ETV Bharat / city

PV SINDHU: అప్పన్న ఆలయానికి సింధు.. బంగారు పతకం సాధిస్తానని ధీమా

author img

By

Published : Aug 29, 2021, 8:08 PM IST

బ్యాడ్మింటన్ క్రీడాకారిణి, టోక్యో ఒలింపిక్స్​లో కాంస్య పతక విజేత.. పీవీ సింధు.. ఏపీ విశాఖ జిల్లాలోని సింహాచలం అప్పన్న ఆలయాన్ని దర్శించుకున్నారు. వచ్చే ఒలింపిక్స్​లో బంగారు పతకాన్ని సాధిస్తానని ధీమా వ్యక్తం చేశారు.

pv sindhu at appanna temple in simhachalam
pv sindhu at appanna temple in simhachalam

ఆంధ్రప్రదేశ్​లోని విశాఖ జిల్లా సింహాచలం శ్రీ వరాహ లక్ష్మీనృసింహస్వామివారిని.. బ్యాడ్మింటన్ క్రీడాకారిణి పీవీ సింధు దర్శించుకున్నారు. తన తండ్రితో కలిసి స్వామివారి సన్నిధికి వచ్చిన ఆమెను.. వచ్చే ఒలింపిక్స్​లో బంగారు పతకం సాధించాలంటూ వేద పండితులు ఆశీర్వదించారు. సింధుకు అధికారులు స్వాగతం పలికారు. పూజ అనంతరం ప్రసాదం అందజేశారు.

ఆలయ మర్యాదలతో సింధును సత్కరించారు. దేశానికి వరుసగా రెండు ఒలింపిక్స్ పతకాలను అందించిన తొలి ఇండియన్​గా రికార్డు సృష్టించిన సింధు.. మూడోసారి కూడా మెడల్ సాధిస్తానని విశ్వాసం వ్యక్తం చేశారు. సింహాచలం క్షేత్ర మహత్యాన్ని, స్వామివారి వైభవాన్ని పీవీ సింధుకు అర్చకులు, అధికారులు వివరించారు.

ఆంధ్రప్రదేశ్​లోని విశాఖ జిల్లా సింహాచలం శ్రీ వరాహ లక్ష్మీనృసింహస్వామివారిని.. బ్యాడ్మింటన్ క్రీడాకారిణి పీవీ సింధు దర్శించుకున్నారు. తన తండ్రితో కలిసి స్వామివారి సన్నిధికి వచ్చిన ఆమెను.. వచ్చే ఒలింపిక్స్​లో బంగారు పతకం సాధించాలంటూ వేద పండితులు ఆశీర్వదించారు. సింధుకు అధికారులు స్వాగతం పలికారు. పూజ అనంతరం ప్రసాదం అందజేశారు.

ఆలయ మర్యాదలతో సింధును సత్కరించారు. దేశానికి వరుసగా రెండు ఒలింపిక్స్ పతకాలను అందించిన తొలి ఇండియన్​గా రికార్డు సృష్టించిన సింధు.. మూడోసారి కూడా మెడల్ సాధిస్తానని విశ్వాసం వ్యక్తం చేశారు. సింహాచలం క్షేత్ర మహత్యాన్ని, స్వామివారి వైభవాన్ని పీవీ సింధుకు అర్చకులు, అధికారులు వివరించారు.

ఇదీ చదవండి:

Telugu Language Day: పలుకు పరవశం.. మాట మాధుర్యం.. ఇదీ తెలుగు గొప్పతనం!

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.