ETV Bharat / bharat

చంద్రయాన్​-2 ప్రయోగం విజయవంతం...

author img

By

Published : Jul 22, 2019, 2:08 PM IST

Updated : Jul 22, 2019, 3:28 PM IST

భారత అంతరిక్ష చరిత్రలో అద్భుత ఘట్టం

15:25 July 22

మోదీ హర్షం

  • Special moments that will be etched in the annals of our glorious history!

    The launch of #Chandrayaan2 illustrates the prowess of our scientists and the determination of 130 crore Indians to scale new frontiers of science.

    Every Indian is immensely proud today! pic.twitter.com/v1ETFneij0

    — Narendra Modi (@narendramodi) July 22, 2019 " class="align-text-top noRightClick twitterSection" data=" ">

చంద్రయాన్​-2 ప్రయోగం విజయవంతంపై ప్రధాని నరేంద్రమోదీ హర్షం వ్యక్తంచేశారు. మన శాస్త్రవేత్తల సామర్థ్యానికి, వైజ్ఞానిక రంగంలో నూతన శిఖరాలకు చేరాలన్న 130కోట్ల మంది భారతీయుల ఆకాంక్షలకు ఈ ఘట్టం నిదర్శనమని ట్వీట్​ చేశారు. 

15:09 July 22

ఇస్రో శాస్త్రవేత్తల హర్షాతిరేకాలు

చంద్రయాన్​-2 ప్రయోగం విజయవంతంపై ఇస్రో శాస్త్రవేత్తలు హర్షాతిరేకాలు వ్యక్తం చేశారు. అంతరిక్ష చరిత్రలో భారత అద్భుత ఘట్టం ఆవిష్కృతమైంది. 

14:46 July 22

చంద్రయాన్​-2 ప్రయోగం విజయవంతం

భారత అంతరిక్ష చరిత్రలో మరో అసాధారణ ఘట్టం ఆవిష్కృతమైంది. జాబిల్లిపై పరిశోధనల కోసం చంద్రయాన్‌-2 మిషన్​ను భారత అంతరిక్ష పరిశోధనా సంస్థ-ఇస్రో విజయవంతంగా ప్రయోగించింది. 20 గంటల కౌంట్‌డౌన్‌ అనంతరం 3.8 టన్నుల బరువైన చంద్రయాన్‌-2తో జీఎస్​ఎల్​వీ మార్క్‌-3ఎం1 వాహక నౌక... మధ్యాహ్నం 2 గంటల 43 నిమిషాలకు నింగికెగిసింది. 

16 నిమిషాల 13 సెకన్ల పాటు ప్రయాణించి... భూ కక్ష్యలో చంద్రయాన్‌-2ను విడిచిపెట్టింది.

5 రోజుల తర్వాత భూనియంత్రిత కక్ష్యలోకి చంద్రయాన్‌-2 ఉపగ్రహం ప్రవేశిస్తుంది. సగటున 3 లక్షల 84 వేల కిలోమీటర్ల దూరం పయనించనున్న చంద్రయాన్‌-2 ఉపగ్రహం 48 రోజుల తర్వాత జాబిల్లిపై దిగనుంది.

చంద్రయాన్‌-2 ఉపగ్రహం బరువు 3,447 కిలోలు. దీన్ని ఆర్బిటర్‌, ల్యాండర్‌, రోవర్‌తో అనుసంధానం చేశారు. వీటిలో ఆర్బిటర్‌ చంద్రుని చుట్టు తిరుగుతూ సమాచారాన్ని సేకరిస్తుంది. ల్యాండర్‌.....చంద్రునిపై దిగుతుంది. ల్యాండర్‌లో ఉండే రోవర్‌ జాబిల్లి ఉపరితలంపై నీటి ఆనవాళ్లపై పరిశోధన చేస్తుంది.

చంద్రయాన్‌-2 ఉపగ్రహం చంద్రుని కక్ష్యకు చేరుకున్న తర్వాత ఆర్బిటర్‌ నుంచి ల్యాండర్‌ విడిపోయి చంద్రుని దక్షిణ ధ్రువం దగ్గరగా నెమ్మదిగా దిగనుంది. అందులో నుంచి అత్యంత మృదువుగా రోవర్‌ బయటకొచ్చి సెకనుకు సెంటీమీటరు వేగంతో 14 రోజుల పాటు పయనించనుంది. చంద్రుడి ఉపరితలంపై ఉన్న పదార్థాలను విశ్లేషించి ఆ సమాచారాన్ని, చిత్రాలను పంపించనుంది. చంద్రుడిపై నీరు, ఖనిజాలు, రాతి నిర్మాణాల గురించి పరిశోధనలు చేస్తుంది.

చంద్రయాన్‌-2 ప్రాజెక్టులో  పూర్తి స్వదేశీ పరిజ్ఞానం ఉపయోగించారు. ఇందులో ల్యాండర్‌కు విక్రమ్‌, రోవర్‌కు ప్రజ్ఞాన్‌గా నామకరణం చేశారు. చంద్రయాన్‌-2 ఉపగ్రహ తయారీకి 603 కోట్లు ఖర్చు చేశారు. అలాగే జీఎస్‌ఎల్‌వీ-మార్క్‌ఎం1 వాహకనౌక రూపకల్పనకు 375కోట్లు వ్యయం చేశారు.

నెల్లూరు జిల్లా శ్రీహరికోటలోని  సతీశ్‌ ధావన్‌  స్పేస్‌ సెంటర్‌-షార్‌లో రెండో ప్రయోగ వేదిక నుంచి GSLV  మార్క్‌-3ఎం1 వాహక నౌకను ప్రయోగించారు. ఈ ప్రయోగాన్ని ఈ నెల 15వ తేదీ వేకువజామున చేపట్టాల్సి ఉండగా ప్రయోగానికి 56 నిమిషాల ముందు క్రయోజెనిక్‌ ట్యాంకర్‌లో సాంకేతిక లోపాన్ని గుర్తించి వాయిదా వేశారు. ఆ లోపాన్ని సరిచేసిన శాస్త్రవేత్తలు ఇవాళ చంద్రయాన్‌-2ను ప్రయోగించారు.
 

14:38 July 22

చంద్రయాన్​-2ను ప్రయోగించిన ఇస్రో

చంద్రయాన్​-2 ప్రయోగం ప్రారంభమయింది. జీఎస్​ఎల్​వీ మార్క్​-3ఎం1 వాహననౌక ఉపగ్రహాన్ని మోసుకెళ్తోంది. 16 నిమిషాల 13 సెకన్ల తర్వాత నిర్ణీత కక్ష్యలోకి ప్రవేశిస్తుంది. కక్ష్యలోకి ప్రవేశించిన అనంతరం. వాహననౌక నుంచి విడిపోనుంది చంద్రయాన్​-2.  

14:31 July 22

మిషన్​ డైరెక్టర్​ తుది అనుమతి

చంద్రయాన్​-2 ప్రయోగానికి మిషన్​ డైరెక్టర్​ తుది అనుమతి ఇచ్చారు. కచ్చితంగా.. మధ్యాహ్నం 2 గంటల 43 నిమిషాలకు జీఎస్​ఎల్​వీ మార్క్​-3ఎం1 వాహననౌక చంద్రయాన్​-2 ఉపగ్రహాన్ని మోసుకెళ్లనుంది. 

14:25 July 22

ఆ పదిహేను నిమిషాలు అత్యంత కీలకం

తొలుత జులై 15న ప్రారంభించాలన్న చంద్రయాన్​-2 ప్రయోగం సాంకేతిక కారణాలతో నిలిచిపోయింది. చంద్రయాన్​-2ను నింగిలోకి పంపేందుకు కేవలం ఒక నిమిషం అందుబాటులోనే లాంచ్​ విండో ఉంది. అయినా.. ప్రయోగం విజయవంతం చేస్తామని ధీమాగా ఉంది భారత అంతరిక్ష పరిశోధన సంస్థ(ఇస్రో).  

చంద్రయాన్‌-1 ప్రయోగం ద్వారా చంద్రునిపై నీటి జాడ, వాతావరణ పరిస్థితులు, జాబిల్లి పుట్టుకపై పరిశోధనలు చేయవచ్చు. 

14:08 July 22

చంద్రయాన్​-2 ప్రత్యేకం

చంద్రయాన్​-2 ప్రాజెక్టును భారత అంతరిక్ష పరిశోధన సంస్థ(ఇస్రో) పూర్తి స్వదేశీ పరిజ్ఞానంతో రూపొందించింది. ఈ ప్రయోగం విజయవంతమైతే జాబిల్లి దక్షిణ ధ్రువంపైకి రోవర్​ను దింపిన తొలి దేశంగా అవతరిస్తుంది భారత్​. అంతేకాకుండా.. ఈ చంద్రయాన్​-2లో ల్యాండర్​, రోవర్​.. చంద్రుడి ఉపరితలంపై సున్నితంగా దిగుతాయి. తద్వారా.. ఇలా ప్రయోగం నిర్వహించిన దేశంగా అమెరికా, రష్యా, చైనా సరసన నిలుస్తుంది. 

13:59 July 22

చంద్రయాన్​-2 ప్రయోగం విజయవంతం...

భారత్​ అత్యంత ప్రతిష్ఠాత్మకంగా చేపడుతున్న చంద్రయాన్​-2 ప్రయోగానికి రంగం సిద్ధమైంది. శ్రీహరికోటలోని అంతరిక్ష ప్రయోగ కేంద్రం-షార్​ నుంచి మరికాసేపట్లో ప్రారంభం కానుంది. ఈ రోజు మధ్యాహ్నం 2 గంటల 43 నిముషాలకు చంద్రయాన్​-2 ఉపగ్రహాన్ని జీఎస్​ఎల్​వీ మార్క్​-3 ఎం-1 రాకెట్​ అంతరిక్షంలోకి మోసుకెళ్లనుంది. చంద్రుడిపై విస్తృత పరిశోధనలు చేపట్టి.. అక్కడ నీరు, ఇతర రసాయనాలను గుర్తించే దిశగా చంద్రయాన్​-2 ప్రయోగం జరుగుతోంది.

15:25 July 22

మోదీ హర్షం

  • Special moments that will be etched in the annals of our glorious history!

    The launch of #Chandrayaan2 illustrates the prowess of our scientists and the determination of 130 crore Indians to scale new frontiers of science.

    Every Indian is immensely proud today! pic.twitter.com/v1ETFneij0

    — Narendra Modi (@narendramodi) July 22, 2019 " class="align-text-top noRightClick twitterSection" data=" ">

చంద్రయాన్​-2 ప్రయోగం విజయవంతంపై ప్రధాని నరేంద్రమోదీ హర్షం వ్యక్తంచేశారు. మన శాస్త్రవేత్తల సామర్థ్యానికి, వైజ్ఞానిక రంగంలో నూతన శిఖరాలకు చేరాలన్న 130కోట్ల మంది భారతీయుల ఆకాంక్షలకు ఈ ఘట్టం నిదర్శనమని ట్వీట్​ చేశారు. 

15:09 July 22

ఇస్రో శాస్త్రవేత్తల హర్షాతిరేకాలు

చంద్రయాన్​-2 ప్రయోగం విజయవంతంపై ఇస్రో శాస్త్రవేత్తలు హర్షాతిరేకాలు వ్యక్తం చేశారు. అంతరిక్ష చరిత్రలో భారత అద్భుత ఘట్టం ఆవిష్కృతమైంది. 

14:46 July 22

చంద్రయాన్​-2 ప్రయోగం విజయవంతం

భారత అంతరిక్ష చరిత్రలో మరో అసాధారణ ఘట్టం ఆవిష్కృతమైంది. జాబిల్లిపై పరిశోధనల కోసం చంద్రయాన్‌-2 మిషన్​ను భారత అంతరిక్ష పరిశోధనా సంస్థ-ఇస్రో విజయవంతంగా ప్రయోగించింది. 20 గంటల కౌంట్‌డౌన్‌ అనంతరం 3.8 టన్నుల బరువైన చంద్రయాన్‌-2తో జీఎస్​ఎల్​వీ మార్క్‌-3ఎం1 వాహక నౌక... మధ్యాహ్నం 2 గంటల 43 నిమిషాలకు నింగికెగిసింది. 

16 నిమిషాల 13 సెకన్ల పాటు ప్రయాణించి... భూ కక్ష్యలో చంద్రయాన్‌-2ను విడిచిపెట్టింది.

5 రోజుల తర్వాత భూనియంత్రిత కక్ష్యలోకి చంద్రయాన్‌-2 ఉపగ్రహం ప్రవేశిస్తుంది. సగటున 3 లక్షల 84 వేల కిలోమీటర్ల దూరం పయనించనున్న చంద్రయాన్‌-2 ఉపగ్రహం 48 రోజుల తర్వాత జాబిల్లిపై దిగనుంది.

చంద్రయాన్‌-2 ఉపగ్రహం బరువు 3,447 కిలోలు. దీన్ని ఆర్బిటర్‌, ల్యాండర్‌, రోవర్‌తో అనుసంధానం చేశారు. వీటిలో ఆర్బిటర్‌ చంద్రుని చుట్టు తిరుగుతూ సమాచారాన్ని సేకరిస్తుంది. ల్యాండర్‌.....చంద్రునిపై దిగుతుంది. ల్యాండర్‌లో ఉండే రోవర్‌ జాబిల్లి ఉపరితలంపై నీటి ఆనవాళ్లపై పరిశోధన చేస్తుంది.

చంద్రయాన్‌-2 ఉపగ్రహం చంద్రుని కక్ష్యకు చేరుకున్న తర్వాత ఆర్బిటర్‌ నుంచి ల్యాండర్‌ విడిపోయి చంద్రుని దక్షిణ ధ్రువం దగ్గరగా నెమ్మదిగా దిగనుంది. అందులో నుంచి అత్యంత మృదువుగా రోవర్‌ బయటకొచ్చి సెకనుకు సెంటీమీటరు వేగంతో 14 రోజుల పాటు పయనించనుంది. చంద్రుడి ఉపరితలంపై ఉన్న పదార్థాలను విశ్లేషించి ఆ సమాచారాన్ని, చిత్రాలను పంపించనుంది. చంద్రుడిపై నీరు, ఖనిజాలు, రాతి నిర్మాణాల గురించి పరిశోధనలు చేస్తుంది.

చంద్రయాన్‌-2 ప్రాజెక్టులో  పూర్తి స్వదేశీ పరిజ్ఞానం ఉపయోగించారు. ఇందులో ల్యాండర్‌కు విక్రమ్‌, రోవర్‌కు ప్రజ్ఞాన్‌గా నామకరణం చేశారు. చంద్రయాన్‌-2 ఉపగ్రహ తయారీకి 603 కోట్లు ఖర్చు చేశారు. అలాగే జీఎస్‌ఎల్‌వీ-మార్క్‌ఎం1 వాహకనౌక రూపకల్పనకు 375కోట్లు వ్యయం చేశారు.

నెల్లూరు జిల్లా శ్రీహరికోటలోని  సతీశ్‌ ధావన్‌  స్పేస్‌ సెంటర్‌-షార్‌లో రెండో ప్రయోగ వేదిక నుంచి GSLV  మార్క్‌-3ఎం1 వాహక నౌకను ప్రయోగించారు. ఈ ప్రయోగాన్ని ఈ నెల 15వ తేదీ వేకువజామున చేపట్టాల్సి ఉండగా ప్రయోగానికి 56 నిమిషాల ముందు క్రయోజెనిక్‌ ట్యాంకర్‌లో సాంకేతిక లోపాన్ని గుర్తించి వాయిదా వేశారు. ఆ లోపాన్ని సరిచేసిన శాస్త్రవేత్తలు ఇవాళ చంద్రయాన్‌-2ను ప్రయోగించారు.
 

14:38 July 22

చంద్రయాన్​-2ను ప్రయోగించిన ఇస్రో

చంద్రయాన్​-2 ప్రయోగం ప్రారంభమయింది. జీఎస్​ఎల్​వీ మార్క్​-3ఎం1 వాహననౌక ఉపగ్రహాన్ని మోసుకెళ్తోంది. 16 నిమిషాల 13 సెకన్ల తర్వాత నిర్ణీత కక్ష్యలోకి ప్రవేశిస్తుంది. కక్ష్యలోకి ప్రవేశించిన అనంతరం. వాహననౌక నుంచి విడిపోనుంది చంద్రయాన్​-2.  

14:31 July 22

మిషన్​ డైరెక్టర్​ తుది అనుమతి

చంద్రయాన్​-2 ప్రయోగానికి మిషన్​ డైరెక్టర్​ తుది అనుమతి ఇచ్చారు. కచ్చితంగా.. మధ్యాహ్నం 2 గంటల 43 నిమిషాలకు జీఎస్​ఎల్​వీ మార్క్​-3ఎం1 వాహననౌక చంద్రయాన్​-2 ఉపగ్రహాన్ని మోసుకెళ్లనుంది. 

14:25 July 22

ఆ పదిహేను నిమిషాలు అత్యంత కీలకం

తొలుత జులై 15న ప్రారంభించాలన్న చంద్రయాన్​-2 ప్రయోగం సాంకేతిక కారణాలతో నిలిచిపోయింది. చంద్రయాన్​-2ను నింగిలోకి పంపేందుకు కేవలం ఒక నిమిషం అందుబాటులోనే లాంచ్​ విండో ఉంది. అయినా.. ప్రయోగం విజయవంతం చేస్తామని ధీమాగా ఉంది భారత అంతరిక్ష పరిశోధన సంస్థ(ఇస్రో).  

చంద్రయాన్‌-1 ప్రయోగం ద్వారా చంద్రునిపై నీటి జాడ, వాతావరణ పరిస్థితులు, జాబిల్లి పుట్టుకపై పరిశోధనలు చేయవచ్చు. 

14:08 July 22

చంద్రయాన్​-2 ప్రత్యేకం

చంద్రయాన్​-2 ప్రాజెక్టును భారత అంతరిక్ష పరిశోధన సంస్థ(ఇస్రో) పూర్తి స్వదేశీ పరిజ్ఞానంతో రూపొందించింది. ఈ ప్రయోగం విజయవంతమైతే జాబిల్లి దక్షిణ ధ్రువంపైకి రోవర్​ను దింపిన తొలి దేశంగా అవతరిస్తుంది భారత్​. అంతేకాకుండా.. ఈ చంద్రయాన్​-2లో ల్యాండర్​, రోవర్​.. చంద్రుడి ఉపరితలంపై సున్నితంగా దిగుతాయి. తద్వారా.. ఇలా ప్రయోగం నిర్వహించిన దేశంగా అమెరికా, రష్యా, చైనా సరసన నిలుస్తుంది. 

13:59 July 22

చంద్రయాన్​-2 ప్రయోగం విజయవంతం...

భారత్​ అత్యంత ప్రతిష్ఠాత్మకంగా చేపడుతున్న చంద్రయాన్​-2 ప్రయోగానికి రంగం సిద్ధమైంది. శ్రీహరికోటలోని అంతరిక్ష ప్రయోగ కేంద్రం-షార్​ నుంచి మరికాసేపట్లో ప్రారంభం కానుంది. ఈ రోజు మధ్యాహ్నం 2 గంటల 43 నిముషాలకు చంద్రయాన్​-2 ఉపగ్రహాన్ని జీఎస్​ఎల్​వీ మార్క్​-3 ఎం-1 రాకెట్​ అంతరిక్షంలోకి మోసుకెళ్లనుంది. చంద్రుడిపై విస్తృత పరిశోధనలు చేపట్టి.. అక్కడ నీరు, ఇతర రసాయనాలను గుర్తించే దిశగా చంద్రయాన్​-2 ప్రయోగం జరుగుతోంది.

RESTRICTION SUMMARY: AP CLIENTS ONLY
SHOTLIST:
ASSOCIATED PRESS - AP CLIENTS ONLY
Hong Kong - 22 July 2019
1. Hong Kong's leader Carrie Lam entering news conference
2. SOUNDBITE (English) Carrie Lam, Hong Kong leader:
"We were monitoring the whole situation throughout Hong Kong last night. At the time when we issue that statement about the Yuen Long violent acts, we were not in possession of all the facts. As the (Police)Commissioner (Stephen Lo) on may also share with you, actually these violent attackers came back twice to attack the people. So at that time when we issue that press statement to condemn those violent acts we were not in possession of all of the active situation on the ground. But what I have said just now in my brief introductory remarks, that we absolutely do not condone that sort of violent acts. And let me make this clear again: violence is not a solution to any problem. Violence will only bring more violence. And at the end of the day, the whole of Hong Kong and the people will suffer as a result of the loss of law and order in Hong Kong."
3. Media
STORYLINE:
Hong Kong leader Carrie Lam has condemned the recent outburst of violence during weekend protests, saying it is "not the solution."
Clashes involving Hong Kong's protest movement escalated violently late Sunday as police launched tear gas at protesters who didn't disband after a massive march.
Subway riders were attacked by masked assailants who appeared to target the pro-democracy demonstrators.
"We absolutely do not condone that sort of violent acts," Lam told a news conference.
The leader added that violence would only bring more violence and that it would be the people of Hong Kong who would suffer as a result of the "loss of law and order."
The firing of tear gas was the latest confrontation between police and protesters who have taken to the streets for almost two months to fight a proposed extradition bill and call for electoral reforms in the Chinese territory.
===========================================================
Clients are reminded:
(i) to check the terms of their licence agreements for use of content outside news programming and that further advice and assistance can be obtained from the AP Archive on: Tel +44 (0) 20 7482 7482 Email: info@aparchive.com
(ii) they should check with the applicable collecting society in their Territory regarding the clearance of any sound recording or performance included within the AP Television News service
(iii) they have editorial responsibility for the use of all and any content included within the AP Television News service and for libel, privacy, compliance and third party rights applicable to their Territory.
Last Updated : Jul 22, 2019, 3:28 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.