LIVE : సీతారామ ప్రాజెక్టు అంశంపై జలసౌధలో మంత్రుల మీడియా సమావేశం - Ministers Press Meet At Jalasoudha

By ETV Bharat Telangana Team

Published : Aug 13, 2024, 5:08 PM IST

Updated : Aug 13, 2024, 6:02 PM IST

thumbnail
Ministers Press Meet At Jalasoudha : సీతారామ ప్రాజెక్టు ప్రారంభోత్సవ కార్యక్రమం స్వాతంత్ర దినోత్సవం రోజు జరగనుంది. ఈ నెల 15న ఈ ప్రాజెక్టును ముఖ్యమంత్రి రేవంత్​ రెడ్డి జాతికి అంకితం చేయనున్నారు. ఈ నేపథ్యంలో ప్రారంభోత్సవానికి సంబంధించిన ఏర్పాట్లపై నీటిపారుదల శాఖ మంత్రి ఉత్తమ్​కుమార్​ రెడ్డి దృష్టిసారించారు. ఘనంగా ప్రారంభించేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు. సీతారామ ప్రాజెక్టు ప్రారంభోత్సవ ఏర్పాట్లపై ఇప్పటికే అధికారులు, ఇంజినీర్లతో మంత్రి హైదరాబాద్​ జలసౌధలో సమీక్ష నిర్వహించారు. ట్రయల్​ రన్​ కార్యక్రమం కూడా జరిగింది. వైరాలో జరిగే బహిరంగ సభలో సీఎం రేవంత్​ రెడ్డి పాల్గోనున్నారు. ఈ సందర్భంగా సభ ఏర్పాట్లు ఇలా పలు అంశాలపై మంత్రులతో చర్చించారు. ఈ నేపథ్యంలోనే జలసౌధ వేదికగా మంగళవారం సీతారామ ప్రాజెక్టు ప్రారంభోత్సవ ఏర్పాట్లు తదితర అంశాలపై నీటిపారుదల శాఖ మంత్రి ఉత్తమ్​ కుమార్​రెడ్డి, పొంగులేటి శ్రీనివాస్​ రెడ్డి, కొండా సురేఖలు మీడియాతో మాట్లాడుతున్నారు. ఆ ప్రత్యక్ష ప్రసారం.  
Last Updated : Aug 13, 2024, 6:02 PM IST

ABOUT THE AUTHOR

...view details

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.