ETV Bharat / international

ఆంగ్​సాన్​ సూకీ పార్టీ రద్దుకు ఈసీ నిర్ణయం! - ఎన్నికల పార్టీ రద్దు మయన్మార్​

మయన్మార్​లో గత ఏడాది జరిగిన ఎన్నికల్లో విజయం సాధించిన నేషనల్​ లీగ్​ ఫర్ డెమోక్రెసీ పార్టీని రద్దు చేయాలని ఆ దేశ ఎన్నికల సంఘం భావిస్తోంది. ఎన్నికల్లో ఆ పార్టీ అవినీతికి పాల్పడిందని ఈసీ ఆరోపిస్తోంది.

Suu Kyi's NLD  fraud, మయన్మార్​ ఎన్నికల కమిషన్
మయన్మార్​
author img

By

Published : May 22, 2021, 1:04 PM IST

మయన్మార్​లో సైనిక ప్రభుత్వానికి వ్యతిరేకంగా నిరసనలు హోరెత్తుతున్న క్రమంలోనే కీలక పరిణామాలు చోటు చేసుకుంటున్నాయి. మయన్మార్​ కీలక నేత ఆంగ్​సాన్​ సూకీకి చెందిన నేషనల్​ లీగ్​ ఫర్​ డెమోక్రెసీ (ఎన్​ఎల్​డీ) పార్టీని రద్దు చేయాలని ఆ దేశ ఎన్నికల కమిషన్​ భావిస్తున్నట్లు సమాచారం.

అఖిల పక్షా పార్టీలతో శుక్రవారం సమావేశం ఏర్పాటు చేసింది ఆ దేశ ఎన్నికల సంఘం. ఈ సందర్భంగా ఎన్​ఎల్​డీపై కీలక వ్యాఖ్యలు చేశారు.. ఈసీ ఛైర్మన్ థైన్​ సోయ్. ఎన్​ఎల్​డీపై ఏ నిర్ణయం తీసుకుందాం? దానిని రద్దు చేద్దామా? అని వ్యాఖ్యానించారు. ​గతేడాది జరిగిన ఎన్నికల్లో ఎన్​ఎల్​డీ అవకతవకలకు పాల్పడిందన్న ఆరోపణలే తమ ఆలోచనలకు కారణమని పేర్కొన్నారు.

గతేడాది నవంబరులో జరిగిన ఎన్నికల్లో భారీస్థాయిలో అవినీతి జరిగిందని ఈసీ ఛైర్మన్​ ఆరోపించారు. ఆ ఎన్నికల్లో ఎన్​ఎల్​డీ 83 శాతం భారీ మెజారిటీతో విజయం సాధించింది.

ఈ ఏడాది ఫిబ్రవరి 1న ప్రభుత్వాన్ని సైన్యం తన అధీనంలోకి తెచ్చుకుంది.

ఇదీ చదవండి : 'టిబెట్​' ముసుగులో.. సరిహద్దుల్లో డ్రాగన్ విస్తరణ

మయన్మార్​లో సైనిక ప్రభుత్వానికి వ్యతిరేకంగా నిరసనలు హోరెత్తుతున్న క్రమంలోనే కీలక పరిణామాలు చోటు చేసుకుంటున్నాయి. మయన్మార్​ కీలక నేత ఆంగ్​సాన్​ సూకీకి చెందిన నేషనల్​ లీగ్​ ఫర్​ డెమోక్రెసీ (ఎన్​ఎల్​డీ) పార్టీని రద్దు చేయాలని ఆ దేశ ఎన్నికల కమిషన్​ భావిస్తున్నట్లు సమాచారం.

అఖిల పక్షా పార్టీలతో శుక్రవారం సమావేశం ఏర్పాటు చేసింది ఆ దేశ ఎన్నికల సంఘం. ఈ సందర్భంగా ఎన్​ఎల్​డీపై కీలక వ్యాఖ్యలు చేశారు.. ఈసీ ఛైర్మన్ థైన్​ సోయ్. ఎన్​ఎల్​డీపై ఏ నిర్ణయం తీసుకుందాం? దానిని రద్దు చేద్దామా? అని వ్యాఖ్యానించారు. ​గతేడాది జరిగిన ఎన్నికల్లో ఎన్​ఎల్​డీ అవకతవకలకు పాల్పడిందన్న ఆరోపణలే తమ ఆలోచనలకు కారణమని పేర్కొన్నారు.

గతేడాది నవంబరులో జరిగిన ఎన్నికల్లో భారీస్థాయిలో అవినీతి జరిగిందని ఈసీ ఛైర్మన్​ ఆరోపించారు. ఆ ఎన్నికల్లో ఎన్​ఎల్​డీ 83 శాతం భారీ మెజారిటీతో విజయం సాధించింది.

ఈ ఏడాది ఫిబ్రవరి 1న ప్రభుత్వాన్ని సైన్యం తన అధీనంలోకి తెచ్చుకుంది.

ఇదీ చదవండి : 'టిబెట్​' ముసుగులో.. సరిహద్దుల్లో డ్రాగన్ విస్తరణ

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.