ETV Bharat / state

బతుకు చక్రాలపై 'జ్యోతి' జీవన పోరాటం.. ఆదుకోవాలని విన్నపం

author img

By

Published : Jun 24, 2020, 6:14 PM IST

చక్కగా చదువుకొని సర్కారు కొలువులో స్థిరపడాలన్నది ఆ అమ్మాయి కల. కానీ కాలం... ఆ అమ్మాయికి మూడుముళ్లు వేసి....గృహిణిగా మార్చింది. అయినా ఆమె చదువుకోవాలనే తపన వీడలేదు. ట్యూషన్లు చెబుతూ లక్ష్యంవైపు అడుగులేసింది. ఇంతలో లాక్‌డౌన్‌తో కుటుంబ పరిస్థితులు తలకిందులైనా.... కాళ్లను చక్రాలుగా చేసుకుని.. చెమటను వ్యాపారంగా మార్చి... బతుకు బండిపై కూరగాయలు విక్రయిస్తూ లక్ష్యం వైపు అడుగులేస్తోన్న జ్యోతిపై ఈటీవీ భారత్​ కథనం.

a women has selling vegitables in lbnagar
బతుకు చక్రాలపై ఓ గృహిణి జీవన పోరాటం...

తోపుడుబండిపై కూరగాయలు విక్రయిస్తున్న ఈ అమ్మాయి పేరు పిట్టతలపుల జ్యోతి. రాజీవ్ గాంధీనగర్​లో భర్త, ఇద్దరు పిల్లలతో కలిసి అద్దె ఇంట్లో ఉంటోంది. ఆరుగురు సంతానంలో రెండో అమ్మాయి అయిన జ్యోతి... ఘట్​కేసర్​లోని ఓ ప్రైవేటు కళాశాలలో బీటెక్ రెండో సంవత్సరం చదువుతుండగా ఆర్థిక ఇబ్బందుల వల్ల చదువు ఆగిపోయింది. హైదరాబాద్​లో పెయింటర్​గా పనిచేస్తున్న జంగయ్యతో 2013లో జ్యోతి పెళ్లయింది. అప్పటి నుంచి భార్యభర్తలిద్దరూ చెరో పనిచేసుకుంటూ కుటుంబాన్ని నెట్టుకొచ్చారు. ఇరుగుపొరుగు పిల్లలకు ట్యూషన్లు చెబుతూ ఇంటి అద్దె, పిల్లల పోషణ చూసుకునేది.

తల్లకిందులైన ఆర్థిక పరిస్థితి

లాక్​డౌన్ వల్ల జ్యోతి-జంగయ్యల ఆర్థిక పరిస్థితి తలకిందులైంది. జంగయ్యకు పెయింటింగ్ పనిలేదు. జ్యోతి టూషన్​కు పిల్లలు రావడం లేదు. వంట పనికి పిలిచినవారు విదేశాలకు వెళ్లిపోయారు. ఈ పరిస్థితుల్లో కుటుంబపోషణ భారమైంది. ఇంటి అద్దె కూడా చెల్లించలేని దయనీయ స్థితి. దిక్కుతోచని స్థితిలో బతుకుబండి గాడిన పడేందుకు కూరగాయలు అమ్మాలని నిర్ణయించుకుంది. మొదట్లో కూరగాయలు విక్రయించేందుకు ఇబ్బంది పడిన జ్యోతి.... తర్వాత అలవాటు చేసుకుంది. ఓపెన్ డిగ్రీ ఫీజు కట్టి మళ్లీ చదువు ప్రారంభించింది. రైల్వేలో ఉద్యోగం సంపాదించి... తన పిల్లలు తనలా కాకుండా బంగారు భవిష్యత్తు అందిస్తానని చెబుతోంది జ్యోతి.

భర్త అండతో...

ఓ వైపు కుటుంబపోషణ... మరోవైపు చదువుకోవాలనే తపనతో ఉన్న జ్యోతికి ఆమె భర్త జంగయ్య అండగా నిలుస్తున్నాడు. దాతలెవరైనా ఆదుకుంటే తన భార్య కల సాకారం చేసేందుకు శ్రమిస్తానంటున్నాడు.

భార్యగా, ఇద్దరు పిల్లల తల్లిగా... కుటుంబ పోషణకు కూరగాయల విక్రేతగా అరడజనుకుపైగా పనులు చేస్తోన్న జ్యోతి... జీవన పోరాటంలో వెలుగు కోసం తపిస్తోంది. దాతలు ఆదుకుంటే చదువుకొని ఉద్యోగం సంపాదిస్తానని ధీమాతో ఉన్న జ్యోతి గురించి తెలిసిన వారు తమ పిల్లలకు ఆమెను ఆదర్శంగా చూపిస్తున్నారు.

ఇదీ చదవండి: కడుపుకోత.. నలుగురు అన్నదమ్ములు జలసమాధి

తోపుడుబండిపై కూరగాయలు విక్రయిస్తున్న ఈ అమ్మాయి పేరు పిట్టతలపుల జ్యోతి. రాజీవ్ గాంధీనగర్​లో భర్త, ఇద్దరు పిల్లలతో కలిసి అద్దె ఇంట్లో ఉంటోంది. ఆరుగురు సంతానంలో రెండో అమ్మాయి అయిన జ్యోతి... ఘట్​కేసర్​లోని ఓ ప్రైవేటు కళాశాలలో బీటెక్ రెండో సంవత్సరం చదువుతుండగా ఆర్థిక ఇబ్బందుల వల్ల చదువు ఆగిపోయింది. హైదరాబాద్​లో పెయింటర్​గా పనిచేస్తున్న జంగయ్యతో 2013లో జ్యోతి పెళ్లయింది. అప్పటి నుంచి భార్యభర్తలిద్దరూ చెరో పనిచేసుకుంటూ కుటుంబాన్ని నెట్టుకొచ్చారు. ఇరుగుపొరుగు పిల్లలకు ట్యూషన్లు చెబుతూ ఇంటి అద్దె, పిల్లల పోషణ చూసుకునేది.

తల్లకిందులైన ఆర్థిక పరిస్థితి

లాక్​డౌన్ వల్ల జ్యోతి-జంగయ్యల ఆర్థిక పరిస్థితి తలకిందులైంది. జంగయ్యకు పెయింటింగ్ పనిలేదు. జ్యోతి టూషన్​కు పిల్లలు రావడం లేదు. వంట పనికి పిలిచినవారు విదేశాలకు వెళ్లిపోయారు. ఈ పరిస్థితుల్లో కుటుంబపోషణ భారమైంది. ఇంటి అద్దె కూడా చెల్లించలేని దయనీయ స్థితి. దిక్కుతోచని స్థితిలో బతుకుబండి గాడిన పడేందుకు కూరగాయలు అమ్మాలని నిర్ణయించుకుంది. మొదట్లో కూరగాయలు విక్రయించేందుకు ఇబ్బంది పడిన జ్యోతి.... తర్వాత అలవాటు చేసుకుంది. ఓపెన్ డిగ్రీ ఫీజు కట్టి మళ్లీ చదువు ప్రారంభించింది. రైల్వేలో ఉద్యోగం సంపాదించి... తన పిల్లలు తనలా కాకుండా బంగారు భవిష్యత్తు అందిస్తానని చెబుతోంది జ్యోతి.

భర్త అండతో...

ఓ వైపు కుటుంబపోషణ... మరోవైపు చదువుకోవాలనే తపనతో ఉన్న జ్యోతికి ఆమె భర్త జంగయ్య అండగా నిలుస్తున్నాడు. దాతలెవరైనా ఆదుకుంటే తన భార్య కల సాకారం చేసేందుకు శ్రమిస్తానంటున్నాడు.

భార్యగా, ఇద్దరు పిల్లల తల్లిగా... కుటుంబ పోషణకు కూరగాయల విక్రేతగా అరడజనుకుపైగా పనులు చేస్తోన్న జ్యోతి... జీవన పోరాటంలో వెలుగు కోసం తపిస్తోంది. దాతలు ఆదుకుంటే చదువుకొని ఉద్యోగం సంపాదిస్తానని ధీమాతో ఉన్న జ్యోతి గురించి తెలిసిన వారు తమ పిల్లలకు ఆమెను ఆదర్శంగా చూపిస్తున్నారు.

ఇదీ చదవండి: కడుపుకోత.. నలుగురు అన్నదమ్ములు జలసమాధి

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.