LIVE : ముంబైలో టీమిండియా క్రికెటర్ల రోడ్ షో - ప్రత్యక్షప్రసారం - Team India Cricketers Rally
Published : Jul 4, 2024, 5:34 PM IST
|Updated : Jul 4, 2024, 7:39 PM IST
Team India Cricketers Road Show in Mumbai : టీ-20 ప్రపంచకప్ విజేతగా నిలిచిన టీమిండియా 3 రోజుల తర్వాత స్వదేశం చేరుకుంది. ఈ నెల 29న జరిగిన ఫైనల్ పోరులో సౌతాఫ్రికాపై అద్భుత విజయం నమోదు చేసిన రోహిత్ సేన, గురువారం ఉదయం దిల్లీ ఎయిర్ పోర్ట్కు చేరుకుంది. వరల్డ్ ఛాంపియన్లకు బీసీసీఐ అధికారులు, టీమ్ఇండియా ఫ్యాన్స్ ఘన స్వాగతం పలికారు. బీసీసీఐ ఏర్పాటు చేసిన ప్రత్యేక బస్సులో ప్లేయర్లంతా దిల్లీ ఐటీసీ మౌర్య హోటల్కు వెళ్లారు. అక్కడి నుంచి నేరుగా వెళ్లి ప్రధాని నరేంద్ర మోదీని కలిశారు.ప్రధానితో భేటీ అయ్యాక టీమ్ఇండియా స్పెషల్ ఫ్లైట్లో ముంబయికి చేరుకుంది. ప్రస్తుతం ఆటగాళ్లంతా భారీ రోడ్ షోలో పాల్గొన్నారు.ఈ క్రమంలో రోడ్ షో కోసం ఓ బస్సును బీసీసీఐ ప్రత్యేకంగా డిజైన్ చేయించింది. ఓపెన్ టాప్ బస్సుపై టీమ్ఇండియా ప్లేయర్లు రోడ్ షోలో పాల్గొన్నారు. ముంబయి నారిమన్ పాయింట్ వద్ద ప్రారంభమైన ఈ ర్యాలీ, వాంఖడే స్టేడియం వద్ద ముగుస్తుంది. ర్యాలీ డిస్టెన్స్ దాదాపు 2 కిలోమీటర్లు. ఈ రోడ్ షోకు ఫ్యాన్స్ భారీ ఎత్తున హాజరయ్యారు. ఈ నేపథ్యంలో అధికారులు గట్టి భద్రతా ఏర్పాట్లు చేశారు.