Realtors Plan 500 Crore Govt Land Occupied at Hyderabad :హైదరాబాద్లోని ఐటీ కారిడార్ మణికొండ సమీపంలో రూ.500 కోట్ల విలువైన ప్రభుత్వ భూమిని కాజేసేందుకు కొందరు వ్యక్తులు యత్నించారు. దీనిని ఆక్రమించుకునేందుకు ఇద్దరు రియల్టర్లు సహా 10 మంది కలిసి మాస్టర్ ప్లాన్ వేశారు. ఈ విషయమై గండిపేట తహసీల్దార్ ఎన్.శ్రీనివాస్ రెడ్డి సైబరాబాద్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. దీంతో రంగంలోకి దిగిన పోలీసులు, రెవెన్యూ అధికారుల సహాయంతో వారి గుట్టును రట్టు చేశారు.
Police and Revenue Officers Rescue Pokalwada Govt Land : మణికొండ సమీపంలోనిపోకల్వాడలో హెచ్ఎండీఏ, ప్రైవేట్ భూముల మధ్య ఉన్న రూ.500 కోట్ల విలువైన ఐదెకరాల ప్రభుత్వ భూమి ఉంది. దీనిని కాజేయడానికి రియల్టర్లు రాఘవేందర్ రెడ్డి, రవీందర్ యాదవ్ 3 సంవత్సరాలుగా ప్రయత్నిస్తున్నారు. స్థానికంగా ఉండే పూస ప్రహ్లాద్, పూస రవీందర్లను కలిసి ‘మీ పేరు మీద నకిలీ పత్రాలు సృష్టిస్తాం, భూములు చేజిక్కిన తర్వాత రూ.కోట్లలో డబ్బులిస్తామంటూ' వారిని ఒప్పించారు.
రూ.10 కోట్ల ఆఫర్ - రూ.కోటి అడ్వాన్స్ :అనంతరం రియల్టర్లు రాఘవేందర్రెడ్డి, రవీందర్ యాదవ్ నల్లగండ్లలోని అపర్ణ సరోవర్లో ఉంటున్న స్థిరాస్తి వ్యాపారులు మోహన్ బాబు, శివరామ్ కుమార్లను సంప్రదించి ఈ వ్యవహారంలో భాగస్వాములుగా చేసుకున్నారు. ఈ క్రమంలోనే రంగారెడ్డి జిల్లా కలెక్టర్ కార్యాలయంలోని ధరణి పోర్టల్లో పని చేస్తున్న దీపావత్ నరేశ్, దీపావత్ శ్రీనివాస్లను కలిశారు. నకిలీ పత్రాల ఆధారంగా ఈ - పాస్ పుస్తకాలు మంజూరు చేయాలని వారిని ఒప్పించారు. ఇందుకు రూ.10 కోట్లు ఇస్తామని, అడ్వాన్సుగా రూ.కోటి ఇస్తామని నరేశ్, శ్రీనివాస్లకు ఆశచూపారు.