ETV Bharat / crime

'గత మూడేళ్లలో ఆ రాష్ట్రంలో 22 వేల 278 మంది మహిళలు మిస్సింగ్'

author img

By

Published : Dec 13, 2022, 10:22 PM IST

Union Home Ministry report: ఆంధ్రప్రదేశ్‌లో మహిళలపై దాడులు గత మూడేళ్లలో పెరిగాయని కేంద్ర హోంశాఖ పార్లమెంటుకు తెలియజేసింది. పలువురు సభ్యులు అడిగిన ప్రశ్నలకు హోంశాఖ సహాయ మంత్రులు నిత్యానందరాయ్‌, అజయ్‌మిశ్రాలు లిఖితపూర్వకంగా ఇచ్చిన సమాధానాల్లో ఈ విషయం వెల్లడైంది.

Union Home Ministry report
Union Home Ministry report

Atrocities on women in AP increased: ఆంధ్రప్రదేశ్‌లో మహిళలపై దాడులు గత మూడేళ్లలో పెరిగాయని కేంద్ర హోంశాఖ పార్లమెంటుకు తెలియజేసింది. మహిళల మిస్సింగ్‌, అత్యాచారాలు, దొంగతనాలు, డెకాయిటీలు పెరిగినట్లు పలువురు సభ్యులు అడిగిన ప్రశ్నలకు హోంశాఖ సహాయమంత్రులు నిత్యానందరాయ్‌, అజయ్‌మిశ్రాలు లిఖితపూర్వకంగా ఇచ్చిన సమాధానాల్లో ఈ విషయం వెల్లడైంది. 2017లో 18 ఏళ్ల పైబడిన మహిళలు కనిపించకుండా పోయిన కేసులు 5 వేల 933 వరకు నమోదు అయితే.. 2018లో 5 వేల 703కి తగ్గిందని, తిరిగి 2019 నుంచి 2021 వరకు క్రమంగా పెరిగిందని లేఖలో మంత్రులు పేర్కొన్నారు.

లోకభకు ఇచ్చిన సమాధానాల ప్రకారం.. ఈ మూడేళ్లలో 22 వేల 278 మంది మహిళలు మిస్సింగ్ అయినట్లు వెల్లడైంది. 2019లో 6 వేల 252 మంది, 2020లో 7 వేల 57 మంది, 2021లో 8 వేల 969 మందిగా నమోదైనట్లు కేంద్ర హోం శాఖ తెలిపింది. ఈ మూడేళ్ల కాలంలోనే అత్యాచారాలు 9.39 శాతం, దొంగతనాలు 4.6 శాతం, డెకాయిటీలు 85 శాతం పెరిగాయని హోం శాఖ వెల్లడించింది. ఇదేకాలంలో.. దోపిడీలు 16.45 శాతం, చిన్నారుల కిడ్నాపులు 6.52 శాతం వరకు తగ్గినట్లు పేర్కొంది.

Atrocities on women in AP increased: ఆంధ్రప్రదేశ్‌లో మహిళలపై దాడులు గత మూడేళ్లలో పెరిగాయని కేంద్ర హోంశాఖ పార్లమెంటుకు తెలియజేసింది. మహిళల మిస్సింగ్‌, అత్యాచారాలు, దొంగతనాలు, డెకాయిటీలు పెరిగినట్లు పలువురు సభ్యులు అడిగిన ప్రశ్నలకు హోంశాఖ సహాయమంత్రులు నిత్యానందరాయ్‌, అజయ్‌మిశ్రాలు లిఖితపూర్వకంగా ఇచ్చిన సమాధానాల్లో ఈ విషయం వెల్లడైంది. 2017లో 18 ఏళ్ల పైబడిన మహిళలు కనిపించకుండా పోయిన కేసులు 5 వేల 933 వరకు నమోదు అయితే.. 2018లో 5 వేల 703కి తగ్గిందని, తిరిగి 2019 నుంచి 2021 వరకు క్రమంగా పెరిగిందని లేఖలో మంత్రులు పేర్కొన్నారు.

లోకభకు ఇచ్చిన సమాధానాల ప్రకారం.. ఈ మూడేళ్లలో 22 వేల 278 మంది మహిళలు మిస్సింగ్ అయినట్లు వెల్లడైంది. 2019లో 6 వేల 252 మంది, 2020లో 7 వేల 57 మంది, 2021లో 8 వేల 969 మందిగా నమోదైనట్లు కేంద్ర హోం శాఖ తెలిపింది. ఈ మూడేళ్ల కాలంలోనే అత్యాచారాలు 9.39 శాతం, దొంగతనాలు 4.6 శాతం, డెకాయిటీలు 85 శాతం పెరిగాయని హోం శాఖ వెల్లడించింది. ఇదేకాలంలో.. దోపిడీలు 16.45 శాతం, చిన్నారుల కిడ్నాపులు 6.52 శాతం వరకు తగ్గినట్లు పేర్కొంది.

ఇవీ చదవండి:

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.