తమిళనాడు పశుసంవర్ధక శాఖ మంత్రి ఉడుములై రాధాకృష్ణన్ పీఏ కర్ణన్ను నలుగురు గుర్తుతెలియని వ్యక్తులు కిడ్నాప్ చేశారు. ఉడుములై అన్సారీ రోడ్డులోని మంత్రి కార్యాలయం నుంచే బుధవారం 11.30 గంటల సమయంలో ఎత్తుకెళ్లారు. సీసీటీవీలో ఈ దృశ్యాలు రికార్డయ్యాయి.
దాదాపు 3 గంటల తర్వాత.. అపహరించిన చోటు నుంచి 10 కి.మీ. దూరంలో కర్ణన్ను విడిచిపెట్టి కిడ్నాపర్లు పరారయ్యారు. ఆ వ్యక్తిని ఎందుకు తీసుకెళ్లారో ఇంకా తెలియలేదు.
సీసీటీవీ ఫుటేజీ ఆధారంగా నిందితుల కోసం ప్రత్యేక బృందాలతో గాలిస్తున్నారు పోలీసులు.