ETV Bharat / bharat

జాబ్​ ఇప్పిస్తానని నమ్మించి మోసం- పెళ్లి చేసుకోమన్నందుకు చిత్రహింసలు- చివరకు ఏమైందంటే?

Sikkim Girl Cheated By Her FB Friend : ఉద్యోగం ఇప్పిస్తానని నమ్మించి తన వద్దకు వచ్చిన యువతిని మోసం చేసి చిత్రహింసలకు గురిచేసిన ఓ యువకుడిని పోలీసులు అరెస్టు చేశారు. దేశ రాజధాని దిల్లీలో జరిగిందీ ఘటన.

author img

By ETV Bharat Telugu Team

Published : Feb 7, 2024, 12:56 PM IST

Sikkim Girl Cheated By Her FB Friend
Sikkim Girl Cheated By Her FB Friend

Sikkim Girl Cheated By Her FB Friend : ఉద్యోగం కోసం వెతుకున్న ఓ యువతిని ట్రాప్​ చేసి చిత్రహింసలకు గురిచేసిన ఓ యువకుడిని దిల్లీ పోలీసులు అరెస్టు చేశారు. బాధితురాలి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకున్న నెబ్​​ సరాయీ పోలీసులు నిందితుడిపై కేసు నమోదు చేశారు.

సిక్కిం టు దిల్లీ
దిల్లీలో నివాసం ఉంటున్న పరాస్‌ అనే యువకుడికి సిక్కింకు చెందిన ఓ అమ్మాయితో ఫేస్​బుక్​ ద్వారా పరియం ఏర్పడింది. అప్పటికే ఉద్యోగాన్వేషణలో ఉన్న ఆ అమ్మాయికి జాబ్​ ఇప్పిస్తానని దిల్లీకి రావాలని ఆఫర్​ చేశాడు పరాస్​. దీంతో అతడిని నమ్మి జనవరి 10న దిల్లీకి చేరుకున్న ఆమె పరాస్​తో కలిసి ఖాన్‌పుర్‌లోని ఓ అపార్ట్​మెంట్​లో నివాసం ఉంది. ఈ సమయంలో వీరిద్దరూ శారీరకంగా దగ్గరయ్యారు. అలా వీరి మధ్య పెళ్లి ప్రస్తావన కూడా వచ్చింది. తనను పెళ్లి చేసుకోవాలని యువకుడిని కోరింది యువతి. ఇందుకు పరాస్​ ఆ అమ్మాయిని పెళ్లి చేసుకుంటానని నమ్మించాడు. పెళ్లి విషయంలో పరాస్​పై యువతి పదే పదే ఒత్తిడి తీసుకువచ్చింది. అలా జనవరి 30న కూడా పెళ్లి గురించి అడగ్గా కోపోద్రిక్తుడయ్యాడు పరాస్​. గదిలో ఉన్న ఇనుప రాడ్డుతో యువతి తలపై గట్టిగా బాదాడు. స్టవ్​పై ఉన్న వేడి వేడి ఆహార పదార్థాలను ఆ యువతి శరీరంపై విసిరేశాడు. దీంతో ఆ యువతి ముఖం, చేతులు కాలాయి.

అంతటితో ఆగకుండా బాధితురాలిని గదిలో బంధించి అక్కడి నుంచి పరారయ్యాడు. అలా దాదాపు నాలుగైదు గంటల పాటు గాయాలపాలైన స్థితిలోనే గదిలో బాధపడుతూ ఉంది యువతి. ఆ తర్వాత యువతి అరుపులు విన్న స్థానికులు పోలీసులకు సమాచారం అందించారు. ఘటనాస్థలికి చేరుకున్న పోలీసులు బాధితురాలిని స్థానిక ఆస్పత్రికి తరలించారు. ఆమె ఇచ్చిన స్టేట్​మెంట్​ ఆధారంగా పరాస్​పై వివిధ సెక్షన్​ల కింద కేసు నమోదు చేశారు పోలీసులు. నిందితుడు దిల్లీ నుంచి పారిపోయేందుకు ప్రయత్నించే క్రమంలో అతడిని సత్‌బరి దగ్గర అదుపులోకి తీసుకున్నారు. కాగా, ఈ ఘటనలో గాయపడ్డ యువతికి 20 చోట్ల గాయాలయ్యాయని పోలీసులు తెలిపారు.

విద్యార్థినిపై టీచర్​ లైంగిక వేధింపులు
అసిస్టెంట్​ ప్రొఫెసర్‌పై లైంగిక వేధింపుల ఆరోపణలు చేసింది ఓ యువతి. ఈ ఉదంతం యూపీ​లోని పండిట్​ దీనదయాళ్​ ఉపాధ్యాయ్​ గోరఖ్‌పుర్​ యూనివర్సిటీలో వెలుగు చూసింది. ఈ ఘటనపై బాధిత విద్యార్థిని వైస్​ ఛాన్సలర్​ సహా గవర్నర్​కు ఫిర్యాదు చేసింది. ఇందుకు సంబంధించిన వివరాలను తెలియజేస్తూ రాజ్​ భవన్​కు మెయిల్ ద్వారా ఓ లేఖను​ పంపింది. ఇందులో తనకు న్యాయం చేయాలంటూ వేడుకుంది.

తమిళ నటుడు విశాల్​ కొత్త పార్టీ! క్లారిటీ ఇచ్చిన హీరో

'మంచి పనులు చేసే వారికి గౌరవం దక్కదు'- రాజకీయాలపై నితిన్‌ గడ్కరీ ఆవేదన

Sikkim Girl Cheated By Her FB Friend : ఉద్యోగం కోసం వెతుకున్న ఓ యువతిని ట్రాప్​ చేసి చిత్రహింసలకు గురిచేసిన ఓ యువకుడిని దిల్లీ పోలీసులు అరెస్టు చేశారు. బాధితురాలి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకున్న నెబ్​​ సరాయీ పోలీసులు నిందితుడిపై కేసు నమోదు చేశారు.

సిక్కిం టు దిల్లీ
దిల్లీలో నివాసం ఉంటున్న పరాస్‌ అనే యువకుడికి సిక్కింకు చెందిన ఓ అమ్మాయితో ఫేస్​బుక్​ ద్వారా పరియం ఏర్పడింది. అప్పటికే ఉద్యోగాన్వేషణలో ఉన్న ఆ అమ్మాయికి జాబ్​ ఇప్పిస్తానని దిల్లీకి రావాలని ఆఫర్​ చేశాడు పరాస్​. దీంతో అతడిని నమ్మి జనవరి 10న దిల్లీకి చేరుకున్న ఆమె పరాస్​తో కలిసి ఖాన్‌పుర్‌లోని ఓ అపార్ట్​మెంట్​లో నివాసం ఉంది. ఈ సమయంలో వీరిద్దరూ శారీరకంగా దగ్గరయ్యారు. అలా వీరి మధ్య పెళ్లి ప్రస్తావన కూడా వచ్చింది. తనను పెళ్లి చేసుకోవాలని యువకుడిని కోరింది యువతి. ఇందుకు పరాస్​ ఆ అమ్మాయిని పెళ్లి చేసుకుంటానని నమ్మించాడు. పెళ్లి విషయంలో పరాస్​పై యువతి పదే పదే ఒత్తిడి తీసుకువచ్చింది. అలా జనవరి 30న కూడా పెళ్లి గురించి అడగ్గా కోపోద్రిక్తుడయ్యాడు పరాస్​. గదిలో ఉన్న ఇనుప రాడ్డుతో యువతి తలపై గట్టిగా బాదాడు. స్టవ్​పై ఉన్న వేడి వేడి ఆహార పదార్థాలను ఆ యువతి శరీరంపై విసిరేశాడు. దీంతో ఆ యువతి ముఖం, చేతులు కాలాయి.

అంతటితో ఆగకుండా బాధితురాలిని గదిలో బంధించి అక్కడి నుంచి పరారయ్యాడు. అలా దాదాపు నాలుగైదు గంటల పాటు గాయాలపాలైన స్థితిలోనే గదిలో బాధపడుతూ ఉంది యువతి. ఆ తర్వాత యువతి అరుపులు విన్న స్థానికులు పోలీసులకు సమాచారం అందించారు. ఘటనాస్థలికి చేరుకున్న పోలీసులు బాధితురాలిని స్థానిక ఆస్పత్రికి తరలించారు. ఆమె ఇచ్చిన స్టేట్​మెంట్​ ఆధారంగా పరాస్​పై వివిధ సెక్షన్​ల కింద కేసు నమోదు చేశారు పోలీసులు. నిందితుడు దిల్లీ నుంచి పారిపోయేందుకు ప్రయత్నించే క్రమంలో అతడిని సత్‌బరి దగ్గర అదుపులోకి తీసుకున్నారు. కాగా, ఈ ఘటనలో గాయపడ్డ యువతికి 20 చోట్ల గాయాలయ్యాయని పోలీసులు తెలిపారు.

విద్యార్థినిపై టీచర్​ లైంగిక వేధింపులు
అసిస్టెంట్​ ప్రొఫెసర్‌పై లైంగిక వేధింపుల ఆరోపణలు చేసింది ఓ యువతి. ఈ ఉదంతం యూపీ​లోని పండిట్​ దీనదయాళ్​ ఉపాధ్యాయ్​ గోరఖ్‌పుర్​ యూనివర్సిటీలో వెలుగు చూసింది. ఈ ఘటనపై బాధిత విద్యార్థిని వైస్​ ఛాన్సలర్​ సహా గవర్నర్​కు ఫిర్యాదు చేసింది. ఇందుకు సంబంధించిన వివరాలను తెలియజేస్తూ రాజ్​ భవన్​కు మెయిల్ ద్వారా ఓ లేఖను​ పంపింది. ఇందులో తనకు న్యాయం చేయాలంటూ వేడుకుంది.

తమిళ నటుడు విశాల్​ కొత్త పార్టీ! క్లారిటీ ఇచ్చిన హీరో

'మంచి పనులు చేసే వారికి గౌరవం దక్కదు'- రాజకీయాలపై నితిన్‌ గడ్కరీ ఆవేదన

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.