ETV Bharat / bharat

"ఉద్రిక్తతలు తగ్గిస్తాం"

ఫిబ్రవరి 14నాటి పుల్వామా దాడి అనంతరం భారత్​-పాక్​ మధ్య ఉద్రిక్తతలు నెలకొన్నాయి. ఈ నేపథ్యంలో ఇరు దేశాల అధికారులతో ఐక్యరాజ్యసమితి ప్రధాన కార్యదర్శి ఆంటోనియో గుటెరస్ చర్చించినట్టు ఆయన అధికార ప్రతినిధి స్టెఫానీ డుజారిక్ వెల్లడించారు.

author img

By

Published : Mar 7, 2019, 5:59 AM IST

Updated : Mar 7, 2019, 7:31 AM IST

భారత్​-పాక్ ఉద్రిక్తతలపై ఐరాస అధికార ప్రతినిధి డుజారెక్

భారత్​-పాక్ మధ్య నెలకొన్న ఉద్రిక్త పరిస్థితులను తగ్గించడానికి ఐరాస కృషి చేస్తోంది. ఇరు దేశాల అధికారులతో ఐరాస ప్రధాన కార్యదర్శి ఆంటోనియో గుటెరస్​ సంభాషించినట్లు ఆయన అధికార ప్రతినిధి స్టెఫానీ వెల్లడించారు. అయితే ఇరు దేశాల ప్రధానమంత్రులు నరేంద్రమోదీ, ఇమ్రన్​ఖాన్​లతో గుటెరస్ సంభాషించలేదని స్పష్టం చేశారు.

పుల్వామా దాడికి కారణమైన జైషే మహ్మద్ ఉగ్ర శిబిరాలపై ఫిబ్రవరి 26న వైమానిక దాడులు జరిపింది భారత్. ప్రతిగా పాక్ వైమానిక దళం ఎఫ్​-16 యుద్ధ విమానాలతో భారత్​పై దాడికి యత్నించింది. భారత్​కు చెందిన మిగ్-21ను పడగొట్టి పారాషూట్​ ద్వారా పాక్​లో దిగిన పైలట్ అభినందన్​ వర్ధమాన్​ను అదుపులోకి తీసుకుంది. అంతర్జాతీయ ఒత్తిళ్లు తీవ్రమవుతున్న కారణంగా గత శుక్రవారం అభినందన్​ను పాక్ విడిచిపెట్టింది.

"మాకు పూర్తి సమాచారం ఉంది. కార్యదర్శి గుటెరస్​ ఇరు దేశాల ప్రధానులతో ఏ విధమైన సంభాషణ చేయలేదు. కానీ ఆయన ఇరు దేశాల అధికారులతో మాట్లాడారు. ఇరు దేశాల మధ్య ఉద్రిక్తతలు తగ్గించేందుకు ఎంతదాకైనా వెళ్లేందుకు ఆయన యోచిస్తున్నారు" -స్టెఫానీ డుజారిక్, ఐరాస అధికార ప్రతినిధి

ఉద్రిక్తతలు తగ్గించేందుకు కార్యదర్శి గుటెరస్ ఎప్పుడూ ప్రయత్నిస్తూనే ఉంటారన్నారు డుజారిక్. ఉద్రిక్తతలు తగ్గుముఖం పట్టేందుకు ఇరు దేశాలు తక్షణ చర్యలు తీసుకోవాలని ప్రకటనలు చేస్తూనే ఉన్నారు స్టెఫానీ. పుల్వామా దాడిని సైతం ఐరాస ఖండించింది. పిరికిపంద చర్యగా తన ప్రకటనలో పేర్కొంది.

భారత్​-పాక్ మధ్య నెలకొన్న ఉద్రిక్త పరిస్థితులను తగ్గించడానికి ఐరాస కృషి చేస్తోంది. ఇరు దేశాల అధికారులతో ఐరాస ప్రధాన కార్యదర్శి ఆంటోనియో గుటెరస్​ సంభాషించినట్లు ఆయన అధికార ప్రతినిధి స్టెఫానీ వెల్లడించారు. అయితే ఇరు దేశాల ప్రధానమంత్రులు నరేంద్రమోదీ, ఇమ్రన్​ఖాన్​లతో గుటెరస్ సంభాషించలేదని స్పష్టం చేశారు.

పుల్వామా దాడికి కారణమైన జైషే మహ్మద్ ఉగ్ర శిబిరాలపై ఫిబ్రవరి 26న వైమానిక దాడులు జరిపింది భారత్. ప్రతిగా పాక్ వైమానిక దళం ఎఫ్​-16 యుద్ధ విమానాలతో భారత్​పై దాడికి యత్నించింది. భారత్​కు చెందిన మిగ్-21ను పడగొట్టి పారాషూట్​ ద్వారా పాక్​లో దిగిన పైలట్ అభినందన్​ వర్ధమాన్​ను అదుపులోకి తీసుకుంది. అంతర్జాతీయ ఒత్తిళ్లు తీవ్రమవుతున్న కారణంగా గత శుక్రవారం అభినందన్​ను పాక్ విడిచిపెట్టింది.

"మాకు పూర్తి సమాచారం ఉంది. కార్యదర్శి గుటెరస్​ ఇరు దేశాల ప్రధానులతో ఏ విధమైన సంభాషణ చేయలేదు. కానీ ఆయన ఇరు దేశాల అధికారులతో మాట్లాడారు. ఇరు దేశాల మధ్య ఉద్రిక్తతలు తగ్గించేందుకు ఎంతదాకైనా వెళ్లేందుకు ఆయన యోచిస్తున్నారు" -స్టెఫానీ డుజారిక్, ఐరాస అధికార ప్రతినిధి

ఉద్రిక్తతలు తగ్గించేందుకు కార్యదర్శి గుటెరస్ ఎప్పుడూ ప్రయత్నిస్తూనే ఉంటారన్నారు డుజారిక్. ఉద్రిక్తతలు తగ్గుముఖం పట్టేందుకు ఇరు దేశాలు తక్షణ చర్యలు తీసుకోవాలని ప్రకటనలు చేస్తూనే ఉన్నారు స్టెఫానీ. పుల్వామా దాడిని సైతం ఐరాస ఖండించింది. పిరికిపంద చర్యగా తన ప్రకటనలో పేర్కొంది.

Chennai, Mar 05 (ANI): In a bid to give tough competition to the AIADMK-BJP-PMK alliance in Tamil Nadu for upcoming Lok Sabha elections, Communist Party of India (Marxist) has joined hands with the DMK. "In the upcoming Parliament Elections, to defeat BJP-AIADMK-PMK alliance in Tamil Nadu, CPI-M has made an agreement with DMK. We have allied on 2 parliamentary constituencies out of 40 constituencies in Tamil Nadu and Pondicherry," CPI (M) leader K Balakrishnan told ANI. Other regional parties in Tamil Nadu, DMDK and MDMK also held respective party meetings to strategize their plans for the Lok Sabha elections.
Last Updated : Mar 7, 2019, 7:31 AM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.