ETV Bharat / business

నోకియా, ఎయిర్​టెల్ కొత్త స్కెచ్- రూ.7,500 కోట్లకు డీల్​

author img

By

Published : Apr 28, 2020, 2:21 PM IST

Updated : Apr 28, 2020, 6:02 PM IST

టెలికాం దిగ్గజం భారతీ ఎయిర్​టెల్, టెలికాం ఉపకరణాల తయారీ సంస్థ నోకియా మధ్య రూ.7,500 కోట్ల భారీ ఒప్పందం కుదిరింది. 4జీ నెట్​వర్క్ విస్తరణలో భాగంగా నోకియాతో ఈ ఒప్పందం కుదుర్చుకున్నట్లు ఎయిర్​టెల్ ప్రకటించింది.

airtel nokia deal
ఎయిర్​టెల్ నోకియా ఒప్పందం

దేశంలో 4జీ నెట్​వర్క్ విస్తరణ సహా, నెట్​వర్క్ నాణ్యత పెంపునకు టెలికాం ఉపకరణాల తయారీ సంస్థ నోకియాతో టెలికాం దిగ్గజం భారతీ ఎయిర్​టెల్ భారీ ఒప్పందం కుదుర్చుకుంది. ఈ రెండు సంస్థల మధ్య ఒప్పందం విలువ సుమారు రూ.7,500 కోట్లుగా ఉండొచ్చని విశ్వసనీయ వర్గాల ద్వారా తెలిసింది.

దేశంలోని తొమ్మిది సర్కిళ్లలో సింగిల్ రేడియో యాక్సెస్ నెట్‌వర్క్ (ఎస్ఆర్​ఏఎన్​) సర్వీసులు అందించేందుకు నోకియాతో ఒప్పందం కుదుర్చుకున్నట్లు ఎయిర్​టెల్ ప్రకటించింది. భవిష్యత్​లో 5జీ నెట్​వర్క్​అందించేందుకు ఈ ఒప్పందం ద్వారా పునాది పడినట్లు తెలిపింది. ఈ డీల్​తో తొమ్మిది సర్కిళ్లలో 300,000 రేడియో యూనిట్లను వివిధ స్పెక్ట్రమ్​ బ్యాండ్లలో ఏర్పాటు చేయనున్నట్లు వెల్లడించింది. 2022 వరకు ఈ ప్రక్రియ పూర్తవుతుందని ఎయిర్​టెల్ వివరించింది.

దేశంలో 4జీ నెట్​వర్క్ విస్తరణ సహా, నెట్​వర్క్ నాణ్యత పెంపునకు టెలికాం ఉపకరణాల తయారీ సంస్థ నోకియాతో టెలికాం దిగ్గజం భారతీ ఎయిర్​టెల్ భారీ ఒప్పందం కుదుర్చుకుంది. ఈ రెండు సంస్థల మధ్య ఒప్పందం విలువ సుమారు రూ.7,500 కోట్లుగా ఉండొచ్చని విశ్వసనీయ వర్గాల ద్వారా తెలిసింది.

దేశంలోని తొమ్మిది సర్కిళ్లలో సింగిల్ రేడియో యాక్సెస్ నెట్‌వర్క్ (ఎస్ఆర్​ఏఎన్​) సర్వీసులు అందించేందుకు నోకియాతో ఒప్పందం కుదుర్చుకున్నట్లు ఎయిర్​టెల్ ప్రకటించింది. భవిష్యత్​లో 5జీ నెట్​వర్క్​అందించేందుకు ఈ ఒప్పందం ద్వారా పునాది పడినట్లు తెలిపింది. ఈ డీల్​తో తొమ్మిది సర్కిళ్లలో 300,000 రేడియో యూనిట్లను వివిధ స్పెక్ట్రమ్​ బ్యాండ్లలో ఏర్పాటు చేయనున్నట్లు వెల్లడించింది. 2022 వరకు ఈ ప్రక్రియ పూర్తవుతుందని ఎయిర్​టెల్ వివరించింది.

ఇదీ చూడండి:70 శాతం తగ్గిన వాట్సాప్ ఫార్వర్డ్ మెసేజ్​లు

Last Updated : Apr 28, 2020, 6:02 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.