ETV Bharat / state

ఫోన్​ ట్యాపింగ్​ విషయంలో మీడియా సంయమనం పాటించండి - వారి పేర్లు బహిర్గతం చేయొద్దు : హైకోర్టు - telangana hc on phone tapping

author img

By ETV Bharat Telangana Team

Published : Jul 10, 2024, 3:07 PM IST

Updated : Jul 10, 2024, 3:34 PM IST

Phone Tapping Case in Telangana : ఫోన్​ ట్యాపింగ్​ వ్యవహారంలో మీడియా సంయమనం పాటించాలని తెలంగాణ హైకోర్టు తెలిపింది. వ్యక్తిగత జీవితాల్లోకి వెళ్లి అనవసర రాద్ధాంతం చేయొద్దని హెచ్చరించింది. ఈ నెల 23కు కేసును హైకోర్టు వాయిదా వేసింది.

Phone Tapping Case in Telangana
Phone Tapping Case in Telangana (ETV Bharat)

Phone Tapping Case in Telangana High Court : రాష్ట్రవ్యాప్తంగా ఫోన్​ ట్యాపింగ్​ వ్యవహారం సంచలనం సృష్టించిన విషయం తెలిసిందే. తాజాగా ఈ కేసుపై హైకోర్టులో విచారణ జరిగింది. ఈ సందర్భంగా ఫోన్​ ట్యాపింగ్​ వ్యవహారంలో జడ్జిలు, వాళ్ల కుటుంబ సభ్యుల పేర్లు మీడియాలో ప్రసారం చేయొద్దని ధర్మాసనం ఆదేశించింది. కొన్ని పత్రికల్లో జడ్జి పేరు, మొబైల్​ నంబర్​ ప్రచురించినట్లు హైకోర్టు ప్రస్తావించింది. ఫోన్​ ట్యాపింగ్​పై మీడియా సంయమనం, బాధ్యతతో వ్యవహరించాలని తెలిపింది. ఫోన్​ ట్యాపింగ్​ కేసు వార్తలు రాసేటప్పుడు మీడియా జాగ్రత్తగా ఉండాలని హెచ్చరించింది. ఈ కేసులో ఇప్పటికే ప్రతివాదులు కౌంటర్​ దాఖలు చేశారని అన్నారు. అందుకే ప్రస్తుతానికి ఎలాంటి ఆదేశాలు ఇవ్వాలనుకోవడం లేదని హైకోర్టు స్పష్టం చేసింది.

వారి వ్యక్తిగత జీవితాల్లోకి వెళ్లి అనవసర రాద్ధాంతం చేయొద్దని హైకోర్టు హెచ్చరించింది. జడ్జీలు, వారి కుటుంబ సభ్యుల పేర్లు, ఫోన్​ నంబర్లు, ఫొటోలు బహిర్గతం చేయొద్దని ఆదేశించింది. ఈ మేరకు ఈనెల 23న కౌంటర్​ దాఖలు చేస్తామని కేంద్రం చెప్పింది. దీంతో కేసును ఈ నెల 23వ తేదీకి హైకోర్టు వాయిదా వేసింది. ఈ కేసును సీజే ధర్మాసనం విచారిస్తోంది.

అసలేం జరిగింది : రాజకీయ నేతలతో పాటు జడ్జిల ఫోన్లు ట్యాప్​ చేశారని పత్రికల్లో కథనాల ఆధారంగా ఫోన్​ ట్యాపింగ్​ కేసును తెలంగాణ హైకోర్టు సుమోటోగా స్వీకరించింది. ఇప్పటికే ఈ కేసులో రాష్ట్ర ప్రభుత్వం కౌంటర్​ దాఖలు చేసింది. కేసు విచారణ జరుగుతోందని, నిందితులను అరెస్టు చేసినట్లు కౌంటర్​లో ప్రభుత్వం పేర్కొంది. పలువురు పోలీసు అధికారుల ఫోన్లు సైతం ట్యాపింగ్​ చేసినట్లు కౌంటర్​ అఫిడవిట్​లో తెలిపింది. ఇందుకు సంబంధించి హైకోర్టు నేడు విచారణ చేపట్టగా రాష్ట్ర ప్రభుత్వానికి సంయమనం పాటించాలని తెలిపింది. ఈ మేరకు ఈనెల 23కు కేసును వాయిదా వేసింది.

గత వారం వాదనలు : ఈ క్రమంలో హైకోర్టులో గత వారం వాదనలు వినిపించిన కేంద్రం తరపు న్యాయవాది, ఫోన్​ ట్యాప్​ చేయాల్సి వస్తే ఆయా రాష్ట్రాల హోంశాఖలే అనుమతులు మంజూరు చేస్తాయని హైకోర్టుకు తెలిపారు. ఇందుకు కేంద్ర హోంశాఖ అనుమతులు అవసరం లేదని న్యాయస్థానానికి వివరించారు.

ఫోన్‌ ట్యాపింగ్‌ కేసులో మరో మలుపు - ఇప్పట్లో రాలేనన్న ప్రభాకర్​రావు - బ్లూకార్నర్ నోటీసు జారీ అనుమానమే - PRABHAKAR RAO IN PHONE TAPPING CASE

ఫోన్​ట్యాపింగ్​కు పర్మిషన్ ఇచ్చేది హోంశాఖే - హైకోర్టుకు కేంద్రం నివేదిక - Phone Tapping Case Latest Update

Phone Tapping Case in Telangana High Court : రాష్ట్రవ్యాప్తంగా ఫోన్​ ట్యాపింగ్​ వ్యవహారం సంచలనం సృష్టించిన విషయం తెలిసిందే. తాజాగా ఈ కేసుపై హైకోర్టులో విచారణ జరిగింది. ఈ సందర్భంగా ఫోన్​ ట్యాపింగ్​ వ్యవహారంలో జడ్జిలు, వాళ్ల కుటుంబ సభ్యుల పేర్లు మీడియాలో ప్రసారం చేయొద్దని ధర్మాసనం ఆదేశించింది. కొన్ని పత్రికల్లో జడ్జి పేరు, మొబైల్​ నంబర్​ ప్రచురించినట్లు హైకోర్టు ప్రస్తావించింది. ఫోన్​ ట్యాపింగ్​పై మీడియా సంయమనం, బాధ్యతతో వ్యవహరించాలని తెలిపింది. ఫోన్​ ట్యాపింగ్​ కేసు వార్తలు రాసేటప్పుడు మీడియా జాగ్రత్తగా ఉండాలని హెచ్చరించింది. ఈ కేసులో ఇప్పటికే ప్రతివాదులు కౌంటర్​ దాఖలు చేశారని అన్నారు. అందుకే ప్రస్తుతానికి ఎలాంటి ఆదేశాలు ఇవ్వాలనుకోవడం లేదని హైకోర్టు స్పష్టం చేసింది.

వారి వ్యక్తిగత జీవితాల్లోకి వెళ్లి అనవసర రాద్ధాంతం చేయొద్దని హైకోర్టు హెచ్చరించింది. జడ్జీలు, వారి కుటుంబ సభ్యుల పేర్లు, ఫోన్​ నంబర్లు, ఫొటోలు బహిర్గతం చేయొద్దని ఆదేశించింది. ఈ మేరకు ఈనెల 23న కౌంటర్​ దాఖలు చేస్తామని కేంద్రం చెప్పింది. దీంతో కేసును ఈ నెల 23వ తేదీకి హైకోర్టు వాయిదా వేసింది. ఈ కేసును సీజే ధర్మాసనం విచారిస్తోంది.

అసలేం జరిగింది : రాజకీయ నేతలతో పాటు జడ్జిల ఫోన్లు ట్యాప్​ చేశారని పత్రికల్లో కథనాల ఆధారంగా ఫోన్​ ట్యాపింగ్​ కేసును తెలంగాణ హైకోర్టు సుమోటోగా స్వీకరించింది. ఇప్పటికే ఈ కేసులో రాష్ట్ర ప్రభుత్వం కౌంటర్​ దాఖలు చేసింది. కేసు విచారణ జరుగుతోందని, నిందితులను అరెస్టు చేసినట్లు కౌంటర్​లో ప్రభుత్వం పేర్కొంది. పలువురు పోలీసు అధికారుల ఫోన్లు సైతం ట్యాపింగ్​ చేసినట్లు కౌంటర్​ అఫిడవిట్​లో తెలిపింది. ఇందుకు సంబంధించి హైకోర్టు నేడు విచారణ చేపట్టగా రాష్ట్ర ప్రభుత్వానికి సంయమనం పాటించాలని తెలిపింది. ఈ మేరకు ఈనెల 23కు కేసును వాయిదా వేసింది.

గత వారం వాదనలు : ఈ క్రమంలో హైకోర్టులో గత వారం వాదనలు వినిపించిన కేంద్రం తరపు న్యాయవాది, ఫోన్​ ట్యాప్​ చేయాల్సి వస్తే ఆయా రాష్ట్రాల హోంశాఖలే అనుమతులు మంజూరు చేస్తాయని హైకోర్టుకు తెలిపారు. ఇందుకు కేంద్ర హోంశాఖ అనుమతులు అవసరం లేదని న్యాయస్థానానికి వివరించారు.

ఫోన్‌ ట్యాపింగ్‌ కేసులో మరో మలుపు - ఇప్పట్లో రాలేనన్న ప్రభాకర్​రావు - బ్లూకార్నర్ నోటీసు జారీ అనుమానమే - PRABHAKAR RAO IN PHONE TAPPING CASE

ఫోన్​ట్యాపింగ్​కు పర్మిషన్ ఇచ్చేది హోంశాఖే - హైకోర్టుకు కేంద్రం నివేదిక - Phone Tapping Case Latest Update

Last Updated : Jul 10, 2024, 3:34 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.