ETV Bharat / bharat

ఆ డిమాండ్లకు విలువలేదు: 'ఈటీవీ భారత్'​తో​ జేఎన్​యూ వీసీ

ఇటీవల పౌరసత్వ చట్టంపై ఆందోళనలు, అనంతరం విద్యార్థులపై ఆగంతుకుల దాడితో దేశవ్యాప్తంగా  చర్చనీయాంశమైంది దిల్లీ జేఎన్​యూ విశ్వవిద్యాలయం. ఈ కారణంగా వీసీ జగదీశ్ కుమార్ తీరుపైనా సర్వత్రా విమర్శలు వెల్లువెత్తాయి. వీసీ రాజీనామా చేయాలని పలువురు డిమాండ్ చేశారు. ఈ నేపథ్యంలో జేఎన్​యూ రగడ, అనంతర పరిణామాలపై వీసీ జగదీశ్​ కుమార్​తో ఈటీవి భారత్ ప్రత్యేక ముఖాముఖి.

author img

By

Published : Jan 14, 2020, 6:20 PM IST

Updated : Jan 14, 2020, 7:25 PM IST

jnu vc
ఆ డిమాండ్లకు విలువలేదు: 'ఈటీవీ భారత్'​తో​ జేఎన్​యూ వీసీ
జగదీశ్​ కుమార్, జేఎన్​యూ వీసీ

జనవరి 5న జేఎన్​యూలో జరిగిన హింసాత్మక ఘటనల అనంతరం వీసీ మామిడాల జగదీశ్​కుమార్ రాజీనామాకు పలువురు డిమాండ్​ చేశారు. అయితే రాజీనామా డిమాండ్లకు విలువ లేదని పేర్కొన్నారు జగదీశ్. వర్సిటీ అభివృద్ధి కోసం వీసీగా తన బాధ్యతలను కొనసాగిస్తానన్నారు. మెజారిటీ సంఖ్యలో విద్యార్థులు, ప్రొఫెసర్లు వారి పని వారు చేస్తున్నారన్నారు. కొంతమంది మాత్రమే వర్సిటీని అప్రతిష్ఠపాలు చేస్తున్నారని వ్యాఖ్యానించారు.

'నా పనిని కొనసాగిస్తా'

వార్తా ఛానెళ్లలో జేఎన్​యూను ప్రధానంగా చూడాలని అనుకోవడం లేదన్నారు జగదీశ్. ప్రపంచంలోని అత్యుత్తమ 100 విశ్వవిద్యాలయాల్లో జేఎన్​యూను నిలపడమే తన లక్ష్యమన్నారు. 2016లో వర్సిటీ వీసీగా బాధ్యతలు చేపట్టినప్పటి నుంచే పలువురు తన రాజీనామాకు డిమాండ్​ చేస్తున్నారన్నారు. పలు సంస్కరణలు ప్రవేశపెట్టడమే ఇందుకు కారణమని అభిప్రాయపడ్డారు. ఘటనలపై వీసీ స్పందించడం లేదన్న ఆరోపణలకూ సమాధానమిచ్చారు జగదీశ్. పాలనాధికారుల్లో వివిధ శ్రేణులుంటాయని చెప్పారు.

"మేం ఏ వివాదంలోకి వెళ్లదల్చుకోలేదు. ధర్నాలు, ఆందోళనలకు కొంతమంది ప్రొఫెసర్లు, విద్యార్థులదే బాధ్యత."

- జగదీశ్​ కుమార్​, జేఎన్​యూ వీసీ

'సమాచార కేంద్రం' ధ్వంసానికి యత్నించారు..

వర్సిటీ పట్ల దురుద్దేశాలు ఉన్న పలువురు విద్యార్థులు శీతకాల రిజిస్ట్రేషన్లు జరగకూడదని కోరుకున్నారని ఆరోపించారు జగదీశ్ ​కుమార్.

"జనవరి 5న ముసుగు వ్యక్తులు వర్సిటీ సమాచార కేంద్రాన్ని ధ్వంసం చేసేందుకు యత్నించారు. దిల్లీ పోలీసుల విచారణ పూర్తయ్యాకే ఘటనపై చర్యలు తీసుకుంటాం."

- జగదీశ్​ కుమార్​, జేఎన్​యూ వీసీ

'ముందే పోలీసులను పిలవలేను'

జనవరి 5న వర్సిటీలో ఆగంతుకుల దాడి సందర్భంలో వెంటనే పోలీసులను పిలవలేదనే ఆరోపణలకు సమాధానమిచ్చారు జగదీశ్. ఘర్షణ గురించి కచ్చితమైన సమాచారం అందాకే పోలీసులకు సమాచారమిచ్చానన్నారు.

"ఘర్షణపై సమాచారం తెలిసిన వెంటనే సెక్యూరిటీ సిబ్బందిని ఘటనా స్థలానికి పంపించాను. అక్కడికి చేరుకున్న అనంతరం ఆగంతుకుల సంఖ్య అంతకంతకూ పెరుగుతున్నట్లు సమాచారమిచ్చారు సిబ్బంది. ఆ వెంటనే నేను డీసీపీ, కమిషనర్లకు సమాచారమిచ్చాను."

- జగదీశ్​ కుమార్​, జేఎన్​యూ వీసీ

'చక్కగా నడుపుతున్నాం- విద్యార్థుల ఆందోళనలు సరికాదు'

గత రెండు నెలలుగా ఫీజుల పెంపుపై విద్యార్థులు ఆందోళనలు చేయడం పట్ల స్పందించారు జగదీశ్​కుమార్. వర్సిటీ ఆర్థిక స్థితిని విద్యార్థులకు వివరించామన్నారు.

"నీరు, విద్యుత్ వంటి ఖర్చులు మా అంతర్గత వ్యయం కిందకు వస్తాయని యూజీసీ మార్గదర్శకాలు ఇచ్చింది. మేం విద్యార్థులు, మానవ వనరుల శాఖల అభిప్రాయాలు తీసుకున్నాం. వ్యయాలను పూరించేందుకు యూజీసీకి నివేదించాం. వినియోగ, సేవల ఛార్జీలను తగ్గించాం. ఆర్థికంగా వెనకబడిన వారికి హాస్టల్ ఫీజు రూ. 150 గా నిర్ణయించాం. ఇలా మేం పలు మంచి నిర్ణయాలు తీసుకున్నప్పటికీ కొంతమంది విద్యార్థులు వ్యతిరేకిస్తున్నారు. ఇది సరికాదు."

- జగదీశ్​ కుమార్​, జేఎన్​యూ వీసీ

ఇదీ చూడండి: మిర్చి ఘాటు అదిరింది.. రూ.33 వేలు రేటు పలికింది!

జగదీశ్​ కుమార్, జేఎన్​యూ వీసీ

జనవరి 5న జేఎన్​యూలో జరిగిన హింసాత్మక ఘటనల అనంతరం వీసీ మామిడాల జగదీశ్​కుమార్ రాజీనామాకు పలువురు డిమాండ్​ చేశారు. అయితే రాజీనామా డిమాండ్లకు విలువ లేదని పేర్కొన్నారు జగదీశ్. వర్సిటీ అభివృద్ధి కోసం వీసీగా తన బాధ్యతలను కొనసాగిస్తానన్నారు. మెజారిటీ సంఖ్యలో విద్యార్థులు, ప్రొఫెసర్లు వారి పని వారు చేస్తున్నారన్నారు. కొంతమంది మాత్రమే వర్సిటీని అప్రతిష్ఠపాలు చేస్తున్నారని వ్యాఖ్యానించారు.

'నా పనిని కొనసాగిస్తా'

వార్తా ఛానెళ్లలో జేఎన్​యూను ప్రధానంగా చూడాలని అనుకోవడం లేదన్నారు జగదీశ్. ప్రపంచంలోని అత్యుత్తమ 100 విశ్వవిద్యాలయాల్లో జేఎన్​యూను నిలపడమే తన లక్ష్యమన్నారు. 2016లో వర్సిటీ వీసీగా బాధ్యతలు చేపట్టినప్పటి నుంచే పలువురు తన రాజీనామాకు డిమాండ్​ చేస్తున్నారన్నారు. పలు సంస్కరణలు ప్రవేశపెట్టడమే ఇందుకు కారణమని అభిప్రాయపడ్డారు. ఘటనలపై వీసీ స్పందించడం లేదన్న ఆరోపణలకూ సమాధానమిచ్చారు జగదీశ్. పాలనాధికారుల్లో వివిధ శ్రేణులుంటాయని చెప్పారు.

"మేం ఏ వివాదంలోకి వెళ్లదల్చుకోలేదు. ధర్నాలు, ఆందోళనలకు కొంతమంది ప్రొఫెసర్లు, విద్యార్థులదే బాధ్యత."

- జగదీశ్​ కుమార్​, జేఎన్​యూ వీసీ

'సమాచార కేంద్రం' ధ్వంసానికి యత్నించారు..

వర్సిటీ పట్ల దురుద్దేశాలు ఉన్న పలువురు విద్యార్థులు శీతకాల రిజిస్ట్రేషన్లు జరగకూడదని కోరుకున్నారని ఆరోపించారు జగదీశ్ ​కుమార్.

"జనవరి 5న ముసుగు వ్యక్తులు వర్సిటీ సమాచార కేంద్రాన్ని ధ్వంసం చేసేందుకు యత్నించారు. దిల్లీ పోలీసుల విచారణ పూర్తయ్యాకే ఘటనపై చర్యలు తీసుకుంటాం."

- జగదీశ్​ కుమార్​, జేఎన్​యూ వీసీ

'ముందే పోలీసులను పిలవలేను'

జనవరి 5న వర్సిటీలో ఆగంతుకుల దాడి సందర్భంలో వెంటనే పోలీసులను పిలవలేదనే ఆరోపణలకు సమాధానమిచ్చారు జగదీశ్. ఘర్షణ గురించి కచ్చితమైన సమాచారం అందాకే పోలీసులకు సమాచారమిచ్చానన్నారు.

"ఘర్షణపై సమాచారం తెలిసిన వెంటనే సెక్యూరిటీ సిబ్బందిని ఘటనా స్థలానికి పంపించాను. అక్కడికి చేరుకున్న అనంతరం ఆగంతుకుల సంఖ్య అంతకంతకూ పెరుగుతున్నట్లు సమాచారమిచ్చారు సిబ్బంది. ఆ వెంటనే నేను డీసీపీ, కమిషనర్లకు సమాచారమిచ్చాను."

- జగదీశ్​ కుమార్​, జేఎన్​యూ వీసీ

'చక్కగా నడుపుతున్నాం- విద్యార్థుల ఆందోళనలు సరికాదు'

గత రెండు నెలలుగా ఫీజుల పెంపుపై విద్యార్థులు ఆందోళనలు చేయడం పట్ల స్పందించారు జగదీశ్​కుమార్. వర్సిటీ ఆర్థిక స్థితిని విద్యార్థులకు వివరించామన్నారు.

"నీరు, విద్యుత్ వంటి ఖర్చులు మా అంతర్గత వ్యయం కిందకు వస్తాయని యూజీసీ మార్గదర్శకాలు ఇచ్చింది. మేం విద్యార్థులు, మానవ వనరుల శాఖల అభిప్రాయాలు తీసుకున్నాం. వ్యయాలను పూరించేందుకు యూజీసీకి నివేదించాం. వినియోగ, సేవల ఛార్జీలను తగ్గించాం. ఆర్థికంగా వెనకబడిన వారికి హాస్టల్ ఫీజు రూ. 150 గా నిర్ణయించాం. ఇలా మేం పలు మంచి నిర్ణయాలు తీసుకున్నప్పటికీ కొంతమంది విద్యార్థులు వ్యతిరేకిస్తున్నారు. ఇది సరికాదు."

- జగదీశ్​ కుమార్​, జేఎన్​యూ వీసీ

ఇదీ చూడండి: మిర్చి ఘాటు అదిరింది.. రూ.33 వేలు రేటు పలికింది!


New Delhi, Jan 14 (ANI): Union Minister of Information and Broadcasting Minister Prakash Javadekar on January 14 met a Bangladeshi delegation led by his counterpart Muhammad H Mahmud in New Delhi. Both the sides agreed to promote further bilateral relationship in Information and Broadcasting Sector. A formal MoU for the co-production of a film on BangaBandhu Sheikh Mujibur Rahman was also inked. The film will be directed by filmmaker Shyam Benegal, and to be released as part of centenary celebrations of BangaBandhu. India and Bangladesh also agreed to scale up joint production and exchange of programs between official broadcasters and Radio. India has extended its support to establish a film city in Bangladesh and also have technical exchange between NFDC and BFDC.
Last Updated : Jan 14, 2020, 7:25 PM IST

For All Latest Updates

TAGGED:

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.