అదే వేదన... ఆగిన మరో ఆర్టీసీ కార్మికుడి గుండె - TSRTC conductor death at sanga reddy district jogipeta today news
సంగారెడ్డి జిల్లా ఆందోల్ మండలం జోగిపేటకు చెందిన ఆర్టీసీ కార్మికుడు నాగేశ్వర్ మృతి చెందాడు. గాంధీ ఆస్పత్రిలో చికిత్సపొందుతూ తెల్లవారుజామున కన్నుమూశారు. నారాయణఖేడ్ డిపోలో కండక్టర్గా విధులు నిర్వహిస్తున్న నాగేశ్వర్... ఉద్యోగం తిరిగి రాదేమోనని 4, 5 రోజులుగా మనస్తాపంతో ఉన్నారని బంధువులు తెలిపారు. నాగేశ్వర్ మృతదేహాన్ని జోగిపేటకు తరలించారు.