thumbnail

By

Published : Mar 1, 2023, 8:15 AM IST

Updated : Mar 1, 2023, 8:45 AM IST

ETV Bharat / Videos

జీ20 సదస్సు కోసం తెచ్చిన పూల మొక్కలు చోరీ.. లగ్జరీ కారులో వచ్చి మరీ..

హరియాణాలో పట్టపగలే పూల మొక్కల దొంగతనం జరిగింది. ఇద్దరు వ్యక్తులు లగ్జరీ కారులో వచ్చి మరీ మొక్కలను ఎత్తుకెళ్లారు. గురుగ్రామ్​లో మార్చి 1 నుంచి 4వ తేదీ వరకు జీ20 దేశాల సమావేశాలు జరగనున్నాయి. అందుకోసం జిల్లా యంత్రాంగం లక్షలాది మొక్కలు నాటి అక్కడి ప్రాంతాన్ని అందంగా అలంకరిస్తుంది. అందుకు తెచ్చిన కొన్ని మొక్కలను అధికారులు శంకర్​ చౌక్​లో ఉంచారు. అవి గమనించిన ఇద్దరు వ్యక్తులు కారులో వచ్చి ఎత్తుకెళ్లారు. ఈ ఘటనను అక్కడే నిలబడిన ఓ వ్యక్తి తన మొబైల్‌లో వీడియో తీశాడు. ఆ వీడియోను సోషల్ మీడియాలో పోస్ట్ చేయగా.. అది కాస్త వైరల్​ అయింది. ఘటనా దృశ్యాలన్నీ స్థానికంగా ఉన్న సీసీటీవీ కెమెరాల్లో కూడా రికార్డయ్యాయి. ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేపడుతున్నారు. కఠిన చర్యలు తీసుకుంటామని తెలిపారు. 

Last Updated : Mar 1, 2023, 8:45 AM IST

ABOUT THE AUTHOR

author-img

...view details

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.