విద్యుత్​ టవర్​పైకి ఎక్కి యువతి హల్​చల్​.. బహిర్భూమికి వెళ్తానని చెప్పి..

By

Published : Feb 10, 2023, 10:48 AM IST

Updated : Feb 14, 2023, 11:34 AM IST

thumbnail

ఝార్ఖండ్​.. ధన్​బాద్​ జిల్లాలోని పంచేట్‌లో హైటెన్షన్ పవర్ గ్రిడ్ టవర్‌పైకి ఎక్కి సునీత ముర్ము అనే యువతి హల్​చల్​ చేసింది. గమనించిన స్థానికులు టవర్​ చుట్టూ గుమిగూడారు. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనాస్థలానికి చేరుకున్నారు. విద్యుత్ సరఫరాను నిలిపివేశారు. సునీతను ఒప్పించి కిందికి దించారు. అనంతరం ఆమె బంధువులను పోలీస్​స్టేషన్​కు పిలిపించి మాట్లాడారు. సెమీ న్యూరోటిక్ వ్యాధితో బాధపడుతున్న ఆమెకు మంచి వైద్యం అందించమని సూచించి సునీతను అప్పగించారు. బహిర్భూమికి వెళ్తానని చెప్పి బయటకు వెళ్లిన సునీత తిరిగి ఇంటికి రాలేదని ఆమె భర్త పోలీసులకు చెప్పాడు. 

Last Updated : Feb 14, 2023, 11:34 AM IST

TAGGED:

ABOUT THE AUTHOR

author-img

...view details

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.