రెండు పిట్టల్ని మింగిన పాము.. బోనులో చిక్కి అవస్థలు.. చివరకు... - snake bird india
🎬 Watch Now: Feature Video

ఓ తాచు పాము.. రెండు మైనా పిట్టల్ని మింగేసింది. పక్షుల బోనులో చిక్కుకుని, బయటకు రాలేక అవస్థలు పడింది. ఈ ఘటన కర్ణాటక శివమొగ్గ జిల్లా ముద్దినకొప్ప గ్రామంలో జరిగింది. పక్షుల బోనులో సర్పాన్ని చూసిన ఇంటి యజమాని మంజప్ప.. పాముల సంరక్షకుడు కిరణ్కు సమాచారం ఇచ్చాడు. కిరణ్ వచ్చి.. పామును జాగ్రత్తగా బోను నుంచి బయటకు తీశాడు. కాసేపటికి రెండు పక్షుల్ని తాచు పాము కక్కేసింది. అనంతరం ఆ సర్పాన్ని జాగ్రత్తగా తీసుకెళ్లి అటవీ ప్రాంతంలో విడిచిపెట్టాడు కిరణ్.