ETV Bharat / city

METERS IN AP: వ్యవసాయ బోర్లకు మీటర్లు.. రైతులకు తెలియకుండానే ఏర్పాట్లు

author img

By

Published : Jul 19, 2022, 5:44 PM IST

METERS IN AP: అన్నదాతలను అడిగేది లేదు.. రైతన్నలకు సమాచారం ఇచ్చేది లేదు.. వ్యవసాయ బోర్‌ కనిపించిందా మీటర్‌ బిగించేయడమే. పొలం వెళ్లి చూసుకునే వరకు రైతుకు అసలు విషయం తెలియడం లేదు. ఉమ్మడి అనంతపురం జిల్లాలో ఇబ్బడిముబ్బడిగా వ్యవసాయ మోటార్లకు మీటర్లు ఏర్పాటు చేస్తున్నారు.

METERS IN AP
వ్యవసాయ బోర్లకు మీటర్లు

METERS IN AP: ఏపీలోని ఉమ్మడి అనంతపురం జిల్లాలో వ్యవసాయ మోటార్లకు విద్యుత్ మీటర్లు అమర్చటం కొనసాగుతోంది. దేశవ్యాప్తంగా రైతుల నుంచి వ్యతిరేకత రావడంతో కేంద్రం వెనక్కి తగ్గినా.. ఏపీ ప్రభుత్వం మాత్రం మొండిగా ముందుకెళ్తోంది. కేవలం ప్రయోగాత్మకంగా బిగిస్తున్నామని విద్యుత్‌శాఖ సిబ్బంది కొన్నిచోట్ల సర్దిచెబుతుండగా.. మరికొన్నిచోట్ల చెప్పకుండానే బిగించేస్తున్నారు. రైతులు, ప్రతిపక్ష పార్టీల నేతలు మీటర్లు తీసుకెళ్లే వాహనాలను అడ్డుకుంటున్నప్పటికీ.. ప్రభుత్వం మాత్రం వెనక్కు తగ్గటంలేదు. అనంతపురం, అనంతపురం గ్రామీణం, హిందూపురం డివిజన్లలో ఇప్పటికే 9 వందల మీటర్లు బిగించారు.

రాప్తాడు మండలం గొందిరెడ్డిపల్లిలో వందకు పైగా మీటర్లు బిగించారు. తాము లేని సమయంలో పొలాల్లోకి వెళ్లి.. విద్యుత్ సిబ్బంది, గుత్తేదారులు మీటర్లు బిగిస్తున్నారని రైతులు అంటున్నారు. విద్యుత్ నియంత్రిక కింద మీటర్ల బిగింపు పూర్తవగానే.. కనెక్షన్లు ఇచ్చే ప్రక్రియను కొనసాగిస్తున్నారని ఆరోపిస్తున్నారు. నిలదీసిన వారిని పోలీసుస్టేషన్‌కు పిలిపించి ఉదయం నుంచి సాయంత్రం వరకు కూర్చోబెడుతున్నారని రైతులు అంటున్నారు. నష్టాల సాగుతో ఇప్పటికే అప్పులపాలయ్యామని.. ఇప్పుడు కొత్తగా విద్యుత్ ఛార్జీల భారం వేస్తే ఆత్మహత్యలు చేసుకోవడమే దిక్కని రైతులు వాపోతున్నారు.

వ్యవసాయ బోర్లకు మీటర్లు.. రైతులకు తెలియకుండానే ఏర్పాట్లు

రైతులకు అండగా నిలిచిన తమపై కేసులు పెడతామని పోలీసులు బెదిరిస్తున్నట్లు విపక్ష నేతలు తెలిపారు. విద్యుత్ మీటర్ల పేరిట రైతుల మెడకు ప్రభుత్వం ఉరితాళ్లు బిగిస్తోందని ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రభుత్వం ఇప్పటికైనా మీటర్ల బిగింపును ఆపేయడంతోపాటు.. ఇప్పటికే బిగించిన వాటిని తీసివేయకపోతే.. రాష్ట్రవ్యాప్త ఆందోళనకు సిద్ధమని రైతులు హెచ్చరిస్తున్నారు.

ఇవీ చదవండి:

METERS IN AP: ఏపీలోని ఉమ్మడి అనంతపురం జిల్లాలో వ్యవసాయ మోటార్లకు విద్యుత్ మీటర్లు అమర్చటం కొనసాగుతోంది. దేశవ్యాప్తంగా రైతుల నుంచి వ్యతిరేకత రావడంతో కేంద్రం వెనక్కి తగ్గినా.. ఏపీ ప్రభుత్వం మాత్రం మొండిగా ముందుకెళ్తోంది. కేవలం ప్రయోగాత్మకంగా బిగిస్తున్నామని విద్యుత్‌శాఖ సిబ్బంది కొన్నిచోట్ల సర్దిచెబుతుండగా.. మరికొన్నిచోట్ల చెప్పకుండానే బిగించేస్తున్నారు. రైతులు, ప్రతిపక్ష పార్టీల నేతలు మీటర్లు తీసుకెళ్లే వాహనాలను అడ్డుకుంటున్నప్పటికీ.. ప్రభుత్వం మాత్రం వెనక్కు తగ్గటంలేదు. అనంతపురం, అనంతపురం గ్రామీణం, హిందూపురం డివిజన్లలో ఇప్పటికే 9 వందల మీటర్లు బిగించారు.

రాప్తాడు మండలం గొందిరెడ్డిపల్లిలో వందకు పైగా మీటర్లు బిగించారు. తాము లేని సమయంలో పొలాల్లోకి వెళ్లి.. విద్యుత్ సిబ్బంది, గుత్తేదారులు మీటర్లు బిగిస్తున్నారని రైతులు అంటున్నారు. విద్యుత్ నియంత్రిక కింద మీటర్ల బిగింపు పూర్తవగానే.. కనెక్షన్లు ఇచ్చే ప్రక్రియను కొనసాగిస్తున్నారని ఆరోపిస్తున్నారు. నిలదీసిన వారిని పోలీసుస్టేషన్‌కు పిలిపించి ఉదయం నుంచి సాయంత్రం వరకు కూర్చోబెడుతున్నారని రైతులు అంటున్నారు. నష్టాల సాగుతో ఇప్పటికే అప్పులపాలయ్యామని.. ఇప్పుడు కొత్తగా విద్యుత్ ఛార్జీల భారం వేస్తే ఆత్మహత్యలు చేసుకోవడమే దిక్కని రైతులు వాపోతున్నారు.

వ్యవసాయ బోర్లకు మీటర్లు.. రైతులకు తెలియకుండానే ఏర్పాట్లు

రైతులకు అండగా నిలిచిన తమపై కేసులు పెడతామని పోలీసులు బెదిరిస్తున్నట్లు విపక్ష నేతలు తెలిపారు. విద్యుత్ మీటర్ల పేరిట రైతుల మెడకు ప్రభుత్వం ఉరితాళ్లు బిగిస్తోందని ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రభుత్వం ఇప్పటికైనా మీటర్ల బిగింపును ఆపేయడంతోపాటు.. ఇప్పటికే బిగించిన వాటిని తీసివేయకపోతే.. రాష్ట్రవ్యాప్త ఆందోళనకు సిద్ధమని రైతులు హెచ్చరిస్తున్నారు.

ఇవీ చదవండి:

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.