తెలంగాణ

telangana

By ETV Bharat Telangana Team

Published : Aug 24, 2024, 1:17 PM IST

Updated : Aug 24, 2024, 1:24 PM IST

ETV Bharat / videos

LIVE : మహిళా కమిషన్‌ ఎదుట హాజరైన అనంతరం మీడియాతో మాట్లాడుతున్న కేటీఆర్ - KTR LIVE

KTR Live : మహాలక్ష్మి ఉచిత ఆర్టీసీ బస్సు పథకంపై అనుచిత వ్యాఖ్యలు చేశారనే ఫిర్యాదు నేపథ్యంలో బీఆర్​ఎస్​ కార్యనిర్వాహక అధ్యక్షుడు కేటీఆర్‌ నేడు రాష్ట్ర మహిళా కమిషన్‌ ఎదుట హాజరయ్యారు. భారత రాష్ట్రసమితి మహిళ ప్రతినిధులు, జీహెచ్​ఎంసీ కార్పొరేటర్లు కేటీఆర్‌ వెంట వచ్చారు. హైదరాబాద్‌ బుద్ధ భవన్‌లోని మహిళ కమిషన్‌ ముందు హాజరైన ఆయన, తన వ్యాఖ్యలపై వివరణ ఇచ్చారు. కేటీఆర్‌తోపాటు కార్యాలయం లోపలికి వెళ్లేందుకు బీఆర్​ఎస్​ మహిళా కార్పొరేట్లకు అనుమతి ఇవ్వకపోవడంతో వారు ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. అదే సమయంలో మహిళలకు బహిరంగ క్షమాపణలు చెప్పాలని డిమాండ్‌ చేస్తూ మహిళా కాంగ్రెస్‌ అధ్యక్షురాలు సునీత నేతృత్వంలో ఆ పార్టీ శ్రేణులు బుద్ధభవన్ వద్ద ఆందోళనకు దిగడం ఉద్రిక్తతకు దారి తీసింది. కాంగ్రెస్‌కు పోటాపోటీగా బీఆర్​ఎస్​ మహిళ శ్రేణులు కూడా ఆందోళనకు దిగడంతో ఉద్రిక్తత నెలకొంది. పరస్పరం తోపులాటలు, నినాదాలతో మహిళా కమిషన్‌ కార్యాలయం ఎదుట పరిస్థితి రణరంగంగా మారింది. కమిషన్‌ ఎదుట హాజరైన కేటీఆర్​ మీడియాతో మాట్లాడుతున్నారు.
Last Updated : Aug 24, 2024, 1:24 PM IST

ABOUT THE AUTHOR

...view details