పాలస్తీనియన్ల గుడారాలపై ఇజ్రాయెల్ దాడి - 25 మంది మృతి, 50మందికి గాయాలు
Published : Jun 22, 2024, 7:15 AM IST
![పాలస్తీనియన్ల గుడారాలపై ఇజ్రాయెల్ దాడి - 25 మంది మృతి, 50మందికి గాయాలు Israeli Attack On Tent Camps at Rafah](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/22-06-2024/1200-675-21767338-thumbnail-16x9-gaza.jpg)
Israeli Attack On Tent Camps at Rafah :గాజాలో ఇజ్రాయెల్ బలగాల భీకర దాడులు కొనసాగుతున్నాయి. శుక్రవారం రఫా నగరానికి ఉత్తరాన నిరాశ్రయ పాలస్తీనియన్లు ఏర్పాటుచేసుకున్న గుడారాలపై ఇజ్రాయెల్ షెల్లతో విరుచుకుపడింది. ఈ ఘటనలో 25 మంది పాలస్తీనియన్లు మృతి చెందారు. మరో 50 మంది తీవ్రంగా గాయపడ్డారని గాజా ఆరోగ్య శాఖ వెల్లడించింది. సురక్షిత జోన్గా ఇజ్రాయెల్ ప్రకటించిన ప్రాంతానికి అత్యంత చేరువలో తాజా దాడులు జరిగినట్లు తెలిపింది. ఇప్పటివరకు ఇజ్రాయెల్ దాడుల్లో 37,430 మంది పాలస్తీనియన్లు మరణించినట్లు వెల్లడించింది. దాదాపు 85 వేల 650 మంది గాయపడినట్లు పేర్కొంది. గత 24 గంటల్లో 35 మంది మృతి చెందగా 130 మంది గాయపడినట్లు తెలిపింది.