తెరుచుకున్న కేదార్నాథ్ ఆలయం.. మోదీ తొలిపూజ!
![ETV Thumbnail thumbnail](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/320-214-15206342-thumbnail-3x2-kedharnath.jpg)
kedarnath: ఉత్తరాఖండ్లోని పవిత్ర పుణ్యక్షేత్రాల్లో ఒకటైన కేదార్నాథ్ ఆలయం ఆరునెలల సుదీర్ఘ విరామం తర్వాత తిరిగి తెరుచుకుంది. శుక్రవారం ఉదయం 6.25 గంటలకు వేద మంత్రాల మధ్య తలుపులు తెరిచారు. అంతకుముందు ప్రధాన పూజారి నివాసం నుంచి కేదార్నాథుడి డోలీని ఆలయ ప్రాంగణంలోకి తీసుకొచ్చారు. ఈ కార్యక్రమానికి 20వేల మందికిపైగా భక్తులు తరలివచ్చారు. ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి పుష్కర్ సింగ్ ధామి హాజరయ్యారు. అనంతరం ప్రధాని నరేంద్ర మోదీ తరఫున తొలి పూజ చేశారు అర్చకులు. హర్ హర్ మహాదేవ్ నినాదాలతో ధామ్ ప్రతిధ్వనించింది. ఆలయాన్ని 15 క్వింటాళ్ల వివిధ రకాల పూలతో అలంకరించారు. చార్ధామ్ యాత్రలో భాగమైన గంగోత్రి, యమునోత్రి ఆలయాలు ఈనెల 3వ తేదీనే తెరుచుకున్నాయి. బద్రినాథ్ ఆలయం ఈనెల 8వ తేదీన తెరవనున్నారు.
Last Updated : Feb 3, 2023, 8:23 PM IST