thumbnail

By ETV Bharat Telugu Team

Published : 10 hours ago

ETV Bharat / Videos

నడిరోడ్డుపై కారు ఆపి 2.5కిలోల బంగారం చోరీ - Gold Robbery On Road

Gold Robbery On Road : నడిరోడ్డుపై వ్యాపారి కారును ఆపి బంగారాన్ని చోరీ చేసిన ఘటన కేరళలోని త్రిసూర్​లో జరిగింది. పట్టపగలు కత్తులు, గొడ్డళ్లతో వ్యాపారిని బెదిరించి 2.5 కిలోల బంగారాన్ని దోచుకెళ్లారు. ఘటనపై ఫిర్యాదు అందుకున్న పోలీసులు, కేసు నమోదు చేశారు. సీసీటీవీ ఫుటేజ్ ఆధారంగా దర్యాప్తు చేపట్టారు. దొంగల ముఠాకు చెందిన కారును ఓ మెకానిక్ షెడ్​లో గుర్తించారు.

పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం- అరుణ్ సన్నీ అనే వ్యాపారి 2.5 కిలోల బంగారు ఆభరణాలను తీసుకుని కారులో కోయంబత్తూరు నుంచి త్రిసూర్​కు బుధవారం బయలుదేరారు. ఉదయం 11 గంటల సమయంలో కుతిరన్ జాతీయ రహదారిపై గుర్తు తెలియని వ్యక్తులు మూడు కార్లలో అరుణ్ వాహనాన్ని వెంబడించారు. ఆ తర్వాత కత్తులు, గొడళ్లతో బెదిరించి కారు నుంచి బయటకు రప్పించారు. అనంతరం బంగారాన్ని దోచుకున్నారు.

ఆ తర్వాత మరో వాహనంలో దొంగలంతా పరారయ్యారు. ఘటనకు సంబంధించిన దృశ్యాలు సీసీటీవీలో రికార్డు అవ్వగా, పోలీసులు శరవేగంగా దర్యాప్తు చేపట్టారు. దొంగల కారును పుత్తూరులోని మెకానిక్ షెడ్​లో ఉన్నట్లు కనుగొన్నారు. విచారణలో మిగతా కార్ల నంబర్‌ ప్లేట్లు నకిలీవని గుర్తించారు. వివిధ ఆధారాలతో దొంగల కోసం గాలింపు చర్యలు చేపట్టారు. 

ABOUT THE AUTHOR

...view details

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.