ETV Bharat / state

రేపు దిల్లీకి కాంగ్రెస్ నేతలు... సారథి మార్పునకు సంకేతాలు! - తెలంగాణ నేతలకు ఏఐసీసీ నుంచి పిలుపు

కాంగ్రెస్‌ను క్షేత్రస్థాయిలో బలోపేతం చేసేందుకు ఆ పార్టీ అధిష్ఠానం కసరత్తు ప్రారంభించింది. రాష్ట్రాల వారీగా తాజా రాజకీయ పరిస్థితులను విశ్లేషిస్తోంది. ఈ నెల 16న పీసీసీ అధ్యక్షులు, సీఎల్పీ నేతలతోపాటు ముఖ్యనాయకులతో సమీక్షించాలని నిర్ణయించింది. తెలంగాణ నూతన పీసీసీ అధ్యక్ష ఎంపిక వ్యవహారం ఈ సమావేశాల్లో చర్చకు వచ్చే అవకాశం ఉంది.

రేపు దిల్లీలో కాంగ్రెస్ సమావేశం... తెలంగాణ నేతలకు పిలుపు!
author img

By

Published : Nov 15, 2019, 7:09 AM IST

Updated : Nov 15, 2019, 7:35 AM IST

పీసీసీ అధ్యక్షుడి ఎంపిక జరిగేనా...?

కాంగ్రెస్ అధిష్ఠానం పార్టీ బలోపేతంపై దృష్టి సారించింది. ఇప్పటికే కేంద్ర ప్రభుత్వ వైఫల్యాలపై దేశవ్యాప్తంగా నిరసనలు చేపట్టాలని పార్టీ శ్రేణులకు పిలుపునిచ్చింది. మరోవైపు ఆయా రాష్ట్రాల్లో అధికార పార్టీల ప్రజా వ్యతిరేఖ విధానాలను ఎండగట్టే ప్రయత్నం చేస్తోంది. మరోవైపు ఆయా రాష్ట్రాల ముఖ్యనేతలతో సమీక్షలు నిర్వహించి తాజా రాజకీయ పరిస్థితులను తెలుసుకోవాలని పార్టీ పెద్దలు భావిస్తున్నారు.

16న అన్నిరాష్ట్రాల నేతలతో...

ఈ నెల 16న రాష్ట్రాల వ్యవహారాల ఇంఛార్జ్​లు, ఏఐసీసీ ప్రధాన కార్యదర్శులు, కార్యదర్శులు, పీసీసీ అధ్యక్షులు, సీఎల్పీనేతలతో సమావేశం నిర్వహించనున్నారు. ఇప్పటికే దిల్లీకి రావాల్సిందిగా ఆయా నేతలకు అధిష్ఠానం వర్తమానం పంపింది. రాష్ట్రాల వారీగా పీసీసీ అధ్యక్షులు, సీఎల్పీ నేతలు, ఇంఛార్జ్​లతో ప్రత్యేకంగా మాట్లాడే అవకాశాలు ఉన్నట్లు పార్టీ వర్గాలు పేర్కొన్నాయి.

పీసీసీ అధ్యక్షుని ఎంపికపై...

తెలంగాణ పీసీసీ అధ్యక్షుడు, నల్గొండ ఎంపీ ఉత్తమ్‌కుమార్‌ రెడ్డి ఇప్పటికే తనను ఆ పదవి నుంచి తప్పించాలని అధిష్ఠానాన్ని కోరారు. తదుపరి అధ్యక్షుడిగా ఎవరిని ఎంపిక చేయాలనేదానిపై ఈ సమావేశాల్లో చర్చించే అవకాశం ఉంది. రాష్ట్రంలో తాజా రాజకీయ పరిస్థితులు, పార్టీ పరిస్థితిని తెలుసుకోనున్నట్లు ఏఐసీసీ వర్గాల తెలిపాయి. ఇటీవల జరిగిన వరుస ఎన్నికల్లో పార్టీ ఓటమి పాలు కావడం, తెరాస వ్యవహరిస్తున్న తీరు, ఆ పార్టీ ఎత్తుగడలపై అనుసరించాల్సిన వ్యూహాలపై చర్చించే అవకాశం ఉంది.

దిల్లీ బాటలో నేతలు...

తెలంగాణలో పీసీసీ అధ్యక్ష పదవి కోసం పోటీ పడుతున్న వారిలో కొందరు ఇప్పటికే ఏఐసీసీ స్థాయిలో పావులు కదుపుతున్నారు. కొంతమంది నేతలు ఏఐసీసీకి తమ వివరాలు పంపించి... పరిశీలించాల్సిందిగా కోరారు. టీ పీసీసీ ఆశించే వారిలో మల్కాజిగిరి ఎంపీ రేవంత్‌ రెడ్డి, మాజీ పీసీసీ అధ్యక్షులు పొన్నాల లక్ష్మయ్య, వి.హనుమంతురావు, మాజీ మంత్రులు శ్రీధర్‌బాబు, షబ్బీర్‌ అలీ, జానారెడ్డి, భువనగిరి ఎంపీ కోమటిరెడ్డి వెంకటరెడ్డి, ఏఐసీసీ కార్యదర్శి సంపత్‌కుమార్‌, ఎమ్మెల్సీ జీవన్‌ రెడ్డి, ఎమ్మెల్యే జగ్గారెడ్డి ఉన్నారు.

ఇవీ చూడండి : అదే వేదన... ఆగిన మరో ఆర్టీసీ కార్మికుడి గుండె

పీసీసీ అధ్యక్షుడి ఎంపిక జరిగేనా...?

కాంగ్రెస్ అధిష్ఠానం పార్టీ బలోపేతంపై దృష్టి సారించింది. ఇప్పటికే కేంద్ర ప్రభుత్వ వైఫల్యాలపై దేశవ్యాప్తంగా నిరసనలు చేపట్టాలని పార్టీ శ్రేణులకు పిలుపునిచ్చింది. మరోవైపు ఆయా రాష్ట్రాల్లో అధికార పార్టీల ప్రజా వ్యతిరేఖ విధానాలను ఎండగట్టే ప్రయత్నం చేస్తోంది. మరోవైపు ఆయా రాష్ట్రాల ముఖ్యనేతలతో సమీక్షలు నిర్వహించి తాజా రాజకీయ పరిస్థితులను తెలుసుకోవాలని పార్టీ పెద్దలు భావిస్తున్నారు.

16న అన్నిరాష్ట్రాల నేతలతో...

ఈ నెల 16న రాష్ట్రాల వ్యవహారాల ఇంఛార్జ్​లు, ఏఐసీసీ ప్రధాన కార్యదర్శులు, కార్యదర్శులు, పీసీసీ అధ్యక్షులు, సీఎల్పీనేతలతో సమావేశం నిర్వహించనున్నారు. ఇప్పటికే దిల్లీకి రావాల్సిందిగా ఆయా నేతలకు అధిష్ఠానం వర్తమానం పంపింది. రాష్ట్రాల వారీగా పీసీసీ అధ్యక్షులు, సీఎల్పీ నేతలు, ఇంఛార్జ్​లతో ప్రత్యేకంగా మాట్లాడే అవకాశాలు ఉన్నట్లు పార్టీ వర్గాలు పేర్కొన్నాయి.

పీసీసీ అధ్యక్షుని ఎంపికపై...

తెలంగాణ పీసీసీ అధ్యక్షుడు, నల్గొండ ఎంపీ ఉత్తమ్‌కుమార్‌ రెడ్డి ఇప్పటికే తనను ఆ పదవి నుంచి తప్పించాలని అధిష్ఠానాన్ని కోరారు. తదుపరి అధ్యక్షుడిగా ఎవరిని ఎంపిక చేయాలనేదానిపై ఈ సమావేశాల్లో చర్చించే అవకాశం ఉంది. రాష్ట్రంలో తాజా రాజకీయ పరిస్థితులు, పార్టీ పరిస్థితిని తెలుసుకోనున్నట్లు ఏఐసీసీ వర్గాల తెలిపాయి. ఇటీవల జరిగిన వరుస ఎన్నికల్లో పార్టీ ఓటమి పాలు కావడం, తెరాస వ్యవహరిస్తున్న తీరు, ఆ పార్టీ ఎత్తుగడలపై అనుసరించాల్సిన వ్యూహాలపై చర్చించే అవకాశం ఉంది.

దిల్లీ బాటలో నేతలు...

తెలంగాణలో పీసీసీ అధ్యక్ష పదవి కోసం పోటీ పడుతున్న వారిలో కొందరు ఇప్పటికే ఏఐసీసీ స్థాయిలో పావులు కదుపుతున్నారు. కొంతమంది నేతలు ఏఐసీసీకి తమ వివరాలు పంపించి... పరిశీలించాల్సిందిగా కోరారు. టీ పీసీసీ ఆశించే వారిలో మల్కాజిగిరి ఎంపీ రేవంత్‌ రెడ్డి, మాజీ పీసీసీ అధ్యక్షులు పొన్నాల లక్ష్మయ్య, వి.హనుమంతురావు, మాజీ మంత్రులు శ్రీధర్‌బాబు, షబ్బీర్‌ అలీ, జానారెడ్డి, భువనగిరి ఎంపీ కోమటిరెడ్డి వెంకటరెడ్డి, ఏఐసీసీ కార్యదర్శి సంపత్‌కుమార్‌, ఎమ్మెల్సీ జీవన్‌ రెడ్డి, ఎమ్మెల్యే జగ్గారెడ్డి ఉన్నారు.

ఇవీ చూడండి : అదే వేదన... ఆగిన మరో ఆర్టీసీ కార్మికుడి గుండె

TG_HYD_03_14_cong_exercise_on_party_strenghen_pkg_3038066 REPORTER : Tirupal Reddy Dry ()కాంగ్రెస్‌ పార్టీ అధిష్ఠానం దేశ వ్యాప్తంగా రాష్ట్రాల్లో పార్టీని బలోపేతం చేసే దిశలో ముందుకు వెళ్లుతోంది. రాష్ట్రాల వారీగా తాజా రాజకీయ పరిస్థితులను అంచనా వేసేందుకు ఈ నెల 16వ తేదీన రాష్ట్రాలకు చెందిన పీసీసీ అధ్యక్షులు, సీఎల్పీ నేతలతోపాటు ముఖ్యనాయకులతో సమావేశం కానున్నఅధిష్ఠానం లోతైన సమీక్ష చేయనుంది. తెలంగాణ రాష్ట్ర నూతన పీసీసీ అధ్యక్ష ఎంపిక వ్యవహారం కూడా ఈ సందర్భంగా అధిష్ఠానం రాష్ట్ర నేతలతో చర్చించే అవకాశం ఉంది. LOOK వాయిస్ఓవర్‌1: ఏఐసీసీ అధ్యక్షురాలిగా కొనసాగుతున్న సోనియాగాంధీ దేశ వ్యాప్తంగా పార్టీని బలోపేతం చేసే దిశలో అడుగులు వేస్తోంది. ఇప్పటికే కేంద్ర ప్రభుత్వ పాలనా వైఫల్యాలపై దృష్టి సారించి దేశ వ్యాప్తంగా ఎండగట్టే పనిని చేస్తోంది. మరో వైపు ఆయా రాష్ట్రాల్లో స్థానిక అధికారిక పార్టీల ప్రజా వ్యతిరేఖ విధానాలను ప్రజల్లోకి తీసుకెళ్లే పని కూడా మరోవైపు కొనసాగుతోంది. పార్టీని మరింత బలోపేతం చేసేందుకు పక్కాకార్యాచరణతో ముందుకు వెళ్లాలని అధిష్ఠానం నిర్ణయించింది. అందులో భాగంగా ఆయా రాష్ట్రాల ముఖ్య నేతలతో సమీక్షలు నిర్వహించి తాజా రాజకీయ పరిస్థితులను తెలుసుకుని తదనుగుణంగా ప్రణాళికలు రూపకల్పన చేయాలని భావిస్తోంది. ఈ నెల 16వ తేదీన దేశంలోని అన్ని రాష్ట్రాల పార్టీ వ్యవహారాల ఇంఛార్జిలు, ఎఐసీసీ ప్రధాన కార్యదర్శులు, ఏఐసీసీ కార్యదర్శులు, పీసీసీ అధ్యక్షులు, సీఎల్పీనేతలను ధిల్లీకి రావల్సిందిగా అధిష్ఠానం సంబంధిత నేతలకు వర్తమానం అందించింది. రాష్ట్రాల వారీగా పీసీసీ అధ్యక్షులు, సీఎల్పీ నేతలు, ఆయా రాష్ట్రాల వ్యవహారాల ఇంఛార్జిలతో ప్రత్యేకంగా మాట్లాడే అవకాశాలు ఉన్నట్లు పార్టీ వర్గాలు పేర్కొంటున్నాయి. వాయిస్ఓవర్‌2: తెలంగాణ రాష్ట్ర పీసీసీ అధ్యక్షుడు, నల్గొండ ఎంపీ ఉత్తమ్‌కుమార్‌ రెడ్డి ఇప్పటికే తనను ఆ పదవి నుంచి తప్పించాలని పార్టీ అధిష్ఠానాన్ని కోరి ఉండడంతో...తదుపరి అధ్యక్షుడిగా ఎవరు ఉంటే పార్టీ బలోపేతం అవతుందన్న అంశంపై చర్చించే అవకాశం ఉంది. రాష్ట్రంలో తాజా రాజకీయ పరిస్థితులు, పార్టీ పరిస్థితి ఏలా ఉందన్న అంశాలను తెలుసుకునేందుకు ఏఐసీసీ ప్రత్యేకంగా సమావేశమై అభిప్రాయాలను తెలుసుకుంటుందని కాంగ్రెస్‌ వర్గాలు పేర్కొన్నాయి. ప్రధానంగా ఇటీవల వరుసుగా జరిగిన ఎన్నికల్లో ఓటమిపాలు కావడం, అధికార పార్టీ తెరాస వ్యవహరిస్తున్న తీరు, ఆ పార్టీ ఎత్తుగడలను చిత్తు చేసేందుకు కాంగ్రెస్‌ పార్టీ చేస్తున్న ఎత్తుగడలు తదితర వాటిని అడిగి తెలుసుకోనున్నారు. పనిలో పనిగా పీసీసీ అధ్యక్షుడి ఎంపిక వ్యవహారం కూడా అధిష్ఠానం వద్ద చర్చకు వస్తుందని పార్టీ వర్గాలు పేర్కొంటున్నాయి. కొత్త రథసారధి ఎవరైతే తెలంగాణ రాష్ట్రంలో అధికార తెరాస పార్టీని దీటుగా ఎదుర్కొని, పార్టీ శ్రేణులకు బరోసా కల్పించేట్లు సమర్ధవంతంగా పార్టీని ముందుకు తీసుకెళ్లగలరన్నదానిపైనే దృష్టి పెడతారని పార్టీ నేతలు పేర్కొంటున్నారు. వాయిస్ఓవర్‌3: తెలంగాణ రాష్ట్రంలో పీసీసీ అధ్యక్ష పదవి కోసం పోటీ పడుతున్న వారిలో కొందరు ఇప్పటికే ఏఐసీసీ స్థాయిలో పావులు కదుపుతున్నారు. ఇంకొందరు ఏఐసీసీ తమ బయోడేటా వివరాలు పంపించి...పరిశీలన చేయాల్సిందిగా కోరారు. 16వ తేదీన అధిష్ఠానం వద్ద పార్టీ ముఖ్యలు సమావేశం కానుండడంతో ఆ రోజు పీసీసీ పదవులు ఆశిస్తున్న నేతల్లో కొందరు దిల్లీకి వెళ్లి అధిష్ఠానంతో కలిసి తమ అభిప్రాయాలను తెలియచేసే అవకాశం లేకపోలేదని పార్టీ వర్గాలు పేర్కొంటున్నాయి. మల్కాజిగిరి ఎంపీ రేవంత్‌ రెడ్డి, మాజీ పీసీసీ అధ్యక్షులు పొన్నాల లక్ష్మయ్య, వి.హనుమంతురావు, మాజీ మంత్రులు శ్రీధర్‌బాబు, షబీర్‌ అలీ, జానారెడ్డి భువనగిరి ఎంపీ కోమటిరెడ్డి వెంకటరెడ్డి, ఏఐసీసీ కార్యదర్శి సంపత్‌కుమార్‌, ఎమ్మెల్సీ జీవన్‌ రెడ్డి, ఎమ్మెల్యే జగ్గారెడ్డి తదితరులు ఆశావహుల్లో ఉన్నారు. పీసీసీ అధ్యక్షుడిగా ఎవరిని ఎంపిక చేసినా...అందరు కలిసికట్టుగా పని చేసే వాతావరణం కల్పించేందుకు పార్టీ సీనియర్ల అభిప్రాయాలు తెలుసుకుని..ఎవరి మనోభావాలు దెబ్బతినకుండా తుది నిర్ణయం తీసుకునే అవకాశం కనిపిస్తోంది.
Last Updated : Nov 15, 2019, 7:35 AM IST
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.