తమిళనాడు కృష్ణగిరి జిల్లాలో శుక్రవారం రాత్రి జరిగిన రోడ్డు ప్రమాదంలో తీవ్రంగా గాయపడిన 40 ఏళ్ల ఏనుగు ఆదివారం ఉదయం మరణించింది. రోడ్డు దాటుతుండగా ఓ ట్రక్కు వేగంగా వచ్చి ఏనుగును ఢీకొంది. ఈ ఘటనలో ఏనుగు కాళ్లకు తీవ్రంగా గాయాలయ్యాయి. ట్రక్కు డ్రైవర్పై వన్య ప్రాణుల సంరక్షణ చట్టం కింద కేసు నమోదు చేశారు పోలీసులు.

ఇలాంటి ప్రమాదాలు జరగకుండా రహదారుల వెంట సౌర దీపాలను అమర్చాలని అటవీ హక్కుల కార్యకర్తలు సూచించారు.
ఇదీ చదవండి : ట్రక్కు ఢీకొని ఏనుగు విలవిల