ETV Bharat / business

అలా చేస్తేనే కరోనా కట్టడి: సీఐఐ - కరోనా నిరోధానికి ఉదయ్​ కోటక్ సలహాలు

దేశంలో కరోనా విలయతాండవం చేస్తున్న వేళ కేంద్రానికి కీలక సూచనలు చేసింది పరిశ్రమల విభాగం సీఐఐ. కొవిడ్​కు అడ్డుకట్ట వేసేలా ఉన్నత స్థాయి చర్యలు అవసరమని పేర్కొంది. ఇందుకోసం ఆర్థిక కార్యకలాపాలను కూడా తగ్గించాలని సూచించింది.

CII instructions to prevent corona spread
కరోనా కట్టడికి సీఐఐ సూచనలు
author img

By

Published : May 3, 2021, 2:19 PM IST

కరోనా వ్యాప్తికి అడ్డుకట్టవేసేలా ఆర్థిక కార్యకలాపాలు తగ్గించి, జాతీయ స్థాయిలో కీలక చర్యలు తీసుకోవాలని పరిశ్రమల సమాఖ్య-సీఐఐ కేంద్రానికి సూచించింది. కొవిడ్-19 కేసులు పెరుగుతున్నందున.. ప్రస్తుతం జీవితాలను రక్షించడం కీలకమని సీఐఐ అధ్యక్షుడు ఉదయ్​ కోటక్ పేర్కొన్నారు.

"ప్రస్తుత పరిస్థితిని అదుపు చేసేందుకు హెల్త్​కేర్, ఫ్రంట్​లైన్ వర్కర్లు తమ వంతు ప్రయత్నం చేస్తున్నారు. కానీ ప్రస్తుతమున్న వైద్య సాంకేతికతతో భారీగా పెరుగుతున్న కేసులను అదుపు చేయడం సాధ్యం కాకపోవచ్చు. ఈ విషయంలో మనం కచ్చితంగా దేశీయ, విదేశీ నిపుణుల సలహాలు తీసుకోవాలి."

-ఉదయ్ కోటక్, సీఐఐ అధ్యక్షుడు

వైద్య సిబ్బంది భద్రత, మెడికల్ లాజిస్టిక్స్, ఇన్​ఫ్రాస్ట్రక్చర్​ రక్షణకు సాయుధ బలగాలను మోహరించాలని కూడా కేంద్రానికి సూచించింది సీఐఐ. టీకా వేసేందుకు, ఇతర వైద్య అవసరాలకు విశ్రాంత​ వైద్య సిబ్బంది, డాక్టర్లు, నర్సులను ఉపయోగించుకోవాలని కోరింది.

పట్టణ, గ్రామీణ ప్రాంతాల్లో ప్రస్తుతం నిర్వహిస్తున్న ఆర్​టీ-పీసీఆర్​ టెస్టుల సంఖ్యను రెట్టింపు చేయాలని సీఐఐ కోరింది.

ఇదీ చదవండి:భారత్​కు ఖోస్లా 10 మిలియన్​ డాలర్ల ఆర్థిక సాయం

కరోనా వ్యాప్తికి అడ్డుకట్టవేసేలా ఆర్థిక కార్యకలాపాలు తగ్గించి, జాతీయ స్థాయిలో కీలక చర్యలు తీసుకోవాలని పరిశ్రమల సమాఖ్య-సీఐఐ కేంద్రానికి సూచించింది. కొవిడ్-19 కేసులు పెరుగుతున్నందున.. ప్రస్తుతం జీవితాలను రక్షించడం కీలకమని సీఐఐ అధ్యక్షుడు ఉదయ్​ కోటక్ పేర్కొన్నారు.

"ప్రస్తుత పరిస్థితిని అదుపు చేసేందుకు హెల్త్​కేర్, ఫ్రంట్​లైన్ వర్కర్లు తమ వంతు ప్రయత్నం చేస్తున్నారు. కానీ ప్రస్తుతమున్న వైద్య సాంకేతికతతో భారీగా పెరుగుతున్న కేసులను అదుపు చేయడం సాధ్యం కాకపోవచ్చు. ఈ విషయంలో మనం కచ్చితంగా దేశీయ, విదేశీ నిపుణుల సలహాలు తీసుకోవాలి."

-ఉదయ్ కోటక్, సీఐఐ అధ్యక్షుడు

వైద్య సిబ్బంది భద్రత, మెడికల్ లాజిస్టిక్స్, ఇన్​ఫ్రాస్ట్రక్చర్​ రక్షణకు సాయుధ బలగాలను మోహరించాలని కూడా కేంద్రానికి సూచించింది సీఐఐ. టీకా వేసేందుకు, ఇతర వైద్య అవసరాలకు విశ్రాంత​ వైద్య సిబ్బంది, డాక్టర్లు, నర్సులను ఉపయోగించుకోవాలని కోరింది.

పట్టణ, గ్రామీణ ప్రాంతాల్లో ప్రస్తుతం నిర్వహిస్తున్న ఆర్​టీ-పీసీఆర్​ టెస్టుల సంఖ్యను రెట్టింపు చేయాలని సీఐఐ కోరింది.

ఇదీ చదవండి:భారత్​కు ఖోస్లా 10 మిలియన్​ డాలర్ల ఆర్థిక సాయం

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.