తెలంగాణ

telangana

ETV Bharat / state

యాదాద్రి దర్శనానికి వెళ్తున్నారా? అయితే వెళ్లేముందు ఈ నిబంధనలు తెలుసుకోండి

యాదాద్రి లక్ష్మి నరసింహ స్వామి ఆలయంలో కొత్త నిబంధనలు - ఉత్తర్వులు జారీ చేసిన ఈవో - నిబంధనలు భక్తులందరూ పాటించాలని విజ్ఞప్తి

PHOTO AND VIDEO BAN IN YADADRI
Photos and Videos Banned in Yadadri (ETV Bharat)

By ETV Bharat Telangana Team

Published : 4 hours ago

Photos and Videos Banned in Yadadri : సాధారణంగా ఫ్రెండ్స్​తో అయితే సదదాగా గడిపేందుకు పర్యాటక ప్రాంతాలకు వెళ్తుంటాం. అదే ఫ్యామిలీతో అయితే ఆధ్యాత్మిక ప్రాంతాలకు కూడా వెళ్తాం. దేవుడిని దర్శనం చేసుకుని ఎప్పుడు గుర్తిండిపోయేలా ఆలయ పరిసర ప్రాంతాలను మన మొబైల్​ ఫోన్​లో చిత్రీకరిస్తాం. అంతే కాకుండా సెల్ఫీలు అంటూ, ఫ్యామిలీతో గుడికి వచ్చినట్లు తెలిసేలా ఫొటోలు దిగుతాం. చిన్న చిన్న ఆలయాల్లో అయితే ఫర్వాలేదు కానీ ప్రసిద్ధి చెందిన దేవాలయాల్లో కూడా కొందరు ఫొటోలు తీసుకోవడానికి ప్రయత్నిస్తుంటారు. పైగా ఈ రోజుల్లో అయితే కేవలం ఫొటోలే కాకుండా రీల్స్​ కోసమని ఆలయంలోనే వీడియోలు తీసుకుంటున్నారు.

భక్తులు సైతం ఆలయంలో కొందరు చేస్తున్న రీల్స్​ చూసి మండిపడుతున్నారు. రీల్స్​ కోసమే గుడికి వస్తున్నారంటూ విరుచుకుపడుతున్నారు. ఈ నేపథ్యంలో రాష్ట్రంలో ప్రసిద్ధి పుణ్యక్షేత్రమైన యాదాద్రి ఆలయ అధికారులు భక్తులకు షాక్​ ఇచ్చారు. ఇకపై గుడికి వచ్చే భక్తులు అలా చేయకూడదని హెచ్చరించారు. ఈ మేరకు ఫొటోలు, వీడియోలు తీయడాన్ని నిషేధిస్తూ ప్రెస్ నోట్ విడుదల చేశారు. ఆలయ పరిసరాల్లో ఆధ్యాత్మిక శోభ, క్షేత్ర ప్రతిష్ఠ, భక్తుల మనోభావాలు, భక్తుల విశ్వాసం దెబ్బతినేలా అధ్యాత్మికేతర వ్యక్తిగత ఫోటోలు, వీడియోలు ఇకపై ఎవరు కూడా చిత్రీకరించొద్దు అంటూ హెచ్చరించారు. ఆలయ పరిసరాల్లో అనుమతి ఉన్న చోట ఆధ్యాత్మిక ఉద్దేశంతో ఫొటో, వీడియో చిత్రీకరణకు ఎలాంటి అభ్యంతరం లేదని ఆలయ ఈఓ భాస్కర్ రావు తెలిపారు.

ఆలయంలో ఎమ్మెల్యే కౌశిక్ రెడ్డి రీల్స్ :ఎవరైనా అనుమతి లేకుండా ఫొటోలు, వీడియోలు తీసుకుంటే వారిపై చర్యలు తీసుకుంటామని ఈఓ భాస్కర్ రావు పేర్కొన్నారు. ఎప్పటి నుంచో ఆలయంలో భక్తులు ఫొటోలు, వీడియో తీసుకుంటున్నారు. కానీ ఇప్పుడే ఈ నిషేధం ఎందుకు వచ్చిందంటే.. ఇటీవలే హుజురాబాద్ ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి కుటుంబ సభ్యులతో కలిసి యాదాద్రి లక్ష్మీ నరసింహ స్వామిని దర్శించుకున్నారు. ఈ క్రమంలో ఆలయంలో పాడి కౌశిక్ రెడ్డి, ఆయన కుటుంబ సభ్యలు రీల్స్​ చేశారు. ఇది సోషల్​ మీడియాలో వైరల్​ కావడంతో భక్తుల నుంచి అభ్యంతరాలు వ్యక్తమయ్యాయి. స్పందించిన యాదాద్రి ఆలయ ఈవో భాస్కర్ రావు, ఇకపై ఎవరూ ఫోటోలు, వీడియోలు తీసుకోవద్దంటూ ప్రెస్ నోట్ విడుదల చేశారు.

యాదాద్రి 'లడ్డూ' రిజల్ట్స్​ వచ్చేశాయ్ - స్వచ్ఛత పరీక్షల్లో ఏం తేలిందంటే?

టీటీడీ తరహాలో యాదగిరిగుట్టకు టెంపుల్ బోర్డు ఏర్పాటు చేయండి : సీఎం రేవంత్ కీలక ఆదేశాలు - Yadagirigutta Temple Board

ABOUT THE AUTHOR

...view details