ETV Bharat / bharat

నిర్భయ కేసు: తిహార్ అధికారులకు దిల్లీ కోర్టు నోటీసులు

author img

By

Published : Jan 30, 2020, 12:09 PM IST

Updated : Feb 28, 2020, 12:28 PM IST

Maidaan is a sports-drama dedicated to the golden years of Indian football. Ajay will be seen essaying the role of the legendary coach Syed Abdul Rahim, who is widely known as the founding father of Indian football.

నిర్భయ దోషుల పిటిషన్​
నిర్భయ దోషుల పిటిషన్​

14:47 January 30

తిహార్ జైలు అధికారులకు నోటీసులు

మరణ శిక్ష అమలుపై స్టే విధించాలన్న నలుగురు దోషుల అభ్యర్థనపై అభిప్రాయం చెప్పాలని తిహార్ జైలు అధికారులకు నోటీసులు జారీచేసింది దిల్లీ కోర్టు. శుక్రవారం ఉదయం 10 గంటలలోపు నివేదిక సమర్పించాలని ఆదేశించింది. 

మరణ శిక్ష తప్పించుకునేందుకు న్యాయపరమైన అవకాశాలు ఇంకా మిగిలే ఉన్నాయని, వాటిపై స్పష్టత వచ్చేవరకు ఉరిని నిరవధికంగా వాయిదా వేయాలని దోషుల తరఫు న్యాయవాది కోర్టును కోరారు. దీనిపై ప్రాసిక్యూషన్​ తరఫున న్యాయవాది అభ్యంతరం తెలిపారు. ఈ వ్యాజ్యం... న్యాయ వ్యవస్థను అపహాస్యం చేసేలా, శిక్షను ఆలస్యం చేసే ఎత్తుగడలా ఉందని వాదించారు. 

వాదనలు ఆలకించిన జడ్జి... తిహార్ జైలు అధికారులకు నోటీసులు జారీచేశారు. విచారణ శుక్రవారం కొనసాగుతుందని స్పష్టంచేశారు. 

12:05 January 30

ఉరి వాయిదా వేయాలని నిర్భయ దోషుల పిటిషన్​

ఫిబ్రవరి 1న అమలు కావాల్సిన ఉరిశిక్షను తప్పించుకునేందుకు నిర్భయ దోషుల ప్రయత్నాలు కొనసాగుతూనే ఉన్నాయి. తాజాగా ఉరి శిక్షపై స్టే విధించాలని నలుగురు దోషులు దిల్లీ న్యాయస్థానంలో పిటిషన్​ దాఖలు చేశారు.

శిక్షను తగ్గించుకునేందుకు న్యాయపరంగా ఇంకా కొన్ని అవకాశాలు ఉన్నందున తీర్పు అమలుపై స్టే విధించాలని అభ్యర్థించారు దోషుల తరఫున న్యాయవాది ఏపీ సింగ్​. ఈ పిటిషన్​పై ఈరోజే దిల్లీ కోర్టు విచారణ జరపనుంది. 

ఉరి శిక్షను తప్పించుకనేందుకు దోషుల్లో ఒకడైన వినయ్​ కుమార్​ శర్మ క్షమాభిక్ష కోసం ఇప్పటికే రాష్ట్రపతిని ఆశ్రయించగా.. మరో దోషి అక్షయ్​ కుమార్​ సుప్రీం కోర్టులో క్యురేటివ్​ పిటిషన్​ దాఖలు చేశాడు. ఈ పిటిషన్​పై నేడు విచారించనుంది సర్వోన్నత న్యాయస్థానం.

14:47 January 30

తిహార్ జైలు అధికారులకు నోటీసులు

మరణ శిక్ష అమలుపై స్టే విధించాలన్న నలుగురు దోషుల అభ్యర్థనపై అభిప్రాయం చెప్పాలని తిహార్ జైలు అధికారులకు నోటీసులు జారీచేసింది దిల్లీ కోర్టు. శుక్రవారం ఉదయం 10 గంటలలోపు నివేదిక సమర్పించాలని ఆదేశించింది. 

మరణ శిక్ష తప్పించుకునేందుకు న్యాయపరమైన అవకాశాలు ఇంకా మిగిలే ఉన్నాయని, వాటిపై స్పష్టత వచ్చేవరకు ఉరిని నిరవధికంగా వాయిదా వేయాలని దోషుల తరఫు న్యాయవాది కోర్టును కోరారు. దీనిపై ప్రాసిక్యూషన్​ తరఫున న్యాయవాది అభ్యంతరం తెలిపారు. ఈ వ్యాజ్యం... న్యాయ వ్యవస్థను అపహాస్యం చేసేలా, శిక్షను ఆలస్యం చేసే ఎత్తుగడలా ఉందని వాదించారు. 

వాదనలు ఆలకించిన జడ్జి... తిహార్ జైలు అధికారులకు నోటీసులు జారీచేశారు. విచారణ శుక్రవారం కొనసాగుతుందని స్పష్టంచేశారు. 

12:05 January 30

ఉరి వాయిదా వేయాలని నిర్భయ దోషుల పిటిషన్​

ఫిబ్రవరి 1న అమలు కావాల్సిన ఉరిశిక్షను తప్పించుకునేందుకు నిర్భయ దోషుల ప్రయత్నాలు కొనసాగుతూనే ఉన్నాయి. తాజాగా ఉరి శిక్షపై స్టే విధించాలని నలుగురు దోషులు దిల్లీ న్యాయస్థానంలో పిటిషన్​ దాఖలు చేశారు.

శిక్షను తగ్గించుకునేందుకు న్యాయపరంగా ఇంకా కొన్ని అవకాశాలు ఉన్నందున తీర్పు అమలుపై స్టే విధించాలని అభ్యర్థించారు దోషుల తరఫున న్యాయవాది ఏపీ సింగ్​. ఈ పిటిషన్​పై ఈరోజే దిల్లీ కోర్టు విచారణ జరపనుంది. 

ఉరి శిక్షను తప్పించుకనేందుకు దోషుల్లో ఒకడైన వినయ్​ కుమార్​ శర్మ క్షమాభిక్ష కోసం ఇప్పటికే రాష్ట్రపతిని ఆశ్రయించగా.. మరో దోషి అక్షయ్​ కుమార్​ సుప్రీం కోర్టులో క్యురేటివ్​ పిటిషన్​ దాఖలు చేశాడు. ఈ పిటిషన్​పై నేడు విచారించనుంది సర్వోన్నత న్యాయస్థానం.

Intro:Body:Conclusion:
Last Updated : Feb 28, 2020, 12:28 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.