ETV Bharat / bharat

సరిహద్దులో పాక్​ చొరబాటుదారుడు హతం

author img

By

Published : Mar 21, 2021, 12:54 PM IST

రాజస్థాన్​లోని​ అంతర్జాతీయ సరిహద్దుల గుండా భారత్​లోకి చొరబడేందుకు ప్రయత్నించిన దుండగుడిని భద్రతా దళాలు హతమార్చాయి. శనివారం రాత్రి ఈ ఘటన జరిగినట్లు అధికారులు తెలిపారు.

Intruder shot dead at Indo-Pak border village
భారత్​-పాక్​ సరిహద్దుల్లో చొరబాటుదారుడు హతం

రాజస్థాన్​లోని పాక్​ అంతర్జాతీయ సరిహద్దు వద్ద చొరబాటు యత్నాన్ని భద్రతా దళాలు భగ్నం చేశాయి. పాకిస్థాన్ ​నుంచి అక్రమంగా దేశంలోకి ప్రవేశించేందుకు యత్నించిన చొరబాటుదారుడిని భారత సైన్యం కాల్చి చంపింది. ఈ ఘటన శనివారం రాత్రి.. శ్రీ గంగానగర్​ జిల్లాలోని సరిహద్దు ప్రాంతంలో జరిగిందని అధికారులు తెలిపారు.

"భారత భూభాగంలోకి ప్రవేశించేందుకు యత్నించిన చొరబాటుదారున్ని బీఎస్​ఎఫ్​ పెట్రోలింగ్ సిబ్బంది గుర్తించారు. లొంగిపోమని పలుమార్లు హెచ్చరించినా వినకపోవడం వల్ల భద్రతా సిబ్బంది కాల్పులు జరిపారు" అని ఓ అధికారి వెల్లడించారు.

అయితే.. అతని వద్ద ఎలాంటి ఆయుధాలు, మందుగుండు సామగ్రి లభించలేదని తెలిపారు.

ఇదీ చూడండి: 'మంత్రికి 100 కోట్లు' లేఖ వ్యవహారంలో కొత్త ట్విస్ట్

రాజస్థాన్​లోని పాక్​ అంతర్జాతీయ సరిహద్దు వద్ద చొరబాటు యత్నాన్ని భద్రతా దళాలు భగ్నం చేశాయి. పాకిస్థాన్ ​నుంచి అక్రమంగా దేశంలోకి ప్రవేశించేందుకు యత్నించిన చొరబాటుదారుడిని భారత సైన్యం కాల్చి చంపింది. ఈ ఘటన శనివారం రాత్రి.. శ్రీ గంగానగర్​ జిల్లాలోని సరిహద్దు ప్రాంతంలో జరిగిందని అధికారులు తెలిపారు.

"భారత భూభాగంలోకి ప్రవేశించేందుకు యత్నించిన చొరబాటుదారున్ని బీఎస్​ఎఫ్​ పెట్రోలింగ్ సిబ్బంది గుర్తించారు. లొంగిపోమని పలుమార్లు హెచ్చరించినా వినకపోవడం వల్ల భద్రతా సిబ్బంది కాల్పులు జరిపారు" అని ఓ అధికారి వెల్లడించారు.

అయితే.. అతని వద్ద ఎలాంటి ఆయుధాలు, మందుగుండు సామగ్రి లభించలేదని తెలిపారు.

ఇదీ చూడండి: 'మంత్రికి 100 కోట్లు' లేఖ వ్యవహారంలో కొత్త ట్విస్ట్

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.