ETV Bharat / bharat

లాక్​డౌన్​ ఎఫెక్ట్​:17రోజుల బిడ్డను తొలిసారి చూసిన తల్లి

author img

By

Published : Apr 15, 2020, 8:28 PM IST

సూరత్​లో సరోగసి ద్వారా జన్మించిన శిశువును.. బెంగళూరుకు చెందిన దంపతులు కలుసుకోవడానికి 17రోజులు పట్టింది. దేశవ్యాప్తంగా అమల్లో ఉన్న లాక్​డౌనే ఇందుకు కారణం.

New born baby arrived at Belagavi from Surat for treatment
అప్పుడే పుట్టిన బిడ్డను 17 రోజుల తర్వాత చూసిన తల్లిదండ్రులు

దేశవ్యాప్తంగా అమల్లో ఉన్న లాక్​డౌన్​తో ప్రజలు అనేక ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. వలసకూలీల నుంచి ధనికుల వరకు అందరిపైనా ఈ ప్రభావం పడింది. తాజాగా సరోగసి ద్వారా జన్మించిన తమ నవజాత శిశువును 17రోజుల తర్వాత చూడగలిగారు బెంగళూరుకు చెందిన దంపతులు. ఆ పాపను చూసిన తర్వాత వారి ఆనందానికి అవధుల్లేవు.

సూరత్​ నుంచి బెంగళూరు వరకు...

సరోగసి ద్వారా సంతానం పొందేందుకు ఏడాది క్రితం గుజరాత్​కు చెందిన సూరత్​లోని ఓ ఆసుపత్రిని సంప్రదించారు బెంగళూరుకు చెందిన ఓ జంట. ఈ నెల 29న సూరత్​లో శిశువు జన్మించింది. కానీ లాక్​డౌన్​ వల్ల తల్లిదండ్రులు వెంటనే ఆ పాపను చూడలేకపోయారు. 17రోజుల అనంతరం ఎయిర్​ అంబులెన్స్​లో ఆ ఆడ బిడ్డను.. బెంగళూరులోని దంపతుల వద్దకు చేర్చగలిగారు వైద్యులు. ఆపరేషన్​ చేసిన వైద్యురాలు పూజా నంద్​కర్ని సింగ్​.. స్వయంగా ఎయిర్​ అంబులెన్స్​లోని డాక్టర్లకు శిశువును అప్పగించారు.

New born baby arrived at Belagavi from Surat for treatment
లాక్​డౌన్​ ఎఫెక్ట్​:17రోజుల బిడ్డను తొలిసారి చూసిన ఆ క్షణాలు

శిశివు భద్రతకు తగిన ఏర్పాట్లు చేసినట్టు అహ్మదాబాద్​ విమానాశ్రయం డైరక్టర్​ అమన్​ సైనీ తెలిపారు.

"ఎయిర్​ అంబులెన్స్​ దిల్లీ నుంచి వచ్చింది. శిశువు భద్రత కోసం అన్ని ఏర్పాట్లు చేశాం. ప్యాసింజర్​ విమానాలు రద్దు అయిన నేపథ్యంలో ఇలాంటి పరిస్థితుల్లో అత్యవసర సేవలకు అనుమతి ఉంది. శిశువును బెంగళూరులోని తల్లిదండ్రుల వద్దకు సురక్షితంగా చేర్చగలిగాం."

--- అమన్​ సైనీ, అహ్మదాబాద్​ విమానాశ్రయం డైరక్టర్​.

దేశవ్యాప్తంగా అమల్లో ఉన్న లాక్​డౌన్​తో ప్రజలు అనేక ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. వలసకూలీల నుంచి ధనికుల వరకు అందరిపైనా ఈ ప్రభావం పడింది. తాజాగా సరోగసి ద్వారా జన్మించిన తమ నవజాత శిశువును 17రోజుల తర్వాత చూడగలిగారు బెంగళూరుకు చెందిన దంపతులు. ఆ పాపను చూసిన తర్వాత వారి ఆనందానికి అవధుల్లేవు.

సూరత్​ నుంచి బెంగళూరు వరకు...

సరోగసి ద్వారా సంతానం పొందేందుకు ఏడాది క్రితం గుజరాత్​కు చెందిన సూరత్​లోని ఓ ఆసుపత్రిని సంప్రదించారు బెంగళూరుకు చెందిన ఓ జంట. ఈ నెల 29న సూరత్​లో శిశువు జన్మించింది. కానీ లాక్​డౌన్​ వల్ల తల్లిదండ్రులు వెంటనే ఆ పాపను చూడలేకపోయారు. 17రోజుల అనంతరం ఎయిర్​ అంబులెన్స్​లో ఆ ఆడ బిడ్డను.. బెంగళూరులోని దంపతుల వద్దకు చేర్చగలిగారు వైద్యులు. ఆపరేషన్​ చేసిన వైద్యురాలు పూజా నంద్​కర్ని సింగ్​.. స్వయంగా ఎయిర్​ అంబులెన్స్​లోని డాక్టర్లకు శిశువును అప్పగించారు.

New born baby arrived at Belagavi from Surat for treatment
లాక్​డౌన్​ ఎఫెక్ట్​:17రోజుల బిడ్డను తొలిసారి చూసిన ఆ క్షణాలు

శిశివు భద్రతకు తగిన ఏర్పాట్లు చేసినట్టు అహ్మదాబాద్​ విమానాశ్రయం డైరక్టర్​ అమన్​ సైనీ తెలిపారు.

"ఎయిర్​ అంబులెన్స్​ దిల్లీ నుంచి వచ్చింది. శిశువు భద్రత కోసం అన్ని ఏర్పాట్లు చేశాం. ప్యాసింజర్​ విమానాలు రద్దు అయిన నేపథ్యంలో ఇలాంటి పరిస్థితుల్లో అత్యవసర సేవలకు అనుమతి ఉంది. శిశువును బెంగళూరులోని తల్లిదండ్రుల వద్దకు సురక్షితంగా చేర్చగలిగాం."

--- అమన్​ సైనీ, అహ్మదాబాద్​ విమానాశ్రయం డైరక్టర్​.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.