ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / videos

రాష్ట్రంలో సమర్థవంతమైన నాయకత్వం అవసరం : ప్రొఫెసర్‌ చిన్నయసూరి - Jana Chaitanya Vedika

By ETV Bharat Andhra Pradesh Team

Published : Apr 20, 2024, 10:50 AM IST

Jana Chaitanya Vedika Election Program in Guntur District : రాష్ట్రానికి నిర్దేశిత రాజధాని లేక అభివృద్ధిలో వెనుకబడిపోయిందని యూనివర్సీటీ ఆఫ్​ హైదరాబాద్​ పూర్వ ప్రొఫెసర్​ కొండవీటి చిన్నయసూరి పేర్కొన్నారు. గుంటూరులో జన చైతన్య వేదిక ఆధ్వర్యంలో రాష్ట్రం​లో ఎన్నికల తీరుతెన్నులు అనే అంశంపై ప్రొఫెసర్​ కొండవీటి చిన్నయసూరితో ముఖాముఖి కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో సిటీజన్​ ఫర్​ డెమోక్రసీ సంయుక్త కార్యదర్శి లక్ష్మణ్​ రెడ్డితో పాటు తదితరులు పాల్గొన్నారు.

అక్షరాస్యత, మానవాభివృద్ధి, నీటి పారుదల, మౌలిక సదుపాయాల కల్పనలో రాష్ట్రం అభివృద్ధి చెందలేదని ప్రొఫెసర్​ చిన్నయసూరి పేర్కొన్నారు. గత 50 ఏళ్లగా రాష్ట్రం అనేక రకాలుగా నష్టపోయిందని పేర్కొన్నారు. రాష్ట్రంలో సమర్థవంతమైన నాయకత్వం అవసరమని ఈ సందర్భంగా తెలియజేశారు. ఈ నెలలో పింఛన్ల పంపిణీ కార్యక్రమంలో ఎదురైన ఇబ్బందుల్ని దృష్టిలో పెట్టుకొని  మే నెలలో ఇళ్ల వద్దే పింఛన్లు పంపిణీ చేయాలని ఎన్నికల కమిషన్​ను లక్ష్మణ్​ రెడ్డి కోరారు. రాజీనామా చేసిన వాలంటీర్లు పోలింగ్​ ఏజెంట్లు పెట్టేందుకు నేతలు యత్నిస్తున్నారని ఆరోపించారు. 

ABOUT THE AUTHOR

...view details