ETV Bharat / bharat

కేసీఆర్, జగన్​కు మాజీ సీఐసీ​ శ్రీధర్​ ప్రశ్న

author img

By

Published : Jul 26, 2019, 8:14 PM IST

సమాచార హక్కు చట్ట సవరణ బిల్లుకు మద్దతివ్వడానికి కారణాలేంటో తెలపాలని తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రులు కేసీఆర్​, జగన్​కు మాజీ ప్రధాన సమాచార కమిషనర్ శ్రీధర్​ ఆచార్యులు​ లేఖ రాశారు. వీరితో పాటు ఒడిశా సీఎం నవీన్​ పట్నాయక్​ పేరునూ లేఖలో ప్రస్తావించారు. సమాచార కమిషనర్ల స్వేచ్ఛ, స్వతంత్రతను హరించే బిల్లుకు ఎలా మద్దతు పలికారని ప్రశ్నించారు.

కేసీఆర్, జగన్​కు మాజీ సీఐసీ​ శ్రీధర్​ ప్రశ్న

సమాచార హక్కు చట్ట సవరణ బిల్లుపై పార్లమెంటులో వివాదం అంతా ఇంతా కాదు. విపక్ష పార్టీలు ముక్తకంఠంతో బిల్లును వ్యతిరేకించాయి. అయితే ప్రభుత్వానికి తగిన బలం ఉన్నందున ఎట్టకేలకు బిల్లుకు ఆమోదముద్ర లభించింది. ఈ బిల్లులో ప్రభుత్వం ప్రతిపాదించిన సవరణలు సర్వత్రా చర్చనీయాంశమయ్యాయి.

తాజాగా మాజీ ప్రధాన సమాచార కమిషనర్​ శ్రీధర్​ ఆచార్యులు ఈ బిల్లుపై ఆందోళన వ్యక్తం చేస్తూ మూడు రాష్ట్రాల సీఎంలకు బహిరంగ లేఖ రాశారు. ఆంధ్రప్రదేశ్​, తెలంగాణ, ఒడిశా ముఖ్యమంత్రులు వై.ఎస్​ జగన్​ మోహన్​ రెడ్డి, కె. చంద్రశేఖర్​ రావు, నవీన్​ పట్నాయక్​కు ఈ లేఖ పంపారు.

ముగ్గురు ముఖ్యమంత్రులు వారి రాష్ట్రాల హక్కులు, సమస్యల కోసం ఎన్నో ఏళ్ల నుంచి పోరాటం చేశారని ప్రస్తావిస్తూ కొన్ని ప్రశ్నలు సంధించారు శ్రీధర్​.

"ఈ ప్రశ్నలకు నైతికంగా, చట్టపరంగా (ఆర్టీఐ చట్టంలోని సెక్షన్​ 4(1)(సీ) ప్రకారం), రాజ్యాంగం పరంగా (సమాఖ్య సూత్రాల ప్రకారం), రాజకీయంగా (రాష్ట్ర అధికారాలను, హక్కులను కేంద్రం హరిస్తే పోరాటం చేస్తామని మీరు చెప్పారు కనుక) సమాధానం చెప్పాల్సిన అవసరం ఉంది. రాజ్యాంగ విరుద్ధంగా, అన్యాయంగా మీ అధికారాలను దిల్లీ చేతిలో పెట్టారు. రాష్ట్ర సమాచార కమిషనర్ల నియామకం, పదవీకాలం తదితర అంశాల్లో ఇక రాష్ట్రాలకు అధికారం లేదు. రాజ్యాంగేతర బిల్లుకు మద్దతు పలకడం ద్వారా మీరు ఏం సాధించారో చెప్పండి."
- లేఖ సారాంశం

ముగ్గురు ముఖ్యమంత్రులు ఈ బిల్లుకు మద్దతిచ్చిన విషయంపై సమగ్ర వివరణ ఇవ్వాలని లేఖలో ఆచార్యులు పేర్కొన్నారు.

సమాచార హక్కు చట్ట సవరణ బిల్లుపై పార్లమెంటులో వివాదం అంతా ఇంతా కాదు. విపక్ష పార్టీలు ముక్తకంఠంతో బిల్లును వ్యతిరేకించాయి. అయితే ప్రభుత్వానికి తగిన బలం ఉన్నందున ఎట్టకేలకు బిల్లుకు ఆమోదముద్ర లభించింది. ఈ బిల్లులో ప్రభుత్వం ప్రతిపాదించిన సవరణలు సర్వత్రా చర్చనీయాంశమయ్యాయి.

తాజాగా మాజీ ప్రధాన సమాచార కమిషనర్​ శ్రీధర్​ ఆచార్యులు ఈ బిల్లుపై ఆందోళన వ్యక్తం చేస్తూ మూడు రాష్ట్రాల సీఎంలకు బహిరంగ లేఖ రాశారు. ఆంధ్రప్రదేశ్​, తెలంగాణ, ఒడిశా ముఖ్యమంత్రులు వై.ఎస్​ జగన్​ మోహన్​ రెడ్డి, కె. చంద్రశేఖర్​ రావు, నవీన్​ పట్నాయక్​కు ఈ లేఖ పంపారు.

ముగ్గురు ముఖ్యమంత్రులు వారి రాష్ట్రాల హక్కులు, సమస్యల కోసం ఎన్నో ఏళ్ల నుంచి పోరాటం చేశారని ప్రస్తావిస్తూ కొన్ని ప్రశ్నలు సంధించారు శ్రీధర్​.

"ఈ ప్రశ్నలకు నైతికంగా, చట్టపరంగా (ఆర్టీఐ చట్టంలోని సెక్షన్​ 4(1)(సీ) ప్రకారం), రాజ్యాంగం పరంగా (సమాఖ్య సూత్రాల ప్రకారం), రాజకీయంగా (రాష్ట్ర అధికారాలను, హక్కులను కేంద్రం హరిస్తే పోరాటం చేస్తామని మీరు చెప్పారు కనుక) సమాధానం చెప్పాల్సిన అవసరం ఉంది. రాజ్యాంగ విరుద్ధంగా, అన్యాయంగా మీ అధికారాలను దిల్లీ చేతిలో పెట్టారు. రాష్ట్ర సమాచార కమిషనర్ల నియామకం, పదవీకాలం తదితర అంశాల్లో ఇక రాష్ట్రాలకు అధికారం లేదు. రాజ్యాంగేతర బిల్లుకు మద్దతు పలకడం ద్వారా మీరు ఏం సాధించారో చెప్పండి."
- లేఖ సారాంశం

ముగ్గురు ముఖ్యమంత్రులు ఈ బిల్లుకు మద్దతిచ్చిన విషయంపై సమగ్ర వివరణ ఇవ్వాలని లేఖలో ఆచార్యులు పేర్కొన్నారు.

AP Video Delivery Log - 1100 GMT News
Friday, 26 July, 2019
Here is a roundup of Associated Press video content which has been sent to customers in the last hour. These items are available to access now on Media Port and Video Hub. Please note, customers will receive stories only if subscribed to the relevant product.
AP-APTN-1058: China Landslide No access mainland China 4222273
24 dead, 27 missing, after landslide in China
AP-APTN-1057: EU Boris Johnson AP Clients Only 4222272
EU tells new UK PM it's not budging on withdrawal deal
AP-APTN-1047: Cambodia Journalists 2 AP Clients Only 4222269
Trial of 2 Cambodian journalists adjourned
AP-APTN-1002: China MOFA Briefing AP Clients Only 4222261
DAILY MOFA BRIEFING
AP-APTN-0924: Hong Kong Airport Protest AP Clients only 4222257
Hong Kong protesters stage demo at airport
AP-APTN-0907: Turkey Boris Village AP Clients Only 4222255
Johnson’s ‘ancestral’ Turkish village excited by premiership
AP-APTN-0900: New Zealand Pilgrims Farewell No access New Zealand 4222254
Farewell for Christchurch survivors heading to Mecca
To opt-in to receive AP’s video updates (content alerts, outlooks, etc) via email, please register via http://discover.ap.org/Signup-for-APvideoalert
If you have a video coverage enquiry, please contact the Customer Desk (available 24/7) – customerdesk@ap.org

For All Latest Updates

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.