ETV Bharat / international

అంతర్జాలం ద్వారా ఓటేసే ఏకైక దేశం.. ఎస్తోనియా

ఎన్నికల్లో అంతర్జాలం ద్వారా ఓటు హక్కు వినియోగించుకునే విధానాన్ని అమలు చేస్తోంది ఉత్తర ఐరోపాలోని ఎస్తోనియా. 'ఐ-ఓటింగ్'ను ప్రజలకు అందుబాటులోకి తెచ్చిన ఏకైక దేశంగా అరుదైన ఘనత సాధించింది.

author img

By

Published : May 20, 2019, 10:15 PM IST

Updated : May 20, 2019, 11:58 PM IST

అంతర్జాలం ద్వారా ఓటేసే ఏకైక దేశం.. ఎస్తోనియా
అంతర్జాలం ద్వారా ఓటేసే ఏకైక దేశం.. ఎస్తోనియా

ఒకప్పుడు సైబర్​ దాడులతో తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్న ఉత్తర ఐరోపా దేశం ఎస్తోనియా ఇప్పుడు ఆన్​లైన్​లో ఎన్నికల ఓటింగ్​ను నిర్వహించే ఏకైక దేశంగా అవతరించింది.

అంతర్జాలం​ ద్వారా ఓటుహక్కు వినియోగించుకునే 'ఐ-ఓటింగ్​' విధానాన్ని 2005లోనే ప్రవేశపెట్టింది ఎస్తోనియా. రష్యాతో వివాదం కారణంగా 2007లో ప్రభుత్వ నెట్​వర్క్​లు మొత్తం సైబర్​ దాడుల బారిన పడ్డాయి

అనతి కాలంలోనే సాంకేతిక సమస్యలన్నీ అధిగమించింది ఈ దేశం. అత్యంత పకడ్బందీగా పరిష్కార మార్గాలను కనుగొంది. ప్రతి ఎన్నికల్లోనూ 'ఐ-ఓటింగ్​'ను ప్రజలకు అందుబాటులో ఉంచింది.

ఆన్​లైన్​లో ఓటేసే వారి సంఖ్య క్రమంగా పెరుగుతూ వస్తోంది. మార్చిలో జరిగిన ఎస్తోనియా జాతీయ ఎన్నికల్లో 44 శాతం ఓటర్లు ఆన్​లైన్​ ద్వారానే ఓటు హక్కు వినియోగించుకున్నారు.

30 సెకన్లలోనే ఓటేసిన మహిళ

మే 23 నుంచి 26 వరకు ఐరోపా సమాఖ్య పార్లమెంటు ఎన్నికలు జరగనున్నాయి. ఈయూలోని 28 సభ్యదేశాల్లో ఏస్తోనియా ఒకటి. 13లక్షల జనాభా ఉన్న ఈ దేశం నుంచి ఆరుగురు ఎంపీలు ప్రాతినిధ్యం వహిస్తున్నారు. ఎస్తేనియాలో ఐ-ఓటింగ్ ప్రక్రియ మే 10న మొదలైంది. ఎన్నికల తేదీకి నాలుగు రోజుల ముందు వరకు కొనసాగనుంది.

ఐ-ఓటింగ్​తో ఓటుహక్కు వినియోగించుకుంది లిండా లైనావూ అనే మహిళ. కేవలం 30 సెకన్లలోనే తన ల్యాప్​టాప్​ను ఉయోగించి ఓ కేఫ్​లో కూర్చొని ఓటేసింది. ఆమె ఇప్పటి వరకు ఒక్కసారి కూడా ఓటేసేందుకు క్యూలో నిలబడలేదు. ప్రతిసారి ఆన్​లైన్​ ద్వారానే ఓటింగ్​లో పాల్గొంటుంది.

" నా జీవితంలో ఇంతకన్నా ఎక్కువ ఎలాంటి మార్పు ఊహించుకోలేను. ఓటు వేసేందుకు క్యూలో నిలబడి కాగితాలను ఉపయోగించాల్సిన అవసరం లేదు. "
-లిండా లైనావూ, ఓటరు.

ఐరోపా సమాఖ్య పార్లమెంటు ఎన్నికలకు ఇప్పటికే 82వేల మందికి పైగా ఐ-ఓటింగ్​ ద్వారా ఓటు వేశారు.

ఇంటర్​నెట్​లో సైబర్ దాడుల సమస్యను అధిగమించి పారదర్శక ఓటింగ్ విధానాన్ని అమలు చేస్తున్నట్లు ఎస్తోనియా ప్రభుత్వాధికారి, ఇంటర్​నెట్ కంప్యూటర్​ నిపుణులు చెబుతున్నారు. ఎన్నికల నిర్వహణపై దుష్ప్రచారానికి అవకాశం లేకుండా చర్యలు తీసుకున్నందు వల్లే ప్రజలు ఐ-ఓటింగ్​ను విశ్వసిస్తున్నట్లు తెలిపారు.

"ఐ-ఓటింగ్ విధానం ఆచరణకు నోచుకోవడానికి విశ్వాసమే కారణం. నమ్మకం ఏర్పడాలంటే తప్పుడు వార్తల వ్యాప్తిని నియంత్రించాలి."
-టోను ట్యామర్​, ప్రభుత్వ అధికారి.

ఐడీ కార్డు, పిన్​ నంబరు విధానం

ఐ-ఓటింగ్ ద్వారా ఓటేయాలనుకున్న వారు ప్రభుత్వ గుర్తింపు కార్డు, వ్యక్తిగత పిన్​ నంబరుతో లాగిన్​ అవ్వాలి. వాళ్ల పేరును ఓటరు జాబితా నుంచి ఎంపిక చేసుకోవాలి. ఓటేయాలనుకున్న అభ్యర్థిని ఎంచుకోవాలి.

చివరి ఓటే పరిగణిస్తారు...

గడువు ముగిసే లోపు వేరే అభ్యర్థికి ఓటేయాలని మనసు మార్చుకున్నవారు అలాగే చేయవచ్చు. చివరిగా ఎవరికైతే ఓటేస్తారో ఆ ఓటునే పరిగణలోకి తీసుకుంటారు.

ఇదీ చూడండి:21 అంతస్తుల భవనం క్షణాల్లో​ నేలమట్టం

అంతర్జాలం ద్వారా ఓటేసే ఏకైక దేశం.. ఎస్తోనియా

ఒకప్పుడు సైబర్​ దాడులతో తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్న ఉత్తర ఐరోపా దేశం ఎస్తోనియా ఇప్పుడు ఆన్​లైన్​లో ఎన్నికల ఓటింగ్​ను నిర్వహించే ఏకైక దేశంగా అవతరించింది.

అంతర్జాలం​ ద్వారా ఓటుహక్కు వినియోగించుకునే 'ఐ-ఓటింగ్​' విధానాన్ని 2005లోనే ప్రవేశపెట్టింది ఎస్తోనియా. రష్యాతో వివాదం కారణంగా 2007లో ప్రభుత్వ నెట్​వర్క్​లు మొత్తం సైబర్​ దాడుల బారిన పడ్డాయి

అనతి కాలంలోనే సాంకేతిక సమస్యలన్నీ అధిగమించింది ఈ దేశం. అత్యంత పకడ్బందీగా పరిష్కార మార్గాలను కనుగొంది. ప్రతి ఎన్నికల్లోనూ 'ఐ-ఓటింగ్​'ను ప్రజలకు అందుబాటులో ఉంచింది.

ఆన్​లైన్​లో ఓటేసే వారి సంఖ్య క్రమంగా పెరుగుతూ వస్తోంది. మార్చిలో జరిగిన ఎస్తోనియా జాతీయ ఎన్నికల్లో 44 శాతం ఓటర్లు ఆన్​లైన్​ ద్వారానే ఓటు హక్కు వినియోగించుకున్నారు.

30 సెకన్లలోనే ఓటేసిన మహిళ

మే 23 నుంచి 26 వరకు ఐరోపా సమాఖ్య పార్లమెంటు ఎన్నికలు జరగనున్నాయి. ఈయూలోని 28 సభ్యదేశాల్లో ఏస్తోనియా ఒకటి. 13లక్షల జనాభా ఉన్న ఈ దేశం నుంచి ఆరుగురు ఎంపీలు ప్రాతినిధ్యం వహిస్తున్నారు. ఎస్తేనియాలో ఐ-ఓటింగ్ ప్రక్రియ మే 10న మొదలైంది. ఎన్నికల తేదీకి నాలుగు రోజుల ముందు వరకు కొనసాగనుంది.

ఐ-ఓటింగ్​తో ఓటుహక్కు వినియోగించుకుంది లిండా లైనావూ అనే మహిళ. కేవలం 30 సెకన్లలోనే తన ల్యాప్​టాప్​ను ఉయోగించి ఓ కేఫ్​లో కూర్చొని ఓటేసింది. ఆమె ఇప్పటి వరకు ఒక్కసారి కూడా ఓటేసేందుకు క్యూలో నిలబడలేదు. ప్రతిసారి ఆన్​లైన్​ ద్వారానే ఓటింగ్​లో పాల్గొంటుంది.

" నా జీవితంలో ఇంతకన్నా ఎక్కువ ఎలాంటి మార్పు ఊహించుకోలేను. ఓటు వేసేందుకు క్యూలో నిలబడి కాగితాలను ఉపయోగించాల్సిన అవసరం లేదు. "
-లిండా లైనావూ, ఓటరు.

ఐరోపా సమాఖ్య పార్లమెంటు ఎన్నికలకు ఇప్పటికే 82వేల మందికి పైగా ఐ-ఓటింగ్​ ద్వారా ఓటు వేశారు.

ఇంటర్​నెట్​లో సైబర్ దాడుల సమస్యను అధిగమించి పారదర్శక ఓటింగ్ విధానాన్ని అమలు చేస్తున్నట్లు ఎస్తోనియా ప్రభుత్వాధికారి, ఇంటర్​నెట్ కంప్యూటర్​ నిపుణులు చెబుతున్నారు. ఎన్నికల నిర్వహణపై దుష్ప్రచారానికి అవకాశం లేకుండా చర్యలు తీసుకున్నందు వల్లే ప్రజలు ఐ-ఓటింగ్​ను విశ్వసిస్తున్నట్లు తెలిపారు.

"ఐ-ఓటింగ్ విధానం ఆచరణకు నోచుకోవడానికి విశ్వాసమే కారణం. నమ్మకం ఏర్పడాలంటే తప్పుడు వార్తల వ్యాప్తిని నియంత్రించాలి."
-టోను ట్యామర్​, ప్రభుత్వ అధికారి.

ఐడీ కార్డు, పిన్​ నంబరు విధానం

ఐ-ఓటింగ్ ద్వారా ఓటేయాలనుకున్న వారు ప్రభుత్వ గుర్తింపు కార్డు, వ్యక్తిగత పిన్​ నంబరుతో లాగిన్​ అవ్వాలి. వాళ్ల పేరును ఓటరు జాబితా నుంచి ఎంపిక చేసుకోవాలి. ఓటేయాలనుకున్న అభ్యర్థిని ఎంచుకోవాలి.

చివరి ఓటే పరిగణిస్తారు...

గడువు ముగిసే లోపు వేరే అభ్యర్థికి ఓటేయాలని మనసు మార్చుకున్నవారు అలాగే చేయవచ్చు. చివరిగా ఎవరికైతే ఓటేస్తారో ఆ ఓటునే పరిగణలోకి తీసుకుంటారు.

ఇదీ చూడండి:21 అంతస్తుల భవనం క్షణాల్లో​ నేలమట్టం

Buldhana (Maharashtra), May 20 (ANI): At least 13 people died and three others injured after a truck collided with a minivan on Monday. The dreadful accident took place in Malkapur-Dharangaon road. Injured people are rushed to hospital for treatment. The truck was carrying salt and was going from Kutch to Nagpur. Police investigation is underway.
Last Updated : May 20, 2019, 11:58 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.