ETV Bharat / briefs

అందని ద్రాక్షలా నాలుగు రూపాయల ప్రోత్సాహకం

author img

By

Published : Jun 23, 2019, 4:57 AM IST

Updated : Jun 23, 2019, 7:19 AM IST

పాడి రైతులకు నాలుగు రూపాయల ప్రోత్సాహకం అందండం లేదు. సంవత్సర కాలంగా కొట్లాది రూపాయల బకాయిలు నిలిచిపోయాయి.  ప్రైవేటు డైయిరీలు సకాలంలోనే డబ్బులు చెల్లిస్తున్నాయని కానీ ప్రభుత్వ డైయిరీలు చెల్లించడం లేదని రైతులు చెబుతున్నారు. పరిస్థితి ఇలాగే ఉంటే రానున్న రోజుల్లో ప్రభుత్వ డైయిరీలకు పాలు పోసేవారే ఉండరని అంటున్నారు పాడి రైతులు.

పాడి రైతులకు నాలుగు రూపాయల ప్రోత్సాహకం?

ప్రభుత్వం ఆధ్వర్యంలో నడిచే డెయిరీల్లో పాలు పోసే రైతులకు నాలుగు రూపాయల ప్రోత్సాహకం అందని ద్రాక్షలా మారింది. గతేడాది మే నుంచి ఇప్పటి వరకు ఒక్కో రైతుకు వేలాది రూపాయల బకాయిలు నిలిచిపోయాయి. పాడిపశువుల నిర్వహణ కష్టంగా మారిందని రైతులు ఆందోళన చెందుతున్నారు. ప్రోత్సాహకం కోసం కేంద్రాల చుట్టూ కాళ్లరిగేలా తిరుగుతున్నా, తమ గోడును పట్టించుకునే వారే లేరని వాపోతున్నారు.

వంద కోట్లకు పైనే..

విజయ, ముల్కనూరు, కరీంనగర్, మదర్ డెయిరీల్లో పాలు పోసే సుమారు 2.12 లక్షల మంది రైతులు ప్రోత్సాహకం కోసం ఎదురుచూస్తున్నారు. గతంలో రెండు, మూడు నెలలకు ఒకసారైనా డబ్బులు చెల్లించే ప్రభుత్వం, ఈ సారి మాత్రం ఏడాది దాటినా పైసలు ఖాతాల్లో జమ చేయకపోవడంపై సందేహాలు వ్యక్తం చేస్తున్నారు. నాలుగు డెయిరీల్లో కలిపి వంద కోట్లకు పైగా ప్రోత్సాహకాలు పెండింగ్​లో ఉన్నాయి.

డెయిరీల వారీగా నాలుగు రూపాయాల ప్రోత్సాహకం పెండింగ్ వివరాలు

డెయిరీ పాలుపోసిన రైతులు పెండింగ్ ఉన్న మొత్తం రూ.కోట్లలో
విజయ 90వేలు 54
మదర్ 48వేలు 18
కరీంనగర్ 52వేలు 20.4
ముల్కనూరు 22వేలు 8.5


వర్షాలు లేక పశుగ్రాసానికి కొరత ఏర్పడిందని, సంరక్షణ కష్టంగా మారిందని పశుపోషకులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఇబ్బందులను దృష్టిలో పెట్టుకొని వెంటనే ప్రోత్సాహకం విడుదల చేయాలని వేడుకుంటున్నారు. త్వరలోనే రైతుల ఖాతాల్లో జమ చేస్తామని... సమస్యను పశుసంవర్ధక శాఖ కార్యదర్శి దృష్టికి తీసుకెళ్లి వెంటనే పరిష్కరిస్తామని అధికారులు చెబుతున్నారు.

ఇవీ చూడండి: చర్చలు సఫలం... సమ్మె విరమించిన జూడాలు

ప్రభుత్వం ఆధ్వర్యంలో నడిచే డెయిరీల్లో పాలు పోసే రైతులకు నాలుగు రూపాయల ప్రోత్సాహకం అందని ద్రాక్షలా మారింది. గతేడాది మే నుంచి ఇప్పటి వరకు ఒక్కో రైతుకు వేలాది రూపాయల బకాయిలు నిలిచిపోయాయి. పాడిపశువుల నిర్వహణ కష్టంగా మారిందని రైతులు ఆందోళన చెందుతున్నారు. ప్రోత్సాహకం కోసం కేంద్రాల చుట్టూ కాళ్లరిగేలా తిరుగుతున్నా, తమ గోడును పట్టించుకునే వారే లేరని వాపోతున్నారు.

వంద కోట్లకు పైనే..

విజయ, ముల్కనూరు, కరీంనగర్, మదర్ డెయిరీల్లో పాలు పోసే సుమారు 2.12 లక్షల మంది రైతులు ప్రోత్సాహకం కోసం ఎదురుచూస్తున్నారు. గతంలో రెండు, మూడు నెలలకు ఒకసారైనా డబ్బులు చెల్లించే ప్రభుత్వం, ఈ సారి మాత్రం ఏడాది దాటినా పైసలు ఖాతాల్లో జమ చేయకపోవడంపై సందేహాలు వ్యక్తం చేస్తున్నారు. నాలుగు డెయిరీల్లో కలిపి వంద కోట్లకు పైగా ప్రోత్సాహకాలు పెండింగ్​లో ఉన్నాయి.

డెయిరీల వారీగా నాలుగు రూపాయాల ప్రోత్సాహకం పెండింగ్ వివరాలు

డెయిరీ పాలుపోసిన రైతులు పెండింగ్ ఉన్న మొత్తం రూ.కోట్లలో
విజయ 90వేలు 54
మదర్ 48వేలు 18
కరీంనగర్ 52వేలు 20.4
ముల్కనూరు 22వేలు 8.5


వర్షాలు లేక పశుగ్రాసానికి కొరత ఏర్పడిందని, సంరక్షణ కష్టంగా మారిందని పశుపోషకులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఇబ్బందులను దృష్టిలో పెట్టుకొని వెంటనే ప్రోత్సాహకం విడుదల చేయాలని వేడుకుంటున్నారు. త్వరలోనే రైతుల ఖాతాల్లో జమ చేస్తామని... సమస్యను పశుసంవర్ధక శాఖ కార్యదర్శి దృష్టికి తీసుకెళ్లి వెంటనే పరిష్కరిస్తామని అధికారులు చెబుతున్నారు.

ఇవీ చూడండి: చర్చలు సఫలం... సమ్మె విరమించిన జూడాలు

Intro:
jk_tg_nlg_185_22_Mundhuku_sagani_karif_avb02_pkg_c21



Body:jk_tg_nlg_185_22_Mundhuku_sagani_karif_avb02_pkg_c21


Conclusion:.....
Last Updated : Jun 23, 2019, 7:19 AM IST

For All Latest Updates

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.