LIVE : వరద ప్రభావిత ప్రాంతాల్లో కేంద్రమంత్రులు పర్యటన - union ministers in telangana live

By ETV Bharat Telangana Team

Published : Sep 6, 2024, 1:07 PM IST

Updated : Sep 6, 2024, 1:29 PM IST

thumbnail
Union Ministers Visit Flood Affected Areas in Telangana : ఖమ్మం జిల్లాలోని వరద ప్రభావిత ప్రాంతాల్లో కేంద్రమంత్రులు పర్యటించారు. ఖమ్మం, పాలేరు, మధిర ప్రాంతాల్లో కేంద్రమంత్రులు ఏరియల్​ సర్వే చేశారు. వరద ప్రభావిత ప్రాంతాలను కేంద్రమంత్రులు శివరాజ్​సింగ్​, బండి సంజయ్​ చూశారు. వరదలకు కొట్టుకుపోయిన సాగర్​ ఎడమ కాలువను కేంద్రమంత్రులు పరిశీలించారు. మధిరలో కట్టలేరు వరదతో ముంపునకు గురైన పొలాలను పరిశీలించారు. ఖమ్మంలో మున్నేరు వాగు ఉద్ధృతితో ముంపునకు గురైన ప్రాంతాలను సైతం పరిశీలించారు. ఏరియల్​ సర్వే తర్వాత పాలేరుకు కేంద్రమంత్రులు వెళ్లనున్నారు. రాష్ట్రంలో వరద పరిస్థితులపై చిత్ర ప్రదర్శనను కేంద్రమంత్రులు తిలకించారు. పాలేరులో దెబ్బతిన్న పంటలను కేంద్రమంత్రులు పరిశీలించారు. పంట నష్టపోయిన రైతులతో కేంద్రమంత్రులు మాట్లాడారు. కేంద్రమంత్రుల వెంట ఉపముఖ్యమంత్రి భట్టి విక్రమార్క, మంత్రులు పొంగులేటి శ్రీనివాస్​ రెడ్డి, తుమ్మల నాగేశ్వరరావు ఉన్నారు. గత శనివారం రాష్ట్రవ్యాప్తంగా భారీ వర్షాలు కురిశాయి. ఈ క్రమంలో మున్నేరు వాగుకు భారీగా వరదలు వచ్చాయి.
Last Updated : Sep 6, 2024, 1:29 PM IST

ABOUT THE AUTHOR

...view details

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.