LIVE : రాజ్యసభ సమావేశాలు - ప్రత్యక్షప్రసారం - Rajya Sabha Sessions Live - RAJYA SABHA SESSIONS LIVE
🎬 Watch Now: Feature Video


Published : Jul 24, 2024, 2:29 PM IST
|Updated : Jul 24, 2024, 7:09 PM IST
Rajya Sabha Sessions Live : మూడో విడత మోదీ సర్కార్ లక్ష్యాలను వివరిస్తూ ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ 2024-25 ఆర్థిక సంవత్సరానికి సంబంధించిన పూర్తిస్థాయి బడ్జెట్ను మంగళవారం నాడు పార్లమెంట్కు సమర్పించారు. వరుసగా ఏడోసారి వార్షిక పద్దును ప్రవేశపెట్టిన ఆమె వికసిత్ భారత్ లక్ష్యసాధనలో భాగంగా అన్ని రంగాల్లో ఉద్యోగ, ఉపాధి కల్పనకు అధిక ప్రాధాన్యం ఇచ్చారు. ఈ మేరకు రూ. 48.21 లక్షల కోట్ల అంచనాలతో వార్షిక పద్దును ప్రవేశపెట్టారు. ఈ వార్షిక బడ్జెట్లో రెవెన్యూ రాబడులు 31.3లక్షల కోట్లుగా పేర్కొన్న ఆర్థిక మంత్రి, మూలధన రాబడులను రూ.16.9 లక్షల కోట్లుగా వివరించారు. రెవెన్యూ వ్యయాన్ని రూ.37.1 లక్షల కోట్లుగా వివరించిన మంత్రి మూలధన వ్యయం రూ.15లక్షల కోట్లు అని పేర్కొన్నారు. రెవెన్యూ లోటు జీడీపీలో 4.9 శాతంగా ఉంటుందని వివరించారు. అయితే కేంద్ర వార్షిక బడ్జెట్లో విపక్ష పార్టీలు పాలించే రాష్ట్రాలపై వివక్ష చూపారని ఇండియా కూటమి ధ్వజమెత్తింది. కేంద్ర బడ్జెట్ ముఖ్య ఉద్దేశాన్ని దెబ్బతీశారని, చాలా రాష్ట్రాలకు నిధులు కేటాయించకుండా వివక్ష చూపారని నేతలు ఆరోపించారు. ఈ క్రమంలోనే ఇవాళ రాజ్యసభ సమావేశాలు కొనసాగుతున్నాయి.
Last Updated : Jul 24, 2024, 7:09 PM IST