LIVE : విజయవాడలో ప్రపంచ తెలుగు రచయితల మహాసభలు - ప్రత్యక్షప్రసారం - TELUGU WRITERS CONFERENCE LIVE

🎬 Watch Now: Feature Video

thumbnail

By ETV Bharat Telangana Team

Published : Dec 28, 2024, 4:15 PM IST

Updated : Dec 28, 2024, 4:31 PM IST

6th Telugu Writers Conference LIVE : మాతృభాషను భవిష్యత్ తరాలకు పదిలంగా అందించడమే లక్ష్యంగా ఆరో ప్రపంచ తెలుగు రచయితల మహాసభలు విజయవాడలో ఘనంగా జరుగుతున్నాయి. రెండు రోజులపాటు జరిగే ఈ సభల్లో దేశవిదేశాల నుంచి 1500 మందికి పైగా ప్రతినిధులు పాల్గొన్నారు. కేబీఎన్ కళాశాల ప్రాంగణంలో ఉదయం సభలు వైభవంగా ప్రారంభమయ్యాయి. రెండు రోజుల్లో 25కు పైగా సదస్సులు, కవితా, సాహిత్య సమ్మేళనాలు నిర్వహిస్తున్నారు. తెలుగు భాషను భవిష్యత్ తరాలకు మరింత చేరువ చేయడానికి ఏం మార్పులు తేవాలనే లక్ష్యంతో మహాసభల్లో ప్రధానంగా చర్చలు జరుగుతున్నాయి.ఉదయం కార్యక్రమంలో సుప్రీంకోర్టు మాజీ చీఫ్ జస్టిస్ ఎన్వీ రమణ, మార్గదర్శి మేనేజింగ్‌ డైరెక్టర్‌ శైలజా కిరణ్‌ పాల్గొన్నారు. ప్రపంచంలో అత్యధిక ప్రజలు మాట్లాడే 14వ భాష తెలుగు అని మార్గదర్శి శైలజా కిరణ్​ అన్నారు. అలాగే దేశంలో అత్యధిక ప్రజలు మాట్లాడే నాలుగో భాష తెలుగు అని పేర్కొన్నారు. కవిత్రయం వంటి కవుల కారణంగా తెలుగుకు ప్రాచుర్యం వచ్చిందన్నారు. దేశభాషలందు తెలుగు లెస్స అని శ్రీకృష్ణదేవరాయలు ప్రశంసించారని గుర్తు చేశారు. ప్రస్తుతం ఈ మహాసభల్లో ఈనాడు ఆంధ్రప్రదేశ్ ఎడిటర్ ఎం. నాగేశ్వరరావు మాట్లాడుతున్నారు. ఈ కార్యక్రమాన్ని ప్రత్యక్షంగా చూద్దాం. 
Last Updated : Dec 28, 2024, 4:31 PM IST

ABOUT THE AUTHOR

...view details

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.