భాగ్యనగరం శివ నామస్మరణతో మార్మోగింది. కోటి లింగేశ్వర శైవక్షేత్రం, ధర్మో రక్షతి రక్షితః ట్రస్ట్, శ్రీ ద్వాదశ జ్యోతిర్లింగాల ఆర్యవైశ్య నిత్యాన్న ట్రస్టు సంయుక్త ఆధ్వర్యంలో కోటి రుద్రాక్షలతో పూజలు చేశారు. నాంపల్లిలో జరిగిన ఈ కార్యక్రమానికి శైవక్షేత్ర పీఠాధిపతులు శివస్వామి సమక్షంలో పాలాభిషేకం చేశారు. 108 జంటలతో లక్ష్మీగణపతి హోమం, నవగ్రహ హోమం, లక్ష్మీ నరసింహ సుదర్శన హోమం, శివపార్వతుల కల్యాణం నిర్వహించారు.
ఇవీచూడండి: సర్వం శివమయం.. శివాలయాల్లో భక్తజన సందోహం..