LIVE : సిద్దిపేటలో మెదక్ పార్లమెంట్ నియోజకవర్గ నేతలతో హరీశ్రావు సమావేశం - Harish Rao Live - HARISH RAO LIVE
🎬 Watch Now: Feature Video


Published : Mar 29, 2024, 4:17 PM IST
|Updated : Mar 29, 2024, 4:31 PM IST
Harish Rao Live : రాష్ట్రంలో శాసనసభ ఎన్నికల్లో చేదు ఫలితాలు ఎదురైనా, పార్లమెంట్ ఎన్నికల్లో సత్తా చాటాలని భారత్ రాష్ట్ర సమితి భావిస్తోంది. మెజార్టీ స్థానాలను కైవసం చేసుకొని తమ ఓటమి తాత్కాలికమేనని నిరూపించేందుకు వ్యూహాలు రచిస్తోంది. అందులోనే భాగంగా ఇవాళ సిద్దిపేటలోని మెదక్ పార్లమెంటరీ నేతలతో మాజీ మంత్రి హరీశ్రావు సమావేశమయ్యారు. మరోవైపు రాజకీయ అవకాశవాదులు, పవర్ బ్రోకర్లు పార్టీ వీడుతున్నారని వ్యాఖ్యానించారు. నేతలు పార్టీ వీడి వెళ్లడం బీఆర్ఎస్కు కొత్తేమీ కాదని అన్నారు. ఉద్యమం మొదలుపెట్టినప్పుడు 10 మంది కూడా పార్టీలో లేరని తెలిపారు. అయినా కేసీఆర్ తెలంగాణ తెచ్చి చూపెట్టారని పేర్కొన్నారు. ఆనాడు ఉద్యమ సమయంలోనూ కాంగ్రెస్ వాళ్లు ఇలాగే కొన్నారని మండిపడ్డారు.నాయకులను కాంగ్రెస్ కొనవచ్చు కానీ ఉద్యమకారులను కొనలేరని అన్నారు. మధ్యలో పార్టీలోకి వచ్చినవాళ్లు పార్టీలో నుంచి వెళ్తున్నారని తెలిపారు. పార్టీ వీడినవారిని మళ్లీ తీసుకోవద్దని పార్టీ నిర్ణయించిందని వెల్లడించారు. కష్టకాలంలో పార్టీకి ద్రోహం చేస్తే కన్నతల్లికి ద్రోహం చేసినట్టేనని మండిపడ్డారు.
Last Updated : Mar 29, 2024, 4:31 PM IST