ETV Bharat / sports

ఇండియా x పాక్ మ్యాచ్ టికెట్లు అన్​సోల్డ్!- ఇట్స్ మిరాకిల్- కారణం అదేనా? - T20 World cup 2024

Ind vs Pak Tickets: టీ20 వరల్డ్​కప్​లో న్యూయార్క్ వేదికాగా జూన్ 9న జరగనున్నభారత్- పాకిస్థాన్ మ్యాచ్ టికెట్లు పూర్తిగా అమ్ముడు పోలేదు. మ్యాచ్​కు రెండు రోజులే ఉన్నా ఇప్పటికీ వందలాది టికెట్లు బుకింగ్​కు అందుబాటులో ఉండడం ఆశ్చర్యాననికి గురిచేస్తోంది.

author img

By ETV Bharat Telugu Team

Published : Jun 7, 2024, 3:58 PM IST

Ind vs Pak Tickets
Ind vs Pak Tickets (Source: Associated Press)

Ind vs Pak Tickets: 2024 టీ20 వరల్డ్​కప్ మ్యాచ్​లు రసవత్తరంగా సాగుతున్నాయి. అయితే మ్యాచ్​లు జరుగుతున్న స్టేడియాలకు మాత్రం ఆశించిన స్థాయిలో ప్రేక్షకులు రావట్లేదు. ఇప్పటివరకు జరిగిన అన్ని మ్యాచ్​ల్లో ఖాళీ సీట్లే ఎక్కువగా దర్శనమిచ్చాయి. టోర్నమెంట్​కు ఆతిథ్యమిస్తున్న అమెరికాలో క్రికెట్​కు పెద్దగా ఆదరణ లేకపోవడం దీనికి ప్రధాన కారణంగా భావించవచ్చు. అయితే టోర్నీలో మొత్తంలో హై వోల్టేజ్ మ్యాచ్ భారత్- పాకిస్థాన్ పోరుకు మాత్రం భారీ సంఖ్యలో ఆడియెన్స్​ హాజరవుతారని ఐసీసీ ఆశిస్తోంది. జూన్ 9న న్యూయార్క్ నసావు క్రికెట్ స్టేడియంలో ఈ మ్యాచ్ జరగనుంది. ఇక ఈ మ్యాచ్​తో టోర్నీకి భారీగానే ఆదాయం వస్తుందని ఐసీసీ భావించింది.

కానీ, ఈ మ్యాచ్​కు కూడా అంతంత మాత్రానే ప్రేక్షకులు స్టేడియానికి రానున్నట్లు తెలుస్తోంది. మ్యాచ్​కు ఇంకా రెండు మాత్రమే ఉన్నప్పటికీ టికెట్లు పూర్తిగా అమ్ముడు కాలేదు. ఐసీసీ వెబ్​సైట్​లో ఇంకా చాలా టికెట్లు అందుబాటులో ఉన్నట్లు చూపిస్తోంది. ప్రీమియమ్ క్లబ్ లాంజ్ (Premium Club Lounge), డైమండ్ క్లబ్ లాంజ్​ (Diamond Club Lounge)ల్లో వందలాది టికెట్లు అన్​సోల్డ్​ (Unsold)గానే ఉన్నాయి. కాగా, ఏ టోర్నీలోనైనా ఇండోపాక్ క్రికెట్​ మ్యాచ్​కు టికెట్లు ఇంత నెమ్మదిగా అమ్ముడవడం ఇదే తొలిసారి అని నెటిజన్లు అంటున్నారు. కాగా, కేవలం 300 డాలర్ల టికెట్లు (Standard Ticket) పూర్తిగా అమ్ముడయ్యాయి.

దాదాపు డబుల్: అయితే సాధారణం కంటే టికెట్లు రేట్లు విపరీతంగా పెంచడమే ఇందుకు ప్రధాన కారణంగా తెలుస్తోంది. ఇదే టోర్నీలో న్యూయార్క్ స్టేడియంలో జరిగిన భారత్- ఐర్లాండ్ మ్యాచ్​కు ప్రీమియమ్ టికెట్ (పిచ్​కు ఎదురుగా) 1000 డాలర్లు ఉండగా, అదే టికెట్ ఇండోపాక్ మ్యాచ్​కు 2500 డాలర్లకు (రూ. 2.10 లక్షలు) పెంచారు. అంటే 150శాతం పెంచారు. ఇక డైమండ్ ప్రీమియమ్ సీట్ అత్యధికంగా 10,000 డాలర్లు (రూ. 8.30 లక్షలు)గా నిర్ణయించారు.

ఫైనల్ కంటే ఎక్కువ రేటు: దీనిపై క్రికెట్ అనలిస్ట్​లు కూడా స్పందిస్తున్నారు. 'అమెరికన్లకు క్రికెట్ గురించి ఎక్కువగా తెలీదు. అందుకనే తెలియని గేమ్ కోసం అంత ఎక్కువ ధర టికెట్లు కొనుగోలు చేసి స్టేడియానికి వెళ్లాలనుకోరు' అని ఓ నెటిజన్ కామెంట్ చేశారు. ఇక అమెరికాలో అత్యంత ఆదరణ కలిగిన బాస్కెట్‌బాల్, ఎన్​బీఏ (NBA) టోర్నమెంట్​ మ్యాచ్​లకు కూడా ఇంత ఎక్కువగా టికెట్లు లేవు అని, రీసెంట్​గా జరిగిన NBA ఫైనల్ మ్యాచ్ టికెట్ ధర కూడా అంతకంటే తక్కువ (546 డాలర్లు) ఉందని అన్నాడు.

డేంజరస్​గా మారుతున్న అమెరికన్​ టీమ్​ - మనోళ్లు జాగ్రత్తగా ఆడాల్సిందే! - T20 WorldCup 2024

పాక్ ఘోర పరాజయం - సూపర్ ఓవర్​లోనూ షాకే - T20 World Cup 2024

Ind vs Pak Tickets: 2024 టీ20 వరల్డ్​కప్ మ్యాచ్​లు రసవత్తరంగా సాగుతున్నాయి. అయితే మ్యాచ్​లు జరుగుతున్న స్టేడియాలకు మాత్రం ఆశించిన స్థాయిలో ప్రేక్షకులు రావట్లేదు. ఇప్పటివరకు జరిగిన అన్ని మ్యాచ్​ల్లో ఖాళీ సీట్లే ఎక్కువగా దర్శనమిచ్చాయి. టోర్నమెంట్​కు ఆతిథ్యమిస్తున్న అమెరికాలో క్రికెట్​కు పెద్దగా ఆదరణ లేకపోవడం దీనికి ప్రధాన కారణంగా భావించవచ్చు. అయితే టోర్నీలో మొత్తంలో హై వోల్టేజ్ మ్యాచ్ భారత్- పాకిస్థాన్ పోరుకు మాత్రం భారీ సంఖ్యలో ఆడియెన్స్​ హాజరవుతారని ఐసీసీ ఆశిస్తోంది. జూన్ 9న న్యూయార్క్ నసావు క్రికెట్ స్టేడియంలో ఈ మ్యాచ్ జరగనుంది. ఇక ఈ మ్యాచ్​తో టోర్నీకి భారీగానే ఆదాయం వస్తుందని ఐసీసీ భావించింది.

కానీ, ఈ మ్యాచ్​కు కూడా అంతంత మాత్రానే ప్రేక్షకులు స్టేడియానికి రానున్నట్లు తెలుస్తోంది. మ్యాచ్​కు ఇంకా రెండు మాత్రమే ఉన్నప్పటికీ టికెట్లు పూర్తిగా అమ్ముడు కాలేదు. ఐసీసీ వెబ్​సైట్​లో ఇంకా చాలా టికెట్లు అందుబాటులో ఉన్నట్లు చూపిస్తోంది. ప్రీమియమ్ క్లబ్ లాంజ్ (Premium Club Lounge), డైమండ్ క్లబ్ లాంజ్​ (Diamond Club Lounge)ల్లో వందలాది టికెట్లు అన్​సోల్డ్​ (Unsold)గానే ఉన్నాయి. కాగా, ఏ టోర్నీలోనైనా ఇండోపాక్ క్రికెట్​ మ్యాచ్​కు టికెట్లు ఇంత నెమ్మదిగా అమ్ముడవడం ఇదే తొలిసారి అని నెటిజన్లు అంటున్నారు. కాగా, కేవలం 300 డాలర్ల టికెట్లు (Standard Ticket) పూర్తిగా అమ్ముడయ్యాయి.

దాదాపు డబుల్: అయితే సాధారణం కంటే టికెట్లు రేట్లు విపరీతంగా పెంచడమే ఇందుకు ప్రధాన కారణంగా తెలుస్తోంది. ఇదే టోర్నీలో న్యూయార్క్ స్టేడియంలో జరిగిన భారత్- ఐర్లాండ్ మ్యాచ్​కు ప్రీమియమ్ టికెట్ (పిచ్​కు ఎదురుగా) 1000 డాలర్లు ఉండగా, అదే టికెట్ ఇండోపాక్ మ్యాచ్​కు 2500 డాలర్లకు (రూ. 2.10 లక్షలు) పెంచారు. అంటే 150శాతం పెంచారు. ఇక డైమండ్ ప్రీమియమ్ సీట్ అత్యధికంగా 10,000 డాలర్లు (రూ. 8.30 లక్షలు)గా నిర్ణయించారు.

ఫైనల్ కంటే ఎక్కువ రేటు: దీనిపై క్రికెట్ అనలిస్ట్​లు కూడా స్పందిస్తున్నారు. 'అమెరికన్లకు క్రికెట్ గురించి ఎక్కువగా తెలీదు. అందుకనే తెలియని గేమ్ కోసం అంత ఎక్కువ ధర టికెట్లు కొనుగోలు చేసి స్టేడియానికి వెళ్లాలనుకోరు' అని ఓ నెటిజన్ కామెంట్ చేశారు. ఇక అమెరికాలో అత్యంత ఆదరణ కలిగిన బాస్కెట్‌బాల్, ఎన్​బీఏ (NBA) టోర్నమెంట్​ మ్యాచ్​లకు కూడా ఇంత ఎక్కువగా టికెట్లు లేవు అని, రీసెంట్​గా జరిగిన NBA ఫైనల్ మ్యాచ్ టికెట్ ధర కూడా అంతకంటే తక్కువ (546 డాలర్లు) ఉందని అన్నాడు.

డేంజరస్​గా మారుతున్న అమెరికన్​ టీమ్​ - మనోళ్లు జాగ్రత్తగా ఆడాల్సిందే! - T20 WorldCup 2024

పాక్ ఘోర పరాజయం - సూపర్ ఓవర్​లోనూ షాకే - T20 World Cup 2024

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.