ETV Bharat / bharat

'ఆంక్షలతో ఇబ్బందులున్నా ప్రాణనష్టం తప్పింది'

జమ్ముకశ్మీర్​లో 370 అధికరణ రద్దు అనంతరం ఆంక్షలు విధించడాన్ని కేంద్రం సమర్థించుకుంది. ప్రజలు ఇబ్బందులు పడినా... ఎలాంటి ప్రాణనష్టం జరగకుండా నివారించగలిగామని కేంద్ర ప్రభుత్వ ముఖ్య అధికారి ఒకరు వివరించారు. ఇదే విషయంపై స్పందించిన కశ్మీర్ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి... అతి త్వరలోనే ఆంక్షలు ఎత్తివేస్తామని చెప్పారు.

author img

By

Published : Aug 13, 2019, 6:39 PM IST

Updated : Sep 26, 2019, 9:42 PM IST

'ఆంక్షలతో ఇబ్బందులన్నా ప్రాణనష్టం తప్పింది'

కశ్మీర్​లో ఆంక్షలు విధించడం వల్లే ఎక్కడా హింసాత్మక ఘటనలు చెలరేగలేదని కేంద్ర ప్రభుత్వ ముఖ్య అధికారి ఒకరు తెలిపారు. జమ్ముకశ్మీర్​లో రవాణా, సమాచార వ్యవస్థపై విధించిన ఆంక్షల ఎత్తివేత స్థానిక యంత్రాంగం నిర్ణయంపైనే ఆధారపడి ఉందన్నారు.

జమ్ముకశ్మీర్​లో క్షేత్ర స్థాయి పరిస్థితులను క్షణ్నంగా పరిశీలించిన తర్వాతే మాజీ ముఖ్యమంత్రులు ఒమర్​ అబ్దుల్లా, మెహబూబా ముఫ్తీని విడుదల చేసే అవకాశం ఉందని వెల్లడించారు ఆ అధికారి. కశ్మీర్​లో ప్రజల ఇబ్బందులు, అసౌకర్యాలను ప్రభుత్వం గమనిస్తూనే ఉందని తెలిపారు. కొద్ది రోజుల్లోనే వారి ఇక్కట్లు తొలగిపోతాయని ధీమా వ్యక్తంచేశారు.

జమ్ముకశ్మీర్​, లద్దాఖ్​ రెండూ అక్టోబర్​ 31న కేంద్రపాలిత ప్రాంతాలుగా మారే అవకాశం ఉందన్నారు. ఆస్తుల పంపిణీ, అధికారుల విభజన తదితర అంశాలకు ఈ సమయం పడుతుందని పేర్కొన్నారు కేంద్ర ప్రభుత్వ అధికారి.

త్వరలోనే...

స్వతంత్ర దినోత్సవ కసరత్తులు పూర్తైన తర్వాత కశ్మీర్‌లో ఆంక్షలను సడలిస్తామని జమ్ముకశ్మీర్‌ ప్రభుత్వ ముఖ్యకార్యదర్శి రోహిత్ కన్సాల్ స్పష్టంచేశారు. ఇప్పటికే చాలా ప్రాంతాల్లో ఆంక్షలను సడలించినట్లు ఆయన చెప్పారు. జమ్ము ప్రాంతంలో ఇప్పుడు ఎలాంటి ఆంక్షలు లేవని పేర్కొన్నారు.

కశ్మీర్​లో ఆంక్షలు విధించడం వల్లే ఎక్కడా హింసాత్మక ఘటనలు చెలరేగలేదని కేంద్ర ప్రభుత్వ ముఖ్య అధికారి ఒకరు తెలిపారు. జమ్ముకశ్మీర్​లో రవాణా, సమాచార వ్యవస్థపై విధించిన ఆంక్షల ఎత్తివేత స్థానిక యంత్రాంగం నిర్ణయంపైనే ఆధారపడి ఉందన్నారు.

జమ్ముకశ్మీర్​లో క్షేత్ర స్థాయి పరిస్థితులను క్షణ్నంగా పరిశీలించిన తర్వాతే మాజీ ముఖ్యమంత్రులు ఒమర్​ అబ్దుల్లా, మెహబూబా ముఫ్తీని విడుదల చేసే అవకాశం ఉందని వెల్లడించారు ఆ అధికారి. కశ్మీర్​లో ప్రజల ఇబ్బందులు, అసౌకర్యాలను ప్రభుత్వం గమనిస్తూనే ఉందని తెలిపారు. కొద్ది రోజుల్లోనే వారి ఇక్కట్లు తొలగిపోతాయని ధీమా వ్యక్తంచేశారు.

జమ్ముకశ్మీర్​, లద్దాఖ్​ రెండూ అక్టోబర్​ 31న కేంద్రపాలిత ప్రాంతాలుగా మారే అవకాశం ఉందన్నారు. ఆస్తుల పంపిణీ, అధికారుల విభజన తదితర అంశాలకు ఈ సమయం పడుతుందని పేర్కొన్నారు కేంద్ర ప్రభుత్వ అధికారి.

త్వరలోనే...

స్వతంత్ర దినోత్సవ కసరత్తులు పూర్తైన తర్వాత కశ్మీర్‌లో ఆంక్షలను సడలిస్తామని జమ్ముకశ్మీర్‌ ప్రభుత్వ ముఖ్యకార్యదర్శి రోహిత్ కన్సాల్ స్పష్టంచేశారు. ఇప్పటికే చాలా ప్రాంతాల్లో ఆంక్షలను సడలించినట్లు ఆయన చెప్పారు. జమ్ము ప్రాంతంలో ఇప్పుడు ఎలాంటి ఆంక్షలు లేవని పేర్కొన్నారు.

Wayanad (Kerala), Aug 13 (ANI): Kerala Chief Minister Pinarayi Vijayan held meeting with the state ministers over flood situation in Kerala's Wayanad on August 13. Principal Secretary and other district officials were also present in the meeting. The flood situation in Kerala has worsened, with lakhs of people displaced and humans and animals have died. Around, 88 people have died in 14 districts of Kerala since August 08 due to floods. At least, 40 people are also reported missing in the state.
Last Updated : Sep 26, 2019, 9:42 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.