కేంద్ర ప్రభుత్వ పథకం పేరుతో నకిలీ వెబ్సైట్ నిర్వహిస్తోన్న ముఠాను దిల్లీ పోలీసులు అరెస్ట్ చేశారు. పిల్లలకు బీమా అంటూ ఏకంగా ప్రధాని పేరుతో నకిలీ పథకాన్ని సృష్టించి వేల మంది నుంచి డబ్బులు కాజేశారని పోలీసులు గుర్తించారు. 'ప్రధానమంత్రి శిశు వికాస్ యోజన' అనే నకిలీ వెబ్సైట్ నిర్వహిస్తూ దేశవ్యాప్తంగా ప్రచారం కల్పించినట్లు తెలుస్తోంది.
15 వేల మంది..
అరెస్టయిన వారిలో బిహార్కు చెందిన నీరజ్ పాండే, సువేందర్ యాదవ్, ఉత్తర్ప్రదేశ్కు చెందిన ఆదర్శ్ యాదవ్ ఉన్నట్లు తెలిపారు. వీరు నిర్వహిస్తున్న వెబ్సైట్లో ఇప్పటివరకు 15 వేల మంది ప్రజలు తమ పేరును నమోదు చేసుకున్నట్లు పోలీసులు వెల్లడించారు. పంచాయతీ స్థాయిల్లో భారీ నెట్వర్క్ రూపొందించి మోసానికి పాల్పడినట్లు స్పష్టం చేశారు.
జాతీయ ఆరోగ్య సంస్థ డైరెక్టర్ ఫిర్యాదుతో ఈ విషయం వెలుగులోకి వచ్చింది. తొలుత www.pmsvy-cloud.in వెబ్సైట్తో 'ప్రధానమంత్రి శిశు వికాస్ యోజన' నకిలీ పథకాన్ని నిర్వహిస్తున్న నీరజ్, ఆదర్శ్ను అరెస్ట్ చేశారు పోలీసులు. అనంతరం 'పీఎం శిశు వికాస్ యోజన'ను నిర్వహిస్తున్న సువేందర్ను అదుపులోకి తీసుకున్నారు.
దేశవ్యాప్త నెట్వర్క్..
ఈ పథకాల ద్వారా పిల్లలకు బీమాతో పాటు విద్యార్థులకు ఆర్థిక సాయం అందిస్తామని వీటి ద్వారా ప్రచారం చేశారు నిందితులు. భారీగా విద్యార్థులు పేర్లు నమోదు చేసుకోవటంతో దేశవ్యాప్తంగా ఏజెంట్లను నియమించుకున్నారు. పంచాయతీ స్థాయిలో సమావేశాలు నిర్వహిస్తూ స్థానిక ప్రజలను ఆకర్షించే ప్రయత్నం చేశారు.
ఈ నకిలీ వెబ్సైట్ గురించి 'ప్రెస్ ఇన్ఫర్మేషన్ బ్యూరో' ఇప్పటికే స్పష్టత ఇచ్చింది. ఇది నకిలీ వెబ్సైట్ అని, ప్రధానమంత్రి శిశు వికాస్ యోజన పేరుతో ఏ ప్రభుత్వ పథకం లేదని పేర్కొంది.
-
#PIBFactCheck
— PIB Fact Check (@PIBFactCheck) January 30, 2020 " class="align-text-top noRightClick twitterSection" data="
Claim: - Govt. School students to get various monetary benefits under the “Pradhan Mantri Shishu Vikas Yojana”
Reality: This is a #FakeNews. There is NO “Pradhan Mantri Shishu Vikas Yojana” under the Central Government pic.twitter.com/OlO7QkHzwN
">#PIBFactCheck
— PIB Fact Check (@PIBFactCheck) January 30, 2020
Claim: - Govt. School students to get various monetary benefits under the “Pradhan Mantri Shishu Vikas Yojana”
Reality: This is a #FakeNews. There is NO “Pradhan Mantri Shishu Vikas Yojana” under the Central Government pic.twitter.com/OlO7QkHzwN#PIBFactCheck
— PIB Fact Check (@PIBFactCheck) January 30, 2020
Claim: - Govt. School students to get various monetary benefits under the “Pradhan Mantri Shishu Vikas Yojana”
Reality: This is a #FakeNews. There is NO “Pradhan Mantri Shishu Vikas Yojana” under the Central Government pic.twitter.com/OlO7QkHzwN
ఇదీ చూడండి: 'స్వచ్ఛ సర్వేక్షణ్' అవార్డులు ప్రకటించనున్న మోదీ