ETV Bharat / bharat

రాజ్యసభ ఎన్నికల్లో కమలానికి 8..  హస్తానికి 4 - Rajya Sabha polls results news

రాజ్యసభ ఎన్నికల్లో భాజపా అత్యధికంగా 8 సీట్లను కైవసం చేసుకుని అగ్రస్థానంలో నిలిచింది. కాంగ్రెస్​ 4 స్థానాల్లో విజయం సాధించింది. కరోనా నేపథ్యంలో ప్రత్యేక ఏర్పాట్లు చేసింది ఎన్నికల సంఘం. క్వారంటైన్​లో ఉన్న కొందరు శాసనసభ్యులు పీపీఈ కిట్లు ధరించి ఓటింగ్​లో పాల్గొన్నారు.

Rajya Sabha polls
రాజ్యసభ ఎన్నికలు 2020
author img

By

Published : Jun 20, 2020, 5:13 AM IST

కరోనా వైరస్​ నేపథ్యంలో పకడ్బంధీ ఏర్పాట్ల మధ్య రాజ్యసభ ద్వైవార్షిక ఎన్నికలు ముగిశాయి. ఓటర్లయిన శాసనసభ్యులు భౌతిక దూరం పాటించటం, థర్మల్​ స్క్రీనింగ్​, మాస్కులు ధరించటం వంటి జాగ్రత్తలను పాటించేలా ఎన్నికల సంఘం చర్యలు తీసుకుంది. 8 రాష్ట్రాల పరిధిలో 19 స్థానాలకు శుక్రవారం ఓటింగ్​ జరిగింది. వీటిలో భారతీయ జనతా పార్టీ 8 స్థానాల్లో విజయం సాధించి అగ్రస్థానంలో నిలిచింది. కాంగ్రెస్​ పార్టీ నాలుగు స్థానాల్లో గెలుపొందింది. ఆంధ్రప్రదేశ్​లోని నాలుగు సీట్లనూ అధికార వైకాపా కైవసం చేసుకుంది. ఝార్ఖండ్​, మేఘాలయ, మిజోరంలలోని ఒక్కో సీటును అక్కడి పాలకపక్షాలు సొంతం చేసుకున్నాయి.

గుజరాత్​ ఓట్ల లెక్కింపుపై వివాదం నెలకొనటం వల్ల ఫలితాల వెల్లడిలో జాప్యం జరిగింది. రెండు భాజపా ఓట్లపై కాంగ్రెస్​ అభ్యంతరం తెలపటం వల్ల కౌంటింగ్​ నిలిచిపోయింది. ఇక్కడ నాలుగు స్థానాలకుగాను భాజపా ముగ్గురు అభ్యర్థులను, కాంగ్రెస్​ ఇద్దరు అభ్యర్థులను రంగంలోకి దించాయి. భాజపా ఎమ్మెల్యే కేసరీసింహ్​ సోలంకీ, మంత్రి భూపేంద్రసింహ్​ ఓట్లను పరిగణనలోకి తీసుకోరాదంటూ విపక్ష కాంగ్రెస్​ డిమాండ్​ చేసింది. అధికారులు కేంద్ర ఎన్నికల సంఘం అనుమతి తీసుకొని ఆలస్యంగా ఓట్ల లెక్కింపును చేపట్టారు. భాజపా మూడు స్థానాల్లో, కాంగ్రెస్​ ఒకస్థానంలో విజయం సాధించాయి.

మధ్యప్రదేశ్​లో కాంగ్రెస్​ నేత దిగ్విజయ్​ సింగ్​, ఇటీవలే కాంగ్రెస్​ నుంచి భాజపాలోకి చేరిన జోతిరాదిత్య సింధియా పెద్దల సభకు ఎన్నికయ్యారు. కరోనా వల్ల క్వారంటైన్​లో ఉండటంతో మధ్యప్రదేశ్​, రాజస్థాన్​లలో నలుగురు ఎమ్మెల్యేలు పీపీఈ దుస్తుల్లో వచ్చి ఓటింగ్​లో పాల్గొన్నారు.

రాష్ట్రంపార్టీ గెలిచిన స్థానాలు
ఆంధ్రప్రదేశ్​వైకాపా 4
గుజరాత్​

భాజపా

కాంగ్రెస్​

3

1

మధ్యప్రదేశ్​

భాజపా

కాంగ్రెస్​

2

1

రాజస్థాన్​

భాజపా

కాంగ్రెస్​

1

2

ఝార్ఖండ్

జేఎంఎం

భాజపా

1

1

మేఘాలయ ఎండీఏ 1
మణిపుర్​ భాజపా1
మిజోరంఎంఎన్​ఎఫ్​1

కరోనా వైరస్​ నేపథ్యంలో పకడ్బంధీ ఏర్పాట్ల మధ్య రాజ్యసభ ద్వైవార్షిక ఎన్నికలు ముగిశాయి. ఓటర్లయిన శాసనసభ్యులు భౌతిక దూరం పాటించటం, థర్మల్​ స్క్రీనింగ్​, మాస్కులు ధరించటం వంటి జాగ్రత్తలను పాటించేలా ఎన్నికల సంఘం చర్యలు తీసుకుంది. 8 రాష్ట్రాల పరిధిలో 19 స్థానాలకు శుక్రవారం ఓటింగ్​ జరిగింది. వీటిలో భారతీయ జనతా పార్టీ 8 స్థానాల్లో విజయం సాధించి అగ్రస్థానంలో నిలిచింది. కాంగ్రెస్​ పార్టీ నాలుగు స్థానాల్లో గెలుపొందింది. ఆంధ్రప్రదేశ్​లోని నాలుగు సీట్లనూ అధికార వైకాపా కైవసం చేసుకుంది. ఝార్ఖండ్​, మేఘాలయ, మిజోరంలలోని ఒక్కో సీటును అక్కడి పాలకపక్షాలు సొంతం చేసుకున్నాయి.

గుజరాత్​ ఓట్ల లెక్కింపుపై వివాదం నెలకొనటం వల్ల ఫలితాల వెల్లడిలో జాప్యం జరిగింది. రెండు భాజపా ఓట్లపై కాంగ్రెస్​ అభ్యంతరం తెలపటం వల్ల కౌంటింగ్​ నిలిచిపోయింది. ఇక్కడ నాలుగు స్థానాలకుగాను భాజపా ముగ్గురు అభ్యర్థులను, కాంగ్రెస్​ ఇద్దరు అభ్యర్థులను రంగంలోకి దించాయి. భాజపా ఎమ్మెల్యే కేసరీసింహ్​ సోలంకీ, మంత్రి భూపేంద్రసింహ్​ ఓట్లను పరిగణనలోకి తీసుకోరాదంటూ విపక్ష కాంగ్రెస్​ డిమాండ్​ చేసింది. అధికారులు కేంద్ర ఎన్నికల సంఘం అనుమతి తీసుకొని ఆలస్యంగా ఓట్ల లెక్కింపును చేపట్టారు. భాజపా మూడు స్థానాల్లో, కాంగ్రెస్​ ఒకస్థానంలో విజయం సాధించాయి.

మధ్యప్రదేశ్​లో కాంగ్రెస్​ నేత దిగ్విజయ్​ సింగ్​, ఇటీవలే కాంగ్రెస్​ నుంచి భాజపాలోకి చేరిన జోతిరాదిత్య సింధియా పెద్దల సభకు ఎన్నికయ్యారు. కరోనా వల్ల క్వారంటైన్​లో ఉండటంతో మధ్యప్రదేశ్​, రాజస్థాన్​లలో నలుగురు ఎమ్మెల్యేలు పీపీఈ దుస్తుల్లో వచ్చి ఓటింగ్​లో పాల్గొన్నారు.

రాష్ట్రంపార్టీ గెలిచిన స్థానాలు
ఆంధ్రప్రదేశ్​వైకాపా 4
గుజరాత్​

భాజపా

కాంగ్రెస్​

3

1

మధ్యప్రదేశ్​

భాజపా

కాంగ్రెస్​

2

1

రాజస్థాన్​

భాజపా

కాంగ్రెస్​

1

2

ఝార్ఖండ్

జేఎంఎం

భాజపా

1

1

మేఘాలయ ఎండీఏ 1
మణిపుర్​ భాజపా1
మిజోరంఎంఎన్​ఎఫ్​1
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.