thumbnail

LIVE : మీడియా పాయింట్​ వద్ద నేతల మీడియా సమావేశం - leaders Press meet at media point

By ETV Bharat Telangana Team

Published : Jul 27, 2024, 9:44 AM IST

Updated : Jul 27, 2024, 9:53 AM IST

MLAs and Ministers Press Meet at media point : అసెంబ్లీలోని మీడియా పాయింట్​ వద్ద ఎమ్మెల్యేలు, మంత్రులు ప్రెస్​మీట్​లు పెడుతున్నారు. ఈ క్రమంలో హైడ్రా, మూసీ నది కోసం నిధులు విడుదల చేసిన సీఎం రేవంత్​ రెడ్డి, డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్కలకు బీసీ సంక్షేమ శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్​ కృతజ్ఞతలు తెలిపారు. కేంద్రం నుంచి కిషన్​ రెడ్డి హైదరాబాద్​ అభివృద్ధికి నిధులు తీసుకురాలేదని విమర్శలు చేశారు. కేంద్రం నుంచి రాష్ట్రానికి నిధులు తీసుకురావాలని బీజేపీకి సవాల్​ విసిరారు. అఖిలపక్షం సమావేశం పెట్టి ప్రధాని వద్దకు తీసుకెళ్లాలని వారి స్పష్టం చేశారు. ఈ విషయంపై తెలంగాణ శాసనసభ మీడియా పాయింట్​ వద్ద మీడియా ప్రతినిధులతో మంత్రి మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో రాష్ట్ర బడ్జెట్​పై మాట్లాడారు. అలాగే బీఆర్​ఎస్​, బీజేపీలపై తీవ్రస్థాయిలో విమర్శలు చేశారు. బడ్జెట్​పై చర్చించేందుకు రాష్ట్ర ప్రభుత్వం సిద్ధంగా ఉందని స్పష్టం చేశారు. రాష్ట్ర బడ్జెట్​ ప్రజా పద్దుగా ఉందని మంత్రి పొన్నం ప్రభాకర్​ తెలిపారు. బడ్జెట్​పై అన్ని వర్గాల ప్రజలు ఆనందం వ్యక్తం చేస్తున్నారని చెప్పారు. మరోవైపు అనంతరం బీఆర్ఎస్ నేతలు మీడియా పాయింట్ వద్ద మాట్లాడారు.
Last Updated : Jul 27, 2024, 9:53 AM IST

ABOUT THE AUTHOR

...view details

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.