వెండి ధర రూ.99,616గా ఉంది.
- Gold Price In Vijayawada February 21th 2025 : విజయవాడలో పది గ్రాముల పసిడి ధర రూ.88,680గా ఉంది. కిలో వెండి ధర రూ.99,616గా ఉంది.
- Gold Price In Visakhapatnam February 21th 2025 : విశాఖపట్నంలో 10 గ్రాముల పుత్తడి ధర రూ.88,680గా ఉంది. కిలో వెండి ధర రూ.99,616గా ఉంది.
- Gold Price In Proddatur February 21th 2025 : ప్రొద్దుటూరులో 10 గ్రాముల పసిడి ధర రూ.88,680గా ఉంది. కిలో వెండి ధర రూ.99,616గా ఉంది.
గమనిక : పైన పేర్కొన్న ధరలు ఉదయం మార్కెట్ ప్రారంభంలో ఉన్నవి మాత్రమే. ఈ గోల్డ్, సిల్వర్ రేట్లు మారుతూ ఉంటాయి. గమనించగలరు.
స్పాట్ గోల్డ్ ధర?
Spot Gold Price February 21th 2025 : అంతర్జాతీయ మార్కెట్లో బంగారం వెండి ధరలు తగ్గాయి. గురువారం ఔన్స్ గోల్డ్ ధర 2,940 డాలర్లు ఉండగా, శనివారం నాటికి 7 డాలర్లు తగ్గి 2,933 డాలర్లకు చేరింది. ప్రస్తుతం ఔన్స్ సిల్వర్ ధర 32.89 డాలర్లుగా ఉంది.
స్టాక్ మార్కెట్ అప్డేట్స్
Stock Market Today February 21th 2025 : దేశీయ స్టాక్ మార్కెట్ సూచీలు శుక్రవారం నష్టాలతో ప్రారంభమయ్యాయి. అంతర్జాతీయ మార్కెట్లలో మిశ్రమ సంకేతాల నడుమ మదుపర్లు అప్రమత్తంగా వ్యవహరిస్తున్నారు. దీంతో సూచీలు ఒడుదొడుకులకు లోనవుతున్నాయి.
ప్రస్తుతం బొంబాయి స్టాక్ ఎక్స్ఛేంజీ సూచీ సెన్సెక్స్ 55 పాయింట్లు తగ్గి 75,668 వద్ద ట్రేడవుతోంది. జాతీయ స్టాక్ ఎక్స్ఛేంజీ సూచీ నిఫ్టీ 9 పాయింట్లు కుంగి 22,903 వద్ద కొనసాగుతోంది.
- లాభాల్లో ఉన్న షేర్లు : టాటా స్టీల్, జొమాటో, ఎల్అండ్టీ, ఎన్టీపీసీ, టీసీఎస్, భారతీ ఎయిర్టెల్, యాక్సిస్ బ్యాంక్, బజాజ్ ఫిన్సర్వ్, అదానీ పోర్ట్స్
- నష్టాల్లో ఉన్న షేర్లు : ఎంఅండ్ఎం, కోటక్ మహీంద్రా బ్యాంక్, ఐసీఐసీఐ బ్యాంక్, ఇన్ఫోసిస్, అల్ట్రాటెక్ సిమెంట్, నెస్లే ఇండియా, మారుతీ సుజుకీ, పవర్గ్రిడ్ కార్పొరేషన్
రూపాయి విలువ
Rupee Value February 21th 2025 : డాలర్తో రూపాయి మారకం విలువ రూ.86.50 వద్ద కొనసాగుతోంది.
పెట్రోల్, డీజిల్ ధరలు
Petrol And Diesel Prices February 21th 2025 : తెలుగు రాష్ట్రాలైన ఏపీ, తెలంగాణలో పెట్రోల్, డీజిల్ ధరలు స్థిరంగా ఉన్నాయి. హైదరాబాద్లో లీటర్ పెట్రోల్ ధర రూ.107.45గా ఉంది. డీజిల్ ధర రూ.95.63గా ఉంది. విశాఖపట్నంలో లీటర్ పెట్రోల్ ధర రూ.108.27గా ఉంది. డీజిల్ ధర రూ.96.16గా ఉంది. దిల్లీలో లీటర్ పెట్రోల్ ధర రూ.94.76గా ఉంటే, డీజిల్ ధర రూ.87.66గా ఉంది.