లాక్డౌన్తో నిర్మానుష్యంగా దేశ రాజధాని
కరోనా కోరలు పదునెక్కుతున్న నేపథ్యంలో దేశ వ్యాప్తంగా లాక్ డౌన్ను పూర్తి స్థాయిలో అధికారులు అమలు చేస్తున్నారు. దేశ రాజధాని దిల్లీలో ప్రజలంతా ఇళ్లకే పరిమితమవుతున్నారు. అత్యవసర విధులకు హాజరయ్యే వారు మినహా మిగతా ఎవ్వరూ రోడ్లపై కనిపించడం లేదు. రహదారులు, రద్దీ ప్రాంతాలన్నీ నిర్మానుష్యంగా మారాయి.