తెలంగాణ

telangana

ETV Bharat / state

కిలోల కొద్దీ కుళ్లిన చికెన్ - బార్లకు ఇక్కడి నుంచే సరఫరా! - TASK FORCE RAIDS ON CHICKEN CENTER

బేగంపేట్ అన్నానగర్‌లో ఆహారభద్రత అధికారుల తనిఖీలు - అక్రమంగా నిల్వ ఉంచిన 600 కిలోల చికెన్‌ను గుర్తించిన అధికారులు - ఇటీవల వచ్చిన ఫిర్యాదుల నేపథ్యంలో తనిఖీలు చేసిన టాస్క్​ఫోర్స్, ఆహార భద్రత అధికారులు

safety officials
safety officials Inspections (ETV Bharat)

By ETV Bharat Telangana Team

Published : Feb 13, 2025, 3:43 PM IST

Updated : Feb 13, 2025, 7:04 PM IST

Inspection By Food Safety Officer : సికింద్రాబాద్ బేగంపేట్​లోని అన్నానగర్​లో పలు చికెన్ సెంటర్లపై ఆహారభద్రత, టాస్క్​ఫోర్స్ అధికారులు సంయుక్తంగా దాడులు నిర్వహించారు. ఈ దాడులలో విస్తుపోయే నిజాలు బయటపడ్డాయి. చికెన్ సెంటర్ల నిర్వాహకుల ఏకంగా 600 కిలోల కుళ్లిన చికెన్​ను నిల్వ ఉంచి విక్రయిస్తున్నట్లు అధికారులు గుర్తించారు. పూర్తిగా కుళ్లి పాడైపోయిన స్థితిలో ఉన్న చికెన్​ను విక్రయించి లాభాలు సంపాదిస్తున్నారని కంటోన్మెంట్ శానిటేషన్ సూపరింటెండెంట్ దేవేందర్ వెల్లడించారు. ఈ దాడులలో టాస్క్​ఫోర్స్ ఎస్సై గగన్ దీప్ అతని బృందం పాల్గొంది.

తక్కువ ధరలకే మద్యం షాపులకు సరఫరా : ఎస్ఎస్ఎస్, రవి చికెన్ దుకాణాలలో కోల్డ్ స్టోరేజీలో నిల్వ ఉంచిన 600 కిలోల చికెన్​ను స్వాధీనం చేసుకున్నారు. రెండు మూడు నెలల పాటు నిల్వ ఉంచిన కోళ్ల మాంసాన్ని అతి తక్కువ ధరలకే సమీపంలోని మద్యం దుకాణాలు, బార్లకు విక్రయిస్తున్నారని అధికారులు తెలిపారు. స్థానికుల ఫిర్యాదు మేరకు దాడులు నిర్వహించిన ఆహారభద్రత, టాస్క్​ఫోర్స్ అధికారులు పాడైపోయిన మాంసాన్ని గుర్తించి సీజ్ చేశారు. రాష్ట్రంలో ఇప్పటికే బర్డ్ ఫ్లూ వ్యాధి విస్తరిస్తున్న నేపథ్యంలో కుళ్లిన చికెన్ విక్రయించి ప్రజల ప్రాణాలతో చెలగాటమాడుతున్న ఇలాంటి దుకాణాలపై కఠిన చర్యలు తీసుకోవాలని స్థానికులు డిమాండ్ చేస్తున్నారు.

Last Updated : Feb 13, 2025, 7:04 PM IST

ABOUT THE AUTHOR

...view details